వైసీపీ సర్కారుపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా వైసీపీకి చెందిన అనేక మంది నాయకులు వ్యాఖ్యలు చేశారు. వీరిలో కాపు నాయకులే ఎక్కువగా ఉన్నారు. సరే.. ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా.. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వైసీపీలోనే హైలెట్గా నిలిచాయి. ఆయన చాలా నర్మగర్భ వ్యాఖ్యలు చేసినట్టు కొందరు చర్చించుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య చిత్రం 200 రోజులు(కొన్ని ధియేటర్లలో) ఆడిన నేపథ్యంలో ఫంక్షన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. అయితే.. ఈ సందర్భంగా ఆయన సినిమా ఇండస్ట్రీని పిచ్చుకతో పోల్చారు. “పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాదిరిగా సినిమా ఇండస్ట్రీపై పడతారేంటి!” అని అన్నారు. ఈ ఒక్క వ్యాఖ్యను బేస్ చేసుకుని బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. “అయితే.. సినిమా పిచ్చుకేనని ఒప్పుకొంటున్నారన్న మాట” అని అన్నారు. చిత్రపరిశ్రమ పిచ్చుకేనన్న మాట.. అని చెప్పుకొచ్చారు. అంటే.. బొత్స ఉద్దేశం ప్రకారం.. సినిమా ఇండస్ట్రీ ప్రభావం పెద్దగా లేదనే ధోరణి కనిపించింది.
వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో సినిమా ఇండస్ట్రీ ప్రభావం ఉంటుందని.. జనసేన అధినేత పవన్ దూకుడు పెరుగుతుందని, ఇది వైసీపీకి మరింత ఇబ్బంది అవుతుందని.. అన్ని వర్గాల్లోనూ చర్చ జరుగుతున్న సమయంలో చిరు చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుని బొత్స చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సినిమా అంటే ఏదో అనుకున్నాం. కానీ, అది పిచ్చుకే.. మా ప్రభుత్వాన్ని కదపలేదు. అన్న విధంగా బొత్స వ్యాఖ్యలు ఉన్నాయని వైసీపీ నాయకులు చెబుతుండడం గమనార్హం. ఏదేమైనా.. ఎంతో మంది కౌంటర్లు ఇచ్చినా.. బొత్స తరహాలో ఎవరూ కౌంటర్ ఇవ్వలేదని కూడా చెబుతున్నారు.
This post was last modified on August 9, 2023 10:38 am
యూత్ హీరో రాజ్ తరుణ్ కు మంచి హిట్టు దక్కి ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టం. సీనియర్ హీరోలతో సపోర్టింగ్…
ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…