వైసీపీ సర్కారుపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా వైసీపీకి చెందిన అనేక మంది నాయకులు వ్యాఖ్యలు చేశారు. వీరిలో కాపు నాయకులే ఎక్కువగా ఉన్నారు. సరే.. ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా.. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వైసీపీలోనే హైలెట్గా నిలిచాయి. ఆయన చాలా నర్మగర్భ వ్యాఖ్యలు చేసినట్టు కొందరు చర్చించుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య చిత్రం 200 రోజులు(కొన్ని ధియేటర్లలో) ఆడిన నేపథ్యంలో ఫంక్షన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. అయితే.. ఈ సందర్భంగా ఆయన సినిమా ఇండస్ట్రీని పిచ్చుకతో పోల్చారు. “పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాదిరిగా సినిమా ఇండస్ట్రీపై పడతారేంటి!” అని అన్నారు. ఈ ఒక్క వ్యాఖ్యను బేస్ చేసుకుని బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. “అయితే.. సినిమా పిచ్చుకేనని ఒప్పుకొంటున్నారన్న మాట” అని అన్నారు. చిత్రపరిశ్రమ పిచ్చుకేనన్న మాట.. అని చెప్పుకొచ్చారు. అంటే.. బొత్స ఉద్దేశం ప్రకారం.. సినిమా ఇండస్ట్రీ ప్రభావం పెద్దగా లేదనే ధోరణి కనిపించింది.
వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో సినిమా ఇండస్ట్రీ ప్రభావం ఉంటుందని.. జనసేన అధినేత పవన్ దూకుడు పెరుగుతుందని, ఇది వైసీపీకి మరింత ఇబ్బంది అవుతుందని.. అన్ని వర్గాల్లోనూ చర్చ జరుగుతున్న సమయంలో చిరు చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుని బొత్స చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సినిమా అంటే ఏదో అనుకున్నాం. కానీ, అది పిచ్చుకే.. మా ప్రభుత్వాన్ని కదపలేదు. అన్న విధంగా బొత్స వ్యాఖ్యలు ఉన్నాయని వైసీపీ నాయకులు చెబుతుండడం గమనార్హం. ఏదేమైనా.. ఎంతో మంది కౌంటర్లు ఇచ్చినా.. బొత్స తరహాలో ఎవరూ కౌంటర్ ఇవ్వలేదని కూడా చెబుతున్నారు.
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…
అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…
ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…
పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది డిసెంబర్ లో దురంధర్ విడుదలైనప్పుడు ఎవరూ దాని సునామిని ఊహించలేదు. వంద కోట్లు…
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…