టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెచ్చిపోయారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మాచర్లలో లోకేష్ మాట్లాడుతూ.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నాలుగు సార్లు గెలిచించారని, కానీ ఇక్కడ అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్గా ఉందన్నారు. గ్రానైట్ లారీల నుంచి మామూళ్లు, పక్క రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల ద్వారా పిన్నెల్లి సోదరులు రూ.కోట్లు సంపాదించారని లోకేష్ విమర్శించారు. పిన్నెల్లి సోదరులను పిల్లి బ్రదర్స్ అని లోకేష్ ఎద్దేవా చేశారు. గుట్కా, మట్కా, పేకాట గ్యాంగులను నడిపిస్తున్నారని ఆరోపించారు.
ఇప్పుడు లోకేష్ వ్యాఖ్యలపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తీవ్ర స్థాయిలో చెలరేగారు.లోకేష్ నిజంగా చంద్రబాబుకే పుట్టి ఉంటే, మగాడు అయి ఉంటే తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.వెయ్యి కోట్ల అవినీతి అని అనడం కాదు, నిరూపించాలంటూ సవాల్ విసిరారు. మీ అయ్య వల్లే కాలేదు ఇక నువ్వు ఏం చేస్తావంటూ రామకృష్ణారెడ్డి ఫైరయ్యారు.
లోకేష్ను త్వరలోనే ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేరుస్తారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. లోకేష్ పువ్వు కాదు.. వెర్రి పువ్వు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి రాజకీయ అనుభవం అంత కూడా లోకేష్ జీవితం లేదని, అలాంటిది పెద్దిరెడ్డిని విమర్శిస్తావా అంటూ ఊగిపోయారు. వచ్చే ఎన్నికల్లో వార్డు మెంబర్గా కూడా లోకేష్ను గెలవనీయమని ఎమ్మెల్యే అన్నారు. పల్నాడు జిల్లాలో ఏడుకు ఏడు నియోజకవర్గాలు గెలుస్తామని రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…