Political News

ఇక అన్నీ ఢిల్లీలోనేనా?

ప్రత్యర్ధి పార్టీలను దెబ్బకొట్టి అధికారంలోకి రావాలన్నది బీజేపీ నేతల పట్టుదల. ప్రత్యర్ధిపార్టీలంటే ముఖ్యంగా బీఆర్ఎస్ అనే అర్ధం. ఎందుకంటే అధికారంలో ఉన్నపార్టీ కాబట్టే. అధికారంలో ఉంది కాబట్టే ఇంటెలిజెన్స్, పోలీసులు వ్యవస్ధలు  మొత్తం బీఆర్ఎస్ కంట్రోల్లోనే ఉంటుంది. హైదరాబాద్ పార్టీ ఆఫీసులోనో లేకపోతే ఏదైనా హోటల్లోనో ఎలాంటి మీటింగులు పెట్టుకున్నా వెంటనే అధికారపార్టీకి తెలిసిపోతోందట. అందుకనే ఇకనుండి కీలకమైన భేటీలన్నీ ఢిల్లీల్లోనే జరపాలని అగ్రనేతలు నిర్ణయించినట్లు సమాచారం.  

నిర్ణయాలు తీసుకోవటం, తీసుకున్న నిర్ణయాలు అమల్లోకి వచ్చిన తర్వాత అందరికీ తెలియటం ఒకఎత్తు. కానీ చర్చల్లో ఉండగానే కొన్ని నిర్ణయాలు అధికారపార్టీకి చేరిపోయాయట. అందుకనే ఇకనుండి రాష్ట్ర స్ధాయిలోని కీలక నేతల సమావేశాలు కూడా ఢిల్లీలోనే జరపాలని డిసైడ్ అయ్యింది. ఇది కొంచెం శ్రమ, ఖర్చులతో కూడిన వ్యవహారమే అయినప్పటికి గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా భేటీలను హైదరాబాద్ నుండి ఢిల్లీకి మార్చక తప్పటంలేదని అనుకుంటున్నారు.

పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే నిఘావ్యవస్ధ ఎంత పటిష్టంగా ఉండాలో ప్రత్యేకించి ఎవరికీ చెప్పక్కర్లేదు. ఇదే సమయంలో తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న చర్చలన్నీ సమావేశంలో పాల్గొన్న నేతల మధ్యే ఉండాలి. అంతేకానీ ఒకవైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు లీకులు వెళ్ళిపోతుంటే ఇక చర్చలేంటి, తీసుకునే నిర్ణయాలేంటి ? మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ వేసుకున్న ప్రతి ప్లాన్ బీఆర్ఎస్ కు తెలిసిపోయిందట. ఎలా తెలిసిపోతోందనే విషయమై ఆరా తీయటానికి అప్పట్లో పార్టీ అగ్రనేతలు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ తెలుసుకోలేకపోయారు.

అయితే పోలింగ్ మరో వారంరోజులుందనగా చాలామంది బీజేపీ నేతలు బీఆర్ఎస్ లో చేరిపోయారు. దాంతో తమ పార్టీ నేతల్లోనే ఎవరో బీఆర్ఎస్ కు ఉప్పందించారనే విషయం అర్ధమైంది. అందుకనే అప్పటినుండి బీజేపీ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ చాలాకాలంగా జాగ్రత్తగా ఉంది. మంతనాలు, చేరికలంతా అయితే కర్నాటక లేకపోతే ఢిల్లీలోనే జరుగుతున్నది. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా ఏ నేత ఏ పార్టీలో ఉంటారో కూడా తెలీటంలేదు. అందుకనే ప్రత్యర్ధులను దెబ్బతీయటమే టార్గెట్ గా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. 

Share
Show comments
Published by
Tharun

Recent Posts

రేపే ర‌ణ‌భేరి.. ‘గాంధీ’ల ప‌రువు ద‌క్కుతుందా?

దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఐదో ద‌శ పోలింగ్ సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. మొత్తం 6…

27 mins ago

తేనెతుట్టెను గెలుకుతున్న రేవంత్ !

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…

1 hour ago

సేఫ్ గేమ్ ఆడుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాత

ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…

2 hours ago

మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డి కోసం… బ్లూ కార్నర్ నోటీసు!

భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇదోక అనూహ్య‌మైన.. అస‌హ్యించుకునే ఘ‌ట‌న‌. ఈ దేశాన్ని పాలించి, రైతుల మ‌న్న‌న‌లు, మ‌హిళ‌ల మ‌న్న‌న‌లు పొందిన…

3 hours ago

జ‌గ‌న్.. నీరో : జేడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. నీరో చ‌క్ర‌వ‌ర్తిని త‌ల‌పిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సంచ ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

4 hours ago

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ..కప్ కొడతారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…

4 hours ago