Political News

పంతం నెగ్గించుకున్న మోడీ.. ఢిల్లీ అధికారాల‌పై బిల్లు పాస్‌

దేశ‌రాజ‌ధాని ప్రాంత‌మైన ఢిల్లీ రాష్ట్రంపై స‌ర్వ‌స‌త్తాక అధికారాల‌ను త‌న చేతిలో పెట్టుకునేందుకు ఉద్దేశిం చిన ఢిల్లీ స‌ర్వీసుల బిల్లును కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు పంతం ప‌ట్టి మ‌రీ  ఆమోదించుకుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే లోక్‌స‌భ‌లో సునాయాసంగా ఈ బిల్లు ఆమోదం పొందిన ద‌రిమిలా.. సోమ‌వారం సాయంత్రం దీనిని రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. దీనిపై సుదీర్ఘంగా 4 గంట‌ల పాటు స‌భ‌లో చ‌ర్చ‌సాగింది.

అధికార, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధంతోపాటు.. చ‌ర్చ‌ల‌కు వేదిక‌గా మారిన రాజ్య‌స‌భ‌లో.. చివ‌ర‌కు నిర్వ‌హించిన ఓటింగ్‌లో ‘గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ స‌వ‌ర‌ణ బిల్లు–2023’ను రాజ్య‌స‌భ ఆమోదించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చల‌ అనంతరం సోమ‌వారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో సభాపతి స్థానంలో ఉన్న ఉప స‌భాప‌తి హ‌రివంశ్ సింగ్ నారాయ‌ణ‌ ఓటింగ్‌ నిర్వహించారు.

బిల్లుకు అనుకూలంగా 131 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 102 మంది ఎంపీలు ఓటువేశారు. దీంతో బిల్లు ఆమోదానికి కావాల్సిన మెజారిటీ ఓట్లుల‌భించాయ‌ని స‌భాప‌తి ప్ర‌క‌టిస్తూ.. బిల్లు ఆమోదం పొందిన‌ట్టు తెలిపారు. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంప‌నున్నారు. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము సంతకంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది.

ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 238. అధికార ఎన్డీయేతోపాటు ఈ బిల్లు విషయంలో ఆ కూటమికి అనుకూలంగా ఉన్న సభ్యుల సంఖ్య 131. వారంతా బిల్లుకు మద్దతు పలికారు. ఇక విపక్ష ‘ఇండియా’ కూటమితోపాటు ఇతర విపక్ష సభ్యుల సంఖ్య 104 ఉండగా, బిల్లుకు వ్యతిరకంగా 102 ఓట్లు మాత్రమే వచ్చాయి. మిగిలిన‌ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు.

మొత్తానికి న్ర‌ధాని న‌రేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలు పంతం ప‌ట్టి మ‌రీ ఢిల్లీపై పట్టుబిగించ‌డం గ‌మ‌నార్హం. నిజానికి రాజ‌కీయాల్లో పంతాలు ప‌ట్టింపులు కామ‌నే. కానీ, కేంద్ర పాలిత ప్రాంతం పేరుతో పూర్తిగా త‌మ‌కే అధికారాలు ద‌క్కేలా వ్య‌వ‌హరించడం.. ఈ నేప‌థ్యంలో ఇత‌ర పార్టీల‌ను కూడా త‌మ వైపు మ‌లుచుకోవ‌డం.. వంటివే ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. ఏదేమైనా మోడీ పంతం అయితే.. నెగ్గేసింది. 

Satya

Recent Posts

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

2 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

3 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

3 hours ago

దీవానా సమస్య సెన్సార్ మాత్రమేనా

మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…

3 hours ago

రీ-నీట్… ఇంత చేసినా మళ్లీ సందేహాలు, ప్రశ్నలు!?

రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…

4 hours ago

పుట్టినరోజు సంబరం… జన నాయకుడి మౌనం

ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…

5 hours ago