Political News

పంతం నెగ్గించుకున్న మోడీ.. ఢిల్లీ అధికారాల‌పై బిల్లు పాస్‌

దేశ‌రాజ‌ధాని ప్రాంత‌మైన ఢిల్లీ రాష్ట్రంపై స‌ర్వ‌స‌త్తాక అధికారాల‌ను త‌న చేతిలో పెట్టుకునేందుకు ఉద్దేశిం చిన ఢిల్లీ స‌ర్వీసుల బిల్లును కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు పంతం ప‌ట్టి మ‌రీ  ఆమోదించుకుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే లోక్‌స‌భ‌లో సునాయాసంగా ఈ బిల్లు ఆమోదం పొందిన ద‌రిమిలా.. సోమ‌వారం సాయంత్రం దీనిని రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. దీనిపై సుదీర్ఘంగా 4 గంట‌ల పాటు స‌భ‌లో చ‌ర్చ‌సాగింది.

అధికార, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధంతోపాటు.. చ‌ర్చ‌ల‌కు వేదిక‌గా మారిన రాజ్య‌స‌భ‌లో.. చివ‌ర‌కు నిర్వ‌హించిన ఓటింగ్‌లో ‘గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ స‌వ‌ర‌ణ బిల్లు–2023’ను రాజ్య‌స‌భ ఆమోదించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చల‌ అనంతరం సోమ‌వారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో సభాపతి స్థానంలో ఉన్న ఉప స‌భాప‌తి హ‌రివంశ్ సింగ్ నారాయ‌ణ‌ ఓటింగ్‌ నిర్వహించారు.

బిల్లుకు అనుకూలంగా 131 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 102 మంది ఎంపీలు ఓటువేశారు. దీంతో బిల్లు ఆమోదానికి కావాల్సిన మెజారిటీ ఓట్లుల‌భించాయ‌ని స‌భాప‌తి ప్ర‌క‌టిస్తూ.. బిల్లు ఆమోదం పొందిన‌ట్టు తెలిపారు. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంప‌నున్నారు. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము సంతకంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది.

ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 238. అధికార ఎన్డీయేతోపాటు ఈ బిల్లు విషయంలో ఆ కూటమికి అనుకూలంగా ఉన్న సభ్యుల సంఖ్య 131. వారంతా బిల్లుకు మద్దతు పలికారు. ఇక విపక్ష ‘ఇండియా’ కూటమితోపాటు ఇతర విపక్ష సభ్యుల సంఖ్య 104 ఉండగా, బిల్లుకు వ్యతిరకంగా 102 ఓట్లు మాత్రమే వచ్చాయి. మిగిలిన‌ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు.

మొత్తానికి న్ర‌ధాని న‌రేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలు పంతం ప‌ట్టి మ‌రీ ఢిల్లీపై పట్టుబిగించ‌డం గ‌మ‌నార్హం. నిజానికి రాజ‌కీయాల్లో పంతాలు ప‌ట్టింపులు కామ‌నే. కానీ, కేంద్ర పాలిత ప్రాంతం పేరుతో పూర్తిగా త‌మ‌కే అధికారాలు ద‌క్కేలా వ్య‌వ‌హరించడం.. ఈ నేప‌థ్యంలో ఇత‌ర పార్టీల‌ను కూడా త‌మ వైపు మ‌లుచుకోవ‌డం.. వంటివే ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. ఏదేమైనా మోడీ పంతం అయితే.. నెగ్గేసింది. 

This post was last modified on August 8, 2023 11:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమలు బ్యూటీకి సీనియర్ స్టార్ల ఛాన్సులు

గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…

5 hours ago

సునీతా విలియమ్స్ భారత పర్యటన.. ఎప్పుడంటే?

అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…

5 hours ago

IPL 2025: 13 ఏళ్ల కుర్రాడి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న…

6 hours ago

DSP విలువ తెలిసినట్టు ఉందే

సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…

6 hours ago

ఆదివారం రిలీజ్ ఎందుకు భాయ్

సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…

7 hours ago

క్షేమంగా తిరిగొచ్చిన సునీత… అమెరికా, భారత్ లో సంబరాలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…

7 hours ago