బీజేపీ ఎమ్మెల్యే, బలమైన నేత రాజాసింగ్.. రాజకీయాలకు దూరమవుతున్నారా? వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం కష్టమేనా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తాజాగా అసెంబ్లీలో రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణమని చెబుతున్నారు. తానైతే మళ్లీ సభలో ఉండను అని స్వయంగా రాజా సింగ్ చెప్పడం చర్చకు దారి తీసింది.
ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ”ఇప్పుడు సభలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు వచ్చేసారి శాసన సభలోకి రావొచ్చు. రాకపోవచ్చు. నేనైతే మళ్లీ ఈ సభలో ఉండను. అసెంబ్లీలో మళ్లీ అడుగుపెట్టకుండా నా చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయి” అని భావోద్వేగంతో పేర్కొన్నారు. గోషామహల్ నియోజకవర్గంలోని ధూల్పేట్లో లోధి ప్రజలకు ప్రభుత్వం తోడుగా ఉండాలని ఆయన కోరారు. దీంతో రాజాసింగ్ వ్యాఖ్యల వెనుక ఏదో దాగి ఉందనే చర్చ మొదలైంది.
2014, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసింగ్ గెలిచారు. 2018లో అయితే బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే. కానీ ఇటీవల హింసను ప్రేరేపించేలా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైంది. జైలుకు కూడా వెళ్లి వచ్చారు. మరోవైపు బీజేపీ అధిష్ఠానం ఆయన్ని సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. అంతే కాకుండా గోషామహల్ నియోజకవర్గానికి ఆయన్ని దూరం చేసేలా పార్టీ ప్రయత్నిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో ఇంటా, బయట తనపై కుట్రలు చేస్తున్నారని రాజాసింగ్ ఇప్పటికే చెప్పారు. గోషామహల్ నియోజకవర్గాన్ని వదులకోవాల్సి వస్తే రాజకీయాలకు దూరమవుతానని కూడా అన్నారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…