లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ.. ఇతర పార్టీలతో సమాన దూరం పాటిస్తూ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ, సమకాలీన అంశాలపై విశ్లేషణలు చేస్తుంటారు. ఏ పార్టీతోనూ ఆయన సన్నిహితంగా ఉండరు. అలా అని వైరం కూడా పెట్టుకోరు. కానీ తాజాగా జేపీ.. ఏపీ అధికార పార్టీ వైసీపీకి దగ్గరవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం జగన్తో జేపీ చాలా సేపు ముచ్చటించడమే అందుకు కారణమని తెలుస్తోంది.
మాజీ ఐఏఎస్ అధికారి అయిన జేపీ 2009 ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2014లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఓడిపోయారు. అప్పటి నుంచి వివిధ సమస్యలపై తన గళాన్ని వినిపిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ మెట్రో విస్తరణపై జేపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తాజాగా విజయవాడలో ఓ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్తో కలిసి జేపీ కనిపించారు. మంత్రి జోగి రమేష్తో జేపీని పిలిపించుకుని మరీ జగన్ తన పక్క సీట్లో కూర్చోబెట్టుకున్నారు.
జగన్, జేపీ ఇలా పక్కపక్కనే కూర్చుని చాలా సేపు మాట్లాడుకున్నారు. ఇటీవల వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను కొన్నింటిని జేపీ ప్రశంసించారు. మరోవైపు ఎన్నికలకు ముందు జగన్కు కొంతమంది ఐఏఎస్లు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో జేపీ వైసీపీలో చేరతారేమోననే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆయన పార్టీలో చేరితే విజయవాడ లేదా గుంటూరు నుంచి ఎంపీగా బరిలో దించే అవకాశముందని తెలిసింది. ఒకవేళ పార్టీలో చేరకుండా బయట నుంచి మద్దతు ఇచ్చినా.. ఇది జనసేన, టీడీపీలకు పెద్ద దెబ్బే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
This post was last modified on August 8, 2023 10:49 am
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…