Political News

ఎన్ని అనే దాని మీద క్లారిటీ ఇస్తాం: నాదెండ్ల మనోహర్‌!

రానున్న ఎన్నికల్లో ఎక్కడ నుంచి ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాం అనే దాని గురించి త్వరలోనే క్లారిటీ ఇస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆయన గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు నాదెండ్ల మనోహర్. జనసేన అభ్యర్థిగా తెనాలి నుంచి నేను పోటీ చేస్తానని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం ధాటికి సామాన్యులు చితికి పోతున్నారని విమర్శించారు.

రాష్ట్ర వ్యాప్తంగా జనసేనని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాని నాదెండ్ల తెలిపారు. వారాహి యాత్ర ప్రారంభం నుంచి నియోజకవర్గాల్లో సమస్యలపై పవన్ కళ్యాణ్ పూర్తి అవగాహన తెచ్చుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో వైపీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు నాదెండ్ల. ఇందులో భాగంగానే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో త్వరలోనే చెప్పేస్తామన్నారు. అలాగే తర్వలోనే బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తులపై క్లారిటీ వస్తుందని చెప్పారు.

ప్రజల వ్యక్తిగత సమాచారం హైరదాబాద్ లోని ప్రైవేటు సంస్థలకు ఏపీ ప్రభుత్వం పంపిస్తోందని నాదెండ్ల ఆరోపించారు. డేటా చోరిపై పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటే వైసీపీ మంత్రులు, నేతలు తీవ్ర విమర్శలు చేశారు. కానీ కేంద్రమే డైరెక్ట్ గా ఈ విషయం చెప్పిందని అన్నారు. ఈ విషయంపై జనసేన ముందే చెప్పిందన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు నాదెండ్ల.

ఈ ఫైలింగ్, డిజిటల్ సిగ్నేచర్ల పేరుతో ముఖ్యమంత్రికి తెలియకుండా వందల ఫైళ్లు వెళ్లిపోవడం తప్పుకదా? అని మనోహర్ ప్రశ్నించారు. అలాగే వలంటీర్ వ్యవస్త తప్పు చేస్తే ఎవరిని అడగాలి? దీనికి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుంటారా అని మనోహర్ నిలదీశారు. ఇదంతా చూస్తుంటే పారదర్శకత ఎక్కడ ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు నాదెండ్ల.

అలాగే సీఎంవోలో అక్రమాలు జరిగాయని సీఎం జగన్ ఒప్పుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. టీటీడీ చైర్మన్ గా భూమన నియామకం వల్ల ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సర్పంచులను డమ్మీలుగా చేసి వలంటీర్లు పెత్తనం చెలాయిస్తున్నారని దుయ్యబట్టారు నాదెండ్ల మనోహర్.

This post was last modified on August 7, 2023 7:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

39 minutes ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

4 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

4 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

6 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

8 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

8 hours ago