కేసీఆర్ మనవడు హిమాన్ష్ రావు అంటే తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. కేటీఆర్ తనయుడు హిమాన్ష్.. చాలా సందర్భాల్లో తాతతో కలిసి కనిపించారు. అంతే కాకుండా వ్యక్తిగతంగానూ వివిధ విషయాల్లో పత్రికల్లోకెక్కారు. ఇటీవల ఓ పాఠశాలను దత్తత తీసుకుని.. అక్కడ సౌకర్యాలు కల్పించిన హిమాన్ష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఆ పాఠశాల దుస్థితి చూస్తే బాధేసిందని, అందుకే దత్తత తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ విషయాన్ని తండ్రి, తాతకు చెప్పాలంటూ హిమాన్ష్ను ఉద్దేశిస్తూ విపక్షాలు వ్యాఖ్యలు చేశాయి.
ఈ విమర్శలు, వ్యాఖ్యలను పక్కనపెడితే తాజాగా హిమాన్ష్ రావు మరోసారి వార్తల్లోకెక్కారు. తాతను ఆదర్శంగా తీసుకుని.. తండ్రి బాటలో హిమాన్ష్ సాగుతున్నారా? రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటున్నారా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో హిమాన్ష్ కనిపించడమే అందుకు కారణం. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ఆయన.. శాసనసభకు వచ్చారు. ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని, కాసేపు సమావేశాలను ఆసక్తిగా తిలకించారు. సభ జరుగుతున్న తీరు.. అక్కడి నాయకుల మాట్లాడుతున్న విధానాన్ని చూశారు. కొద్దిసేపటి తర్వాత వెళ్లిపోయారు.
హిమాన్ష్ అసెంబ్లీలో కనిపించడంపై రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భవిష్యత్ నాయకుడిగా ఎదిగే అవకాశమున్న హిమాన్ష్ రాజకీయ పాఠాల కోసం శాసనసభకు వచ్చారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. హిమాన్ష్ కుటుంబంలో ఎటు చూసినా రాజకీయ నాయకులే. ఇలాంటి వాతావరణంలో పెరుగుతున్న ఆయనకు సహజంగానే పాలిటిక్స్ అంటే ఆసక్తి కలుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి భవిష్యత్లో కేసీఆర్ వారసత్వాన్ని హిమాన్ష్ కొనసాగిస్తారేమో చూడాలి.
This post was last modified on August 7, 2023 6:24 pm
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా సింగిల్ థియేటర్ల రెవెన్యూ విషయమై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఎంత గొడవ నడుస్తోందో తెలిసిందే.…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుమారు 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో…