కేసీఆర్ మనవడు హిమాన్ష్ రావు అంటే తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. కేటీఆర్ తనయుడు హిమాన్ష్.. చాలా సందర్భాల్లో తాతతో కలిసి కనిపించారు. అంతే కాకుండా వ్యక్తిగతంగానూ వివిధ విషయాల్లో పత్రికల్లోకెక్కారు. ఇటీవల ఓ పాఠశాలను దత్తత తీసుకుని.. అక్కడ సౌకర్యాలు కల్పించిన హిమాన్ష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఆ పాఠశాల దుస్థితి చూస్తే బాధేసిందని, అందుకే దత్తత తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ విషయాన్ని తండ్రి, తాతకు చెప్పాలంటూ హిమాన్ష్ను ఉద్దేశిస్తూ విపక్షాలు వ్యాఖ్యలు చేశాయి.
ఈ విమర్శలు, వ్యాఖ్యలను పక్కనపెడితే తాజాగా హిమాన్ష్ రావు మరోసారి వార్తల్లోకెక్కారు. తాతను ఆదర్శంగా తీసుకుని.. తండ్రి బాటలో హిమాన్ష్ సాగుతున్నారా? రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటున్నారా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో హిమాన్ష్ కనిపించడమే అందుకు కారణం. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ఆయన.. శాసనసభకు వచ్చారు. ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని, కాసేపు సమావేశాలను ఆసక్తిగా తిలకించారు. సభ జరుగుతున్న తీరు.. అక్కడి నాయకుల మాట్లాడుతున్న విధానాన్ని చూశారు. కొద్దిసేపటి తర్వాత వెళ్లిపోయారు.
హిమాన్ష్ అసెంబ్లీలో కనిపించడంపై రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భవిష్యత్ నాయకుడిగా ఎదిగే అవకాశమున్న హిమాన్ష్ రాజకీయ పాఠాల కోసం శాసనసభకు వచ్చారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. హిమాన్ష్ కుటుంబంలో ఎటు చూసినా రాజకీయ నాయకులే. ఇలాంటి వాతావరణంలో పెరుగుతున్న ఆయనకు సహజంగానే పాలిటిక్స్ అంటే ఆసక్తి కలుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి భవిష్యత్లో కేసీఆర్ వారసత్వాన్ని హిమాన్ష్ కొనసాగిస్తారేమో చూడాలి.
This post was last modified on August 7, 2023 6:24 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…