టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. చిత్తూరు జిల్లా పోలీసులపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పోలీసులూ ఖబడ్దార్! అంటూ ఆయన హెచ్చరించారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడితే.. కోర్టులో మీపై ప్రైవేటు కేసులు దాఖలు చేయాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. ఇటీవల పుంగనూరు-తంబళ్లపల్లేల్లో జరిగిన దాడుల నేపథ్యంలో ఇప్పటికే 60 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
అయితే.. 100 మందికిపైగా కార్యకర్తల జాడ కనిపించడం లేదని పార్టీ కార్యకర్తలు తెలిపారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు వద్దకు ఈ రోజు ఉదయం వచ్చిన చిత్తూరు నాయకులు.. జిల్లాలో జరుగుతున్న కేసుల నమోదు.. నాయకులు, కార్యకర్తల నిర్బంధంపై చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తల ఆవేదన విని చలించిపోయిన చంద్రబాబు పోలీసులను ఉద్దేశించి నిప్పులు చెరిగారు.
పోలీసులు అర్థరహితంగా కేసులు పెడుతున్నారంటే.. వారి అనర్థాన్ని వారే కొనితెచ్చుకుంటున్నారని అర్థం చేసుకోవాలన్నారు. అక్రమ కేసులపై కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తామన్నారు. మారణాయుధాలతో వచ్చారని, కేసులు పెట్టారంటూ కేసులు పెడతారా? అని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాధ్ రెడ్డి, ఘంటా నరహరి, శ్రీరాం చినబాబులపై హత్యయత్నం కేసులు నమోదు చేయడాన్ని ఆయన ఖండించారు. పోలీసులు పద్ధతి మార్చుకుని, రాజ్యాంగం ప్రకారం.. చట్టం ప్రకారం వ్యవహరించాలని అన్నారు.
కాగా, పుంగనూరు ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 5 ఎఫ్ఐఆర్లు, 200 మందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసుల అదుపులో 60 మంది టీడీపీ నేతలున్నారు. 24 గంటలకుపైగా పోలీసుల అదుపులో ఉన్నా.. కోర్టుకు హాజరు పర్చకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలను చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
This post was last modified on August 7, 2023 3:31 pm
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు,…
గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…
మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…
'ఎక్కడున్నా భారత్కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు…
ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా…
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…