టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. చిత్తూరు జిల్లా పోలీసులపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పోలీసులూ ఖబడ్దార్! అంటూ ఆయన హెచ్చరించారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడితే.. కోర్టులో మీపై ప్రైవేటు కేసులు దాఖలు చేయాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. ఇటీవల పుంగనూరు-తంబళ్లపల్లేల్లో జరిగిన దాడుల నేపథ్యంలో ఇప్పటికే 60 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
అయితే.. 100 మందికిపైగా కార్యకర్తల జాడ కనిపించడం లేదని పార్టీ కార్యకర్తలు తెలిపారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు వద్దకు ఈ రోజు ఉదయం వచ్చిన చిత్తూరు నాయకులు.. జిల్లాలో జరుగుతున్న కేసుల నమోదు.. నాయకులు, కార్యకర్తల నిర్బంధంపై చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తల ఆవేదన విని చలించిపోయిన చంద్రబాబు పోలీసులను ఉద్దేశించి నిప్పులు చెరిగారు.
పోలీసులు అర్థరహితంగా కేసులు పెడుతున్నారంటే.. వారి అనర్థాన్ని వారే కొనితెచ్చుకుంటున్నారని అర్థం చేసుకోవాలన్నారు. అక్రమ కేసులపై కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తామన్నారు. మారణాయుధాలతో వచ్చారని, కేసులు పెట్టారంటూ కేసులు పెడతారా? అని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాధ్ రెడ్డి, ఘంటా నరహరి, శ్రీరాం చినబాబులపై హత్యయత్నం కేసులు నమోదు చేయడాన్ని ఆయన ఖండించారు. పోలీసులు పద్ధతి మార్చుకుని, రాజ్యాంగం ప్రకారం.. చట్టం ప్రకారం వ్యవహరించాలని అన్నారు.
కాగా, పుంగనూరు ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 5 ఎఫ్ఐఆర్లు, 200 మందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసుల అదుపులో 60 మంది టీడీపీ నేతలున్నారు. 24 గంటలకుపైగా పోలీసుల అదుపులో ఉన్నా.. కోర్టుకు హాజరు పర్చకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలను చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…