Political News

పోలీసులూ.. ఖ‌బ‌డ్దార్‌.. మీపై ప్రైవేటు కేసులు వేస్తాం: చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. చిత్తూరు జిల్లా పోలీసుల‌పై తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. పోలీసులూ ఖ‌బ‌డ్దార్‌! అంటూ ఆయ‌న హెచ్చ‌రించారు. టీడీపీ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెడితే.. కోర్టులో మీపై ప్రైవేటు కేసులు దాఖ‌లు చేయాల్సి ఉంటుంద‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. ఇటీవల పుంగనూరు-తంబళ్లపల్లేల్లో జ‌రిగిన దాడుల నేప‌థ్యంలో ఇప్ప‌టికే 60 మంది టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

అయితే.. 100 మందికిపైగా కార్య‌క‌ర్త‌ల జాడ క‌నిపించ‌డం లేద‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు తెలిపారు. ప్ర‌స్తుతం ఏలూరు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు వ‌ద్ద‌కు ఈ రోజు ఉద‌యం వ‌చ్చిన చిత్తూరు నాయ‌కులు.. జిల్లాలో జ‌రుగుతున్న కేసుల న‌మోదు.. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల నిర్బంధంపై చంద్ర‌బాబుకు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల ఆవేద‌న విని చ‌లించిపోయిన చంద్ర‌బాబు పోలీసుల‌ను ఉద్దేశించి నిప్పులు చెరిగారు.

పోలీసులు అర్థరహితంగా కేసులు పెడుతున్నారంటే.. వారి అన‌ర్థాన్ని వారే కొనితెచ్చుకుంటున్నార‌ని అర్థం చేసుకోవాలన్నారు. అక్ర‌మ కేసుల‌పై కోర్టుల్లో న్యాయ‌పోరాటం చేస్తామ‌న్నారు. మారణాయుధాలతో వచ్చారని, కేసులు పెట్టారంటూ కేసులు పెడ‌తారా? అని పోలీసుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాధ్ రెడ్డి, ఘంటా నరహరి, శ్రీరాం చినబాబులపై హత్యయత్నం కేసులు నమోదు చేయ‌డాన్ని ఆయ‌న ఖండించారు. పోలీసులు ప‌ద్ధ‌తి మార్చుకుని, రాజ్యాంగం ప్ర‌కారం.. చ‌ట్టం ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించాల‌ని అన్నారు.

కాగా, పుంగనూరు ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్ప‌టి వ‌ర‌కు 5 ఎఫ్ఐఆర్లు, 200 మందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసుల అదుపులో 60 మంది టీడీపీ నేతలున్నారు. 24 గంటలకుపైగా పోలీసుల అదుపులో ఉన్నా.. కోర్టుకు హాజరు పర్చకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మ‌రోవైపు టీడీపీ నేతలను చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

This post was last modified on August 7, 2023 3:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ అనంతబాబు కథ ముగిసినట్టేనా?

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…

34 minutes ago

నయనతార ఛాయిస్ ఎందుకు మారింది

ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…

1 hour ago

హవ్వ… ఆరో తరగతిలో పాటల కంపోజింగా?

స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…

2 hours ago

ఏప్రిల్ నెలను వారణాసే కాపాడాలి

టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…

3 hours ago

రాకీ భాయ్ తిరిగి వస్తాడా?

కొన్ని క‌థ‌లు ముగిసిపోవ‌డాన్ని ప్రేక్ష‌కులు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. వాటికి కొన‌సాగింపు ఉంటేనే బాగుంటుంద‌ని ఆశిస్తారు. వాటి మేక‌ర్స్ కూడా ఆ…

4 hours ago

గొడవ వల్ల గడ్డివాము తగలెట్టేసాడంట

నిందితులను పోలీసులు పబ్లిక్‌లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన…

4 hours ago