Political News

పోలీసులూ.. ఖ‌బ‌డ్దార్‌.. మీపై ప్రైవేటు కేసులు వేస్తాం: చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. చిత్తూరు జిల్లా పోలీసుల‌పై తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. పోలీసులూ ఖ‌బ‌డ్దార్‌! అంటూ ఆయ‌న హెచ్చ‌రించారు. టీడీపీ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెడితే.. కోర్టులో మీపై ప్రైవేటు కేసులు దాఖ‌లు చేయాల్సి ఉంటుంద‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. ఇటీవల పుంగనూరు-తంబళ్లపల్లేల్లో జ‌రిగిన దాడుల నేప‌థ్యంలో ఇప్ప‌టికే 60 మంది టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

అయితే.. 100 మందికిపైగా కార్య‌క‌ర్త‌ల జాడ క‌నిపించ‌డం లేద‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు తెలిపారు. ప్ర‌స్తుతం ఏలూరు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు వ‌ద్ద‌కు ఈ రోజు ఉద‌యం వ‌చ్చిన చిత్తూరు నాయ‌కులు.. జిల్లాలో జ‌రుగుతున్న కేసుల న‌మోదు.. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల నిర్బంధంపై చంద్ర‌బాబుకు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల ఆవేద‌న విని చ‌లించిపోయిన చంద్ర‌బాబు పోలీసుల‌ను ఉద్దేశించి నిప్పులు చెరిగారు.

పోలీసులు అర్థరహితంగా కేసులు పెడుతున్నారంటే.. వారి అన‌ర్థాన్ని వారే కొనితెచ్చుకుంటున్నార‌ని అర్థం చేసుకోవాలన్నారు. అక్ర‌మ కేసుల‌పై కోర్టుల్లో న్యాయ‌పోరాటం చేస్తామ‌న్నారు. మారణాయుధాలతో వచ్చారని, కేసులు పెట్టారంటూ కేసులు పెడ‌తారా? అని పోలీసుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాధ్ రెడ్డి, ఘంటా నరహరి, శ్రీరాం చినబాబులపై హత్యయత్నం కేసులు నమోదు చేయ‌డాన్ని ఆయ‌న ఖండించారు. పోలీసులు ప‌ద్ధ‌తి మార్చుకుని, రాజ్యాంగం ప్ర‌కారం.. చ‌ట్టం ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించాల‌ని అన్నారు.

కాగా, పుంగనూరు ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్ప‌టి వ‌ర‌కు 5 ఎఫ్ఐఆర్లు, 200 మందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసుల అదుపులో 60 మంది టీడీపీ నేతలున్నారు. 24 గంటలకుపైగా పోలీసుల అదుపులో ఉన్నా.. కోర్టుకు హాజరు పర్చకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మ‌రోవైపు టీడీపీ నేతలను చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

This post was last modified on August 7, 2023 3:31 pm

Share

Recent Posts

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

10 minutes ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

13 minutes ago

హైదరాబాద్ లో బాలికను రేప్ చేసిన 8 మంది

మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…

32 minutes ago

జైలర్ 2 మీద పందెం కాసేదెవరు

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…

1 hour ago

నిర్మాత రిస్క్ చేశాడు… జాక్‌పాట్ కొడుతున్నాడు

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంత‌కుముందులా ఉదారంగా కొత్త సినిమాల‌ను కొన‌ట్లేద‌న్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌లు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫ‌ర్…

1 hour ago

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

5 hours ago