Political News

పోలీసులూ.. ఖ‌బ‌డ్దార్‌.. మీపై ప్రైవేటు కేసులు వేస్తాం: చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. చిత్తూరు జిల్లా పోలీసుల‌పై తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. పోలీసులూ ఖ‌బ‌డ్దార్‌! అంటూ ఆయ‌న హెచ్చ‌రించారు. టీడీపీ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెడితే.. కోర్టులో మీపై ప్రైవేటు కేసులు దాఖ‌లు చేయాల్సి ఉంటుంద‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. ఇటీవల పుంగనూరు-తంబళ్లపల్లేల్లో జ‌రిగిన దాడుల నేప‌థ్యంలో ఇప్ప‌టికే 60 మంది టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

అయితే.. 100 మందికిపైగా కార్య‌క‌ర్త‌ల జాడ క‌నిపించ‌డం లేద‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు తెలిపారు. ప్ర‌స్తుతం ఏలూరు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు వ‌ద్ద‌కు ఈ రోజు ఉద‌యం వ‌చ్చిన చిత్తూరు నాయ‌కులు.. జిల్లాలో జ‌రుగుతున్న కేసుల న‌మోదు.. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల నిర్బంధంపై చంద్ర‌బాబుకు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల ఆవేద‌న విని చ‌లించిపోయిన చంద్ర‌బాబు పోలీసుల‌ను ఉద్దేశించి నిప్పులు చెరిగారు.

పోలీసులు అర్థరహితంగా కేసులు పెడుతున్నారంటే.. వారి అన‌ర్థాన్ని వారే కొనితెచ్చుకుంటున్నార‌ని అర్థం చేసుకోవాలన్నారు. అక్ర‌మ కేసుల‌పై కోర్టుల్లో న్యాయ‌పోరాటం చేస్తామ‌న్నారు. మారణాయుధాలతో వచ్చారని, కేసులు పెట్టారంటూ కేసులు పెడ‌తారా? అని పోలీసుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాధ్ రెడ్డి, ఘంటా నరహరి, శ్రీరాం చినబాబులపై హత్యయత్నం కేసులు నమోదు చేయ‌డాన్ని ఆయ‌న ఖండించారు. పోలీసులు ప‌ద్ధ‌తి మార్చుకుని, రాజ్యాంగం ప్ర‌కారం.. చ‌ట్టం ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించాల‌ని అన్నారు.

కాగా, పుంగనూరు ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్ప‌టి వ‌ర‌కు 5 ఎఫ్ఐఆర్లు, 200 మందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసుల అదుపులో 60 మంది టీడీపీ నేతలున్నారు. 24 గంటలకుపైగా పోలీసుల అదుపులో ఉన్నా.. కోర్టుకు హాజరు పర్చకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మ‌రోవైపు టీడీపీ నేతలను చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

This post was last modified on August 7, 2023 3:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

2 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

3 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

7 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

8 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

8 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

9 hours ago