తెలంగాణలో అధికారంలోకి వచ్చే దిశగా రాబోయే రెండు నెలలు కీలకమని, విభేదాలు పక్కనపెట్టి నేతలందరూ కలిసి పని చేయాలని ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మార్గనిర్దేశనం చేశారు. వచ్చే 100 రోజులు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలోని ముఖ్య నేతల మధ్య విభేదాలపైనా మాట్లాడారు. 2018 ఎన్నికల్లో రాష్ట్రంలో గెలవాల్సిందని, కానీ నాయకుల మధ్య ఐక్యత లేకపోవడమే అందుకు కారణమని వేణుగోపాల్ అన్నట్లు తెలిసింది.
ఈ సారి అధికారంలో వస్తే సీఎం అయ్యేది ఇక్కడి కీలక నేతల్లో ఒకరేనని వేణుగోపాల్ పేర్కొన్నారు. అందుకే పార్టీ కోసం కలిసి పనిచేయాలని సూచించారు. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ ఆ సీఎం అభ్యర్థి ఎవరు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్లో దాదాపు అందరూ సీనియర్ నాయకులే. కీలక నేతలే. సీఎం పదవి ఆశించేవాళ్లే. ఇటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నుంచి అటు వీహెచ్ హనుమంతరావు వరకూ సీఎం పదవిపై ఆశతో ఉన్నవాళ్లే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రేవంత్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, సీతక్క.. ఇలా చెప్పుకుంటూ పోతే కీలక నేతల జాబితా పెద్దదే. వీళ్లలో చాలా మందికి అధికారం కావాలి.. కానీ పార్టీ కోసం మాత్రం పనిచేయారనే అభిప్రాయాలున్నాయి. పార్టీ అధిష్ఠానం ఎన్నిసార్లు హెచ్చరించినా కొంతమంది నాయకుల వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని తెలిసింది. నాయకులు కలిసి పనిచేయాలని చెప్పిన వేణుగోపాల్ ముందే.. రేవంత్, ఉత్తమ్ వాగ్వాదానికి దిగారని తెలిసింది. దీన్ని బట్టే పార్టీలో పరిస్థితి ఎలా ఉందో స్పష్టమవుతోంది. మరి ఈ నాయకులు కలిసి పార్టీని అధికారంలోకి తీసుకువస్తారా? అంటే కచ్చితంగా అవునని చెప్పే పరిస్థితులు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు.
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…