తెలంగాణలో అధికారంలోకి వచ్చే దిశగా రాబోయే రెండు నెలలు కీలకమని, విభేదాలు పక్కనపెట్టి నేతలందరూ కలిసి పని చేయాలని ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మార్గనిర్దేశనం చేశారు. వచ్చే 100 రోజులు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలోని ముఖ్య నేతల మధ్య విభేదాలపైనా మాట్లాడారు. 2018 ఎన్నికల్లో రాష్ట్రంలో గెలవాల్సిందని, కానీ నాయకుల మధ్య ఐక్యత లేకపోవడమే అందుకు కారణమని వేణుగోపాల్ అన్నట్లు తెలిసింది.
ఈ సారి అధికారంలో వస్తే సీఎం అయ్యేది ఇక్కడి కీలక నేతల్లో ఒకరేనని వేణుగోపాల్ పేర్కొన్నారు. అందుకే పార్టీ కోసం కలిసి పనిచేయాలని సూచించారు. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ ఆ సీఎం అభ్యర్థి ఎవరు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్లో దాదాపు అందరూ సీనియర్ నాయకులే. కీలక నేతలే. సీఎం పదవి ఆశించేవాళ్లే. ఇటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నుంచి అటు వీహెచ్ హనుమంతరావు వరకూ సీఎం పదవిపై ఆశతో ఉన్నవాళ్లే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రేవంత్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, సీతక్క.. ఇలా చెప్పుకుంటూ పోతే కీలక నేతల జాబితా పెద్దదే. వీళ్లలో చాలా మందికి అధికారం కావాలి.. కానీ పార్టీ కోసం మాత్రం పనిచేయారనే అభిప్రాయాలున్నాయి. పార్టీ అధిష్ఠానం ఎన్నిసార్లు హెచ్చరించినా కొంతమంది నాయకుల వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని తెలిసింది. నాయకులు కలిసి పనిచేయాలని చెప్పిన వేణుగోపాల్ ముందే.. రేవంత్, ఉత్తమ్ వాగ్వాదానికి దిగారని తెలిసింది. దీన్ని బట్టే పార్టీలో పరిస్థితి ఎలా ఉందో స్పష్టమవుతోంది. మరి ఈ నాయకులు కలిసి పార్టీని అధికారంలోకి తీసుకువస్తారా? అంటే కచ్చితంగా అవునని చెప్పే పరిస్థితులు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు.
This post was last modified on August 7, 2023 7:39 am
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…
ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…