ఐవైఆర్ కృష్ణారావు గుర్తున్నారా? ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు హయాంలో పనిచేసిన ఆయన తర్వాత.. రిటైరయ్యారు. అనంతరం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత చంద్రబాబు సర్కారుపైనే విమర్శలు గుప్పించడంతో ఆయనను అప్పటికప్పుడు పక్కన పెట్టారు. తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ఇక, తరచుగా ఏపీ సర్కారుపై హైదరాబాద్లో ఉండి విమర్శలు గుప్పి స్తూ ఉన్నారు.
ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత.. ఐవైఆర్ స్పందించారు. ఏపీ ప్రభుత్వం తాజాగా చేపట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి నియామకం విషయంపై ఆయన రియాక్ట్ అయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డిని నియమిస్తూ.. జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ నిర్ణయాన్నితప్పుబడుతూ.. ఐవైఆర్ ట్విట్టర్ వేదికగా సర్కారుపై విమర్శలు గుప్పించారు.
“తిరుమల తిరుపతి దేవస్థానంపై అచంచల విశ్వాసం ఉన్నవారినే చైర్మన్ గా నియమించాలి. ఈ విషయంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. హిందూ ధర్మ సంస్థలు, ధార్మిక సంస్థల విషయంలో ఎలా వ్యవహరించినా.. తమను ఎవరూ ఏమీ అనరనే అడ్డుకునేవారు లేరనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరించింది” అని ఐవైఆర్ విరుచుకుపడ్డారు. మరి దీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on August 6, 2023 3:01 pm
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత చెలరేగిన తీవ్ర హింస పై కేంద్ర ఎన్నికల సంఘం…
https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…
కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…