ఐవైఆర్ కృష్ణారావు గుర్తున్నారా? ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు హయాంలో పనిచేసిన ఆయన తర్వాత.. రిటైరయ్యారు. అనంతరం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత చంద్రబాబు సర్కారుపైనే విమర్శలు గుప్పించడంతో ఆయనను అప్పటికప్పుడు పక్కన పెట్టారు. తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ఇక, తరచుగా ఏపీ సర్కారుపై హైదరాబాద్లో ఉండి విమర్శలు గుప్పి స్తూ ఉన్నారు.
ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత.. ఐవైఆర్ స్పందించారు. ఏపీ ప్రభుత్వం తాజాగా చేపట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి నియామకం విషయంపై ఆయన రియాక్ట్ అయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డిని నియమిస్తూ.. జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ నిర్ణయాన్నితప్పుబడుతూ.. ఐవైఆర్ ట్విట్టర్ వేదికగా సర్కారుపై విమర్శలు గుప్పించారు.
“తిరుమల తిరుపతి దేవస్థానంపై అచంచల విశ్వాసం ఉన్నవారినే చైర్మన్ గా నియమించాలి. ఈ విషయంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. హిందూ ధర్మ సంస్థలు, ధార్మిక సంస్థల విషయంలో ఎలా వ్యవహరించినా.. తమను ఎవరూ ఏమీ అనరనే అడ్డుకునేవారు లేరనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరించింది” అని ఐవైఆర్ విరుచుకుపడ్డారు. మరి దీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on August 6, 2023 3:01 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…