Political News

ఐవైఆర్‌.. మ‌ళ్లీ ఏసేశాడుగా.. వైసీపీ ఏం చేస్తుందో!

ఐవైఆర్ కృష్ణారావు గుర్తున్నారా? ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా చంద్ర‌బాబు హ‌యాంలో ప‌నిచేసిన ఆయ‌న త‌ర్వాత‌.. రిటైర‌య్యారు. అనంత‌రం బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా కూడా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు స‌ర్కారుపైనే విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతో ఆయ‌న‌ను అప్పటిక‌ప్పుడు ప‌క్క‌న పెట్టారు. త‌ర్వాత ఆయ‌న బీజేపీలో చేరారు. ఇక‌, త‌ర‌చుగా ఏపీ స‌ర్కారుపై హైద‌రాబాద్‌లో ఉండి విమ‌ర్శ‌లు గుప్పి స్తూ ఉన్నారు.

ఇప్పుడు చాన్నాళ్ల త‌ర్వాత‌.. ఐవైఆర్ స్పందించారు. ఏపీ ప్ర‌భుత్వం తాజాగా చేప‌ట్టిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ ప‌ద‌వి నియామ‌కం విష‌యంపై ఆయ‌న రియాక్ట్ అయ్యారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్‌గా తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డిని నియ‌మిస్తూ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అయితే.. ఈ నిర్ణ‌యాన్నిత‌ప్పుబడుతూ.. ఐవైఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

“తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంపై అచంచ‌ల విశ్వాసం ఉన్న‌వారినే చైర్మ‌న్ గా నియ‌మించాలి. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం తాజాగా తీసుకున్న నిర్ణ‌యం స‌రైంది కాదు. హిందూ ధ‌ర్మ సంస్థ‌లు, ధార్మిక సంస్థ‌ల విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించినా.. త‌మ‌ను ఎవ‌రూ ఏమీ అన‌ర‌నే అడ్డుకునేవారు లేర‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింది” అని ఐవైఆర్ విరుచుకుప‌డ్డారు. మ‌రి దీనిపై వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on August 6, 2023 3:01 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

5 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

5 hours ago