ఐవైఆర్ కృష్ణారావు గుర్తున్నారా? ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు హయాంలో పనిచేసిన ఆయన తర్వాత.. రిటైరయ్యారు. అనంతరం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత చంద్రబాబు సర్కారుపైనే విమర్శలు గుప్పించడంతో ఆయనను అప్పటికప్పుడు పక్కన పెట్టారు. తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ఇక, తరచుగా ఏపీ సర్కారుపై హైదరాబాద్లో ఉండి విమర్శలు గుప్పి స్తూ ఉన్నారు.
ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత.. ఐవైఆర్ స్పందించారు. ఏపీ ప్రభుత్వం తాజాగా చేపట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి నియామకం విషయంపై ఆయన రియాక్ట్ అయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డిని నియమిస్తూ.. జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ నిర్ణయాన్నితప్పుబడుతూ.. ఐవైఆర్ ట్విట్టర్ వేదికగా సర్కారుపై విమర్శలు గుప్పించారు.
“తిరుమల తిరుపతి దేవస్థానంపై అచంచల విశ్వాసం ఉన్నవారినే చైర్మన్ గా నియమించాలి. ఈ విషయంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. హిందూ ధర్మ సంస్థలు, ధార్మిక సంస్థల విషయంలో ఎలా వ్యవహరించినా.. తమను ఎవరూ ఏమీ అనరనే అడ్డుకునేవారు లేరనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరించింది” అని ఐవైఆర్ విరుచుకుపడ్డారు. మరి దీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on August 6, 2023 3:01 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…