Political News

కేంద్రం పై ఒత్తిడి .. జగన్ చేయాల్సింది చేస్తున్నారు

కేంద్రప్రభుత్వంతో ఉన్న సత్సబంధాల కారణంగా బాగా ఒత్తిడి తెచ్చి ప్రత్యేకహోదా, పెండింగ్ నిధులు, ప్రాజెక్టులను సాధించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసమని వ్యూహాత్మకంగా లోక్ సభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ఎంపీ మార్గాని భరత్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లును గనుక లోక్ సభ స్పీకర్ ఆమోదిస్తే బిల్లుపై చర్చ జరుగుతుంది. అప్పుడు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం. 2014లో విభజన హామీల అమలు చట్టం తదితరాలన్నీ చర్చకు వస్తాయి.

విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేకహోదా, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ లాంటి అనేక హామీలున్నాయి. అయితే వీటిల్లో ఏ ఒక్కటీ అమల్లోకి రాలేదు. ప్రత్యేకహోదా, రైల్వేజోన్ అంశాలను నరేంద్రమోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేసింది. జగన్ ప్రభుత్వం కేంద్రంపై కొంతమేర ఒత్తిడి తీసుకొచ్చి పెండింగులో ఉన్న రెవిన్యు లోటు రు. 10 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు రీఎంబర్స్ మెంటు నిధులు రు. 12 వేల కోట్లు సాధించింది.

అయితే సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ప్రత్యేకహోదా, రైల్వేజోన్ ఇవ్వాల్సిందే అని ప్రభుత్వం అడుగుతున్నా కేంద్రం లెక్కచేయటంలేదు. హోదా, రైల్వేజోన్ సాధించగలిగితే జగన్ ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయినట్లే.

ఒకవైపేమో షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ప్రత్యేకహోదా అన్నది రాష్ట్రం మొత్తం, రైల్వేజోన్ అన్నది ఉత్తరాంధ్రకు సెంటిమెంటుగా తయారైంది. ఈ రెండింటికి అదనంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటుపరం అవ్వబోతోంది. దీన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంచేట్లు లేదా కనీసం స్టీల్ అథారిటి ఆఫ్ ఇండియా (సెయిల్) పరిధిలోకి అయినా చేర్చమని రాష్ట్రప్రభుత్వం పదేపదే అడుగుతున్నా కేంద్రప్రభుత్వం పట్టించుకోవటంలేదు. 2024 ఎన్నికల్లో కూడా మళ్ళీ గెలవాలని పట్టుదలగా ఉన్న జగన్ విభజన హామీల్లో కీలకమైనవి అయినా సాధించాలని పట్టుదలగా ఉన్నారు. అయితే నరేంద్రమోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టగలరా ? సాధించగలరా ? అన్నదే అనుమానంగా ఉంది.

This post was last modified on August 6, 2023 12:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనంతబాబు అరెస్టు… తర్వాతేంటి?

వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి…

13 minutes ago

సింగపూర్ క్లాసులు.. ఇక్కడ పాలన

రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియ‌నుంది. మూడు రోజుల పర్యటనలో…

16 minutes ago

రజనీ షారుఖ్.. రీవేంజ్ కాదు కానీ…

సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…

1 hour ago

బాలయ్య దర్శకులకు అసలైన సవాల్

​నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…

2 hours ago

విజయ్ నియోజకవర్గంలో రాత్రి 1 వరకు ఓటింగ్…

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా జ‌రిగింది. వాస్త‌వానికి గ‌తంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘ‌ట‌న‌లు జ‌రిగేవి. తాజాగా…

2 hours ago

ప్ర‌శంస‌లేనా.. ఛాన్సులూ ఇస్తారా?

80, 90 ద‌శ‌కాల్లో వైభ‌వం చూసిన క‌థానాయ‌కుల్లో రాజ‌శేఖ‌ర్ ఒక‌రు. స్వ‌త‌హాగా త‌మిళుడైన‌ప్ప‌టికీ.. తెలుగులోనే ఆయ‌న పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…

2 hours ago