Political News

2020 – గణేష్ మండపాల్లేని వినాయక చవితి

వినాయకచవితి సమీపిస్తున్న నేపథ్యంలో కొద్దిరోజులుగా ఈ సారి వినాయక చవితి ఉత్సవాలు ఉంటాయా లేదా? అని పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చకు ప్రభుత్వం చెక్ పెట్టేసింది. హైదరాబాదీలకు వెరీవెరీ స్పెషల్ అయిన వినాయకచవితి… కళను కూడా కరోనా పోగొట్టేసింది.

గణేష్ పండగ వస్తే పదిరోజుల పాటు గణపతి బప్ప మోరియా అంటూ మారుమోగే నినాదాలు ఈసారి వినలేం. ఎవరిళ్లలో వారు వినాయక చవితి జరుపుకోవాలంటూ…. ప్రభుత్వం అధికారికంగా చెప్పేసింది.

కరోనా నేపథ్యంలో ఉత్సవాలు నలుగురు కలిసి జరుపుకునే పరిస్థితులు లేని నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు గణేష్ ఉత్సవాలను ఇళ్లేక పరిమితం చేసుకోవాలని, ఇళ్లలోనే గణేష్‌ ప్రతిమలను ప్రతిష్టించుకుని పూజలు నిర్వహించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వినాయక చవితి ఉత్సవాలలో కీలక పాత్ర పోషించే హోంశాఖ ప్రత్యేక సమావేశంలో నగరానికి చెందిన మంత్రి తలసాని, హోంమంత్రి మహమూద్‌ అలీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లు, జీహెచ్‌ఎంసి కమిషనర్‌, భాగ్యనగర్‌ గణేష్‌ఉత్సవ సమితి నాయకులు హాజరయ్యారు. ఇపుడిపుడే స్వల్పంగా కరోనా కర్వ్ ఫ్లాట్ అవుతున్న నేపథ్యంలో వేడుకలు సామూహికంగా జరుపుకునే పరిస్థితి లేదని నిర్ణయానికి వచ్చారు. ఉత్సవాలపై నిషేధానికి అందరూ సమ్మతించారు.

హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీ కుమార్ సామూహిక వేడుకలపై నిషేధం గురించి ట్విట్టర్‌లో ప్రకటించారు. ఇప్పటికే బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలాన్ని రద్దు చేయడం, ఖైరతాబాద్ వినాయకుడిని కూడా అతి తక్కువ ఎత్తులో రూపొందిస్తుండటం తెలిసిందే.

అన్ని ఆలయాల్లో నవరాత్రులు
వినాయక చవితి ఉత్సవాలను, మొహర్రం పండగను నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జన సమూహం లేకుండా పండగలను ఎవరి ఇంట్లో వారే జరుపుకోవాలని, సామూహిక నిమజ్జనాలు, ప్రార్థనలు ఉండవని… ఇది మనందరి క్షేమం కోసమే అన్నారు. ఆలయాల్లో వినాయకచవితి నవరాత్రులను శాస్త్రోక్తంగా నిర్వహించాలని ఈమేరకు దేవాదాయ కమిషనర్ ను మంత్రి ఆదేశించారు.

This post was last modified on August 18, 2020 8:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

25 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago