వినాయకచవితి సమీపిస్తున్న నేపథ్యంలో కొద్దిరోజులుగా ఈ సారి వినాయక చవితి ఉత్సవాలు ఉంటాయా లేదా? అని పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చకు ప్రభుత్వం చెక్ పెట్టేసింది. హైదరాబాదీలకు వెరీవెరీ స్పెషల్ అయిన వినాయకచవితి… కళను కూడా కరోనా పోగొట్టేసింది.
గణేష్ పండగ వస్తే పదిరోజుల పాటు గణపతి బప్ప మోరియా అంటూ మారుమోగే నినాదాలు ఈసారి వినలేం. ఎవరిళ్లలో వారు వినాయక చవితి జరుపుకోవాలంటూ…. ప్రభుత్వం అధికారికంగా చెప్పేసింది.
కరోనా నేపథ్యంలో ఉత్సవాలు నలుగురు కలిసి జరుపుకునే పరిస్థితులు లేని నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు గణేష్ ఉత్సవాలను ఇళ్లేక పరిమితం చేసుకోవాలని, ఇళ్లలోనే గణేష్ ప్రతిమలను ప్రతిష్టించుకుని పూజలు నిర్వహించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వినాయక చవితి ఉత్సవాలలో కీలక పాత్ర పోషించే హోంశాఖ ప్రత్యేక సమావేశంలో నగరానికి చెందిన మంత్రి తలసాని, హోంమంత్రి మహమూద్ అలీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, జీహెచ్ఎంసి కమిషనర్, భాగ్యనగర్ గణేష్ఉత్సవ సమితి నాయకులు హాజరయ్యారు. ఇపుడిపుడే స్వల్పంగా కరోనా కర్వ్ ఫ్లాట్ అవుతున్న నేపథ్యంలో వేడుకలు సామూహికంగా జరుపుకునే పరిస్థితి లేదని నిర్ణయానికి వచ్చారు. ఉత్సవాలపై నిషేధానికి అందరూ సమ్మతించారు.
హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీ కుమార్ సామూహిక వేడుకలపై నిషేధం గురించి ట్విట్టర్లో ప్రకటించారు. ఇప్పటికే బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలాన్ని రద్దు చేయడం, ఖైరతాబాద్ వినాయకుడిని కూడా అతి తక్కువ ఎత్తులో రూపొందిస్తుండటం తెలిసిందే.
అన్ని ఆలయాల్లో నవరాత్రులు
వినాయక చవితి ఉత్సవాలను, మొహర్రం పండగను నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జన సమూహం లేకుండా పండగలను ఎవరి ఇంట్లో వారే జరుపుకోవాలని, సామూహిక నిమజ్జనాలు, ప్రార్థనలు ఉండవని… ఇది మనందరి క్షేమం కోసమే అన్నారు. ఆలయాల్లో వినాయకచవితి నవరాత్రులను శాస్త్రోక్తంగా నిర్వహించాలని ఈమేరకు దేవాదాయ కమిషనర్ ను మంత్రి ఆదేశించారు.
This post was last modified on August 18, 2020 8:38 am
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…