వచ్చే ఎన్నికల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టాలనే పట్దుదలతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ముందుగా వైసీపీ బలాలపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. వైసీపీలోని బలమైన నాయకులను ఓడిస్తే పని మరింత సులువు అవుతుందని బాబు అనుకుంటున్నారు. అందుకే వైసీపీలోని కీలక నేతలపై ఆయన ఫోకస్ పెట్టారని తెలిసింది. ఇందులో భాగంగానే మంత్రి బొత్స సత్యనారాయణను ఓడించేందుకు బాబు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. కానీ అది అనుకున్నంత సులువేమీ కాదు.
బొత్స సత్యనారాయణకు ఉత్తరాంధ్రలో ప్రముఖ బీసీ నాయకుడిగా పేరుంది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఖాతాలో విజయాలే ఎక్కువ. విజయనగరం జిల్లాలో ఆయనకు తిరుగులేదు. 1999లో బొబ్బిలి నుంచి ఎంపీగా గెలిచారు. 2004, 2009లో వరుసగా చీపురుపల్లి ఎమ్మెల్యేగా విజయాలు సాధించారు. గత ఎన్నికల్లోనూ 2019లో చీపురుపల్లి నుంచి గెలిచి మంత్రిగా కొనసాగుతున్నారు. ఇలాంటి నాయకుడిని చీపురుపల్లిలో ఓడించాలంటే టీడీపీకి సరైన అభ్యర్థి కావాలి.
నిజానికి చీపురుపల్లి ఒకప్పుడు టీడీపీకి కంచుకోట అనే చెప్పాలి. 1999 వరకూ అక్కడ ఆ పార్టీదే ఆధిపత్యం. కానీ ఆ తర్వాతే పరిస్థితులు మారాయి. 2014లో కిమిడి మృణాళిని చేతిలో బొత్స ఓడారు. కానీ ఇప్పుడా పరిస్థితులు అక్కడ లేదు.
ఎవరొచ్చినా బొత్స జోరు ముందు తేలిపోతున్నారు. అందుకే ఈ సారి బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని బాబు వెతుకుతున్నారు. ఇక్కడ మాజీ మంత్రి కిమిడి మృణాళిని తనయుడు నాగార్జున చీపురుపల్లి టీడీపీ ఇంఛార్జీగా ఉన్నారు. కానీ బొత్సను ఎదుర్కొనే విషయంలో నాగార్జున సామర్థ్యాలు సరిపోతాయా అన్నది ఇప్పుడు ప్రశ్న. బొత్స ఎత్తులకు అందకుండా పై ఎత్తులు వేసి ఎన్నికల్లో గెలిచే మొనగాడు కావాలన్నది బాబు కోరిక. కానీ బాబు ఎంతగా వెతికినా అలాంటి నాయకుడు దొరకడం లేదని తెలిసింది.
గొడవలు కానీ మనస్పర్థలతో కానీ భార్యతో భర్త మాట్లాడకపోవటం గృహ హింస కిందకు వస్తుందా? మాట్లాడకుండా ఉండటం వేధింపులకు గురి…
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…