దళిత బంధు.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ను ఓడించడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకమని దీన్ని అంటుంటారు. ఆ ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. దళితుల ఓట్ల కోసం 2021లో దళిత బంధు పథకాన్ని ప్రారంభించారనే విమర్శలున్నాయి. ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల నగదు అందిస్తారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత దళిత బంధు కూడా ఊహించినంత వేగంగా సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తొలి విడతలో రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున ఎంపిక చేసి 11,900 మందికి ఈ ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో రెండో విడతగా ఒక్కో నియోజకవర్గానికి 1100 మందిని దళిత బంధు పథకానికి ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 1,29,800 మందికి దళిత బంధు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల దళిత కుటుంబాలున్నాయి. వీళ్లందరికీ దళిత బంధు అందిస్తామని కేసీఆర్ చెప్పారు.
కానీ రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటీకి దళిత బంధు ఇప్పటికిప్పుడు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం వల్ల అయ్యే పని కాదు. తాజాగా ఈ విషయాన్నే ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. 17 లక్షల కుటుంబాలకు ఒకేసారి దళిత బంధు ఇవ్వలేమని చెప్పారు. మరో ఏడేళ్లలో అందరికీ న్యాయం చేస్తామని ప్రకటించారు. మరో ఏడేళ్లు అంటే మరో రెండు సార్లు ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నమాట. అంటే మరో రెండు సార్లు కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేస్తే.. దళిత బంధు అందరికీ దక్కుతుందని మంత్రి చెప్పకనే చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on August 5, 2023 9:11 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…