దళిత బంధు.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ను ఓడించడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకమని దీన్ని అంటుంటారు. ఆ ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. దళితుల ఓట్ల కోసం 2021లో దళిత బంధు పథకాన్ని ప్రారంభించారనే విమర్శలున్నాయి. ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల నగదు అందిస్తారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత దళిత బంధు కూడా ఊహించినంత వేగంగా సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తొలి విడతలో రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున ఎంపిక చేసి 11,900 మందికి ఈ ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో రెండో విడతగా ఒక్కో నియోజకవర్గానికి 1100 మందిని దళిత బంధు పథకానికి ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 1,29,800 మందికి దళిత బంధు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల దళిత కుటుంబాలున్నాయి. వీళ్లందరికీ దళిత బంధు అందిస్తామని కేసీఆర్ చెప్పారు.
కానీ రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటీకి దళిత బంధు ఇప్పటికిప్పుడు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం వల్ల అయ్యే పని కాదు. తాజాగా ఈ విషయాన్నే ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. 17 లక్షల కుటుంబాలకు ఒకేసారి దళిత బంధు ఇవ్వలేమని చెప్పారు. మరో ఏడేళ్లలో అందరికీ న్యాయం చేస్తామని ప్రకటించారు. మరో ఏడేళ్లు అంటే మరో రెండు సార్లు ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నమాట. అంటే మరో రెండు సార్లు కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేస్తే.. దళిత బంధు అందరికీ దక్కుతుందని మంత్రి చెప్పకనే చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on August 5, 2023 9:11 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…