తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ (టీటీడీ) కొత్త ఛైర్మన్గా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు అన్న విషయంపై చాలాకాలంగా సందిగ్దత ఏర్పడిన సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి ఆ పదవి దక్కనుందని ప్రచారం జరిగింది. ఇక, జంగాతో పాటు మరికొందరు నేతల పేర్లు కూడా వినిపించాయి. అయితే, చివరకు తిరుపతి ఎమ్మెల్యే , వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ నూతన చైర్మన్ గా నియమించారు సీఎం జగన్.
అయితే, భూమన టీటీడీ ఛైర్మన్ గా చేయడం ఇది తొలిసారి కాదు.2006-08లో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒకసారి టీటీడీ ఛైర్మన్గా భూమన పని చేశారు. భూమన పదవిలో ఉన్నపుడే దళిత గోవిందం వంటి పథకాలను టీటీడీ ప్రవేశపెట్టింది. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న భూమన 2019 ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, రాబోయే ఎన్నికల్లో తిరుపతి టికెట్ను తనయుడు అభినయ్ రెడ్డికి కేటాయించాలని జగన్ ను భూమన కోరుతున్నారు. తాజాగా భూమనను టీటీడీ ఛైర్మన్గా నియమించడంతో అభినయ్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లేనని తెలుస్తోంది. భూమన..ఒక దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లేనని టాక్ వస్తోంది.
This post was last modified on August 5, 2023 6:03 pm
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…