Political News

టీటీడీ కొత్త ఛైర్మన్ గా భూమన

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ (టీటీడీ) కొత్త ఛైర్మన్‌గా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు అన్న విషయంపై చాలాకాలంగా సందిగ్దత ఏర్పడిన సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి ఆ పదవి దక్కనుందని ప్రచారం జరిగింది. ఇక, జంగాతో పాటు మరికొందరు నేతల పేర్లు కూడా వినిపించాయి. అయితే, చివరకు తిరుపతి ఎమ్మెల్యే , వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ నూతన చైర్మన్ గా నియమించారు సీఎం జగన్.

అయితే, భూమన టీటీడీ ఛైర్మన్ గా చేయడం ఇది తొలిసారి కాదు.2006-08లో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒకసారి టీటీడీ ఛైర్మన్‌గా భూమన పని చేశారు. భూమన పదవిలో ఉన్నపుడే దళిత గోవిందం వంటి పథకాలను టీటీడీ ప్రవేశపెట్టింది. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న భూమన 2019 ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, రాబోయే ఎన్నికల్లో తిరుపతి టికెట్‌ను తనయుడు అభినయ్ రెడ్డికి కేటాయించాలని జగన్ ను భూమన కోరుతున్నారు. తాజాగా భూమనను టీటీడీ ఛైర్మన్‌గా నియమించడంతో అభినయ్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లేనని తెలుస్తోంది. భూమన..ఒక దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లేనని టాక్ వస్తోంది.

This post was last modified on August 5, 2023 6:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

46 minutes ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

2 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

2 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

4 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

4 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

4 hours ago