తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ (టీటీడీ) కొత్త ఛైర్మన్గా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు అన్న విషయంపై చాలాకాలంగా సందిగ్దత ఏర్పడిన సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి ఆ పదవి దక్కనుందని ప్రచారం జరిగింది. ఇక, జంగాతో పాటు మరికొందరు నేతల పేర్లు కూడా వినిపించాయి. అయితే, చివరకు తిరుపతి ఎమ్మెల్యే , వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ నూతన చైర్మన్ గా నియమించారు సీఎం జగన్.
అయితే, భూమన టీటీడీ ఛైర్మన్ గా చేయడం ఇది తొలిసారి కాదు.2006-08లో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒకసారి టీటీడీ ఛైర్మన్గా భూమన పని చేశారు. భూమన పదవిలో ఉన్నపుడే దళిత గోవిందం వంటి పథకాలను టీటీడీ ప్రవేశపెట్టింది. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న భూమన 2019 ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, రాబోయే ఎన్నికల్లో తిరుపతి టికెట్ను తనయుడు అభినయ్ రెడ్డికి కేటాయించాలని జగన్ ను భూమన కోరుతున్నారు. తాజాగా భూమనను టీటీడీ ఛైర్మన్గా నియమించడంతో అభినయ్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లేనని తెలుస్తోంది. భూమన..ఒక దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లేనని టాక్ వస్తోంది.
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…