శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగిన ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో సుమారు 30 మంది టీడీపీ నేతలు, కార్యకర్తల పై కేసు నమోదు చేయగా..ఎవరినీ అదుపులోనికి మాత్రం తీసుకోలేదు. వారి పై ఐపీసీ 147,332, 353, 128 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు వివరించారు.
టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారు, పోలీసు వారి వాహనాలకు సైతం ఉద్దేశ పూర్వకంగానే నిప్పు పెట్టారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన అందరిపై కఠినమైన శిక్షలు అమలు చేస్తామని వెల్లడించారు డీజీపీ.
ఈ ఘటన గురించి వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి….డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్ లను ఆదేశించారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నామని, ఇప్పటికే అనేకమందిని గుర్తించామని, మరికొందరి కదలికలపై కూడా నిఘా పెట్టామన్నారు. చంద్రబాబు రూట్ ప్లాన్ మార్పు వ్యవహారం కూడా విచారణలో తేలుతుందని, ఈ ఘటన వెనుక ఎవరున్నారో ప్రాథమిక సమాచారం ఉందని తెలిపారు. లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.
డీఐజీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ.. పుంగనూరులో టీడీపీ నేతల దాడిలో గాయపడిన పోలీసులను మెరుగైన చికిత్స నిమిత్తం రాత్రి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. నాయకులు పార్టీ సిద్ధాంతాలపై వ్యాఖ్యానించాలని.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడకూడదన్నారు. వీఐపీ వచ్చే కొద్ది సమయంలోనే టౌన్ లోకి తీసుకొస్తామని ప్రొరోక్ చేశారన్నారు. ఉద్దేశ పూర్వకంగానే రాళ్లతో దాడి చేశారన్నారు. తెలుగుదేశం శ్రేణుల దాడిలో 13 మంది పోలీసులకు గాయాలయ్యాయన్నారు. దాడి చేసిన వారిపై చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు డీఐజీ.
కాగా శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు పర్యటన రసాభాసాగా మారింది. పుంగనూరుకు చంద్రబాబు రావొద్దంటూ పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నల్లజెండాలను, నల్ల బెలూన్లను ఎగురవేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం రాళ్లతో ఇరు వర్గాలు దాడికి దిగారు. ఈ క్రమంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
అయితే టీడీపీ కార్యకర్తలే రాళ్లు విసిరారని పోలీసులు చెబుతున్నారు. కొందరు తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెచ్చిపోయి పోలీసుల వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారన్నారు. ముందుగానే అనుకుని పక్కా ప్లాన్ ప్రకారం దాడికి తెగబడినట్లు చెబుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు బైపాస్ మీదుగా వెళతారని రూట్ మ్యాప్ ఇచ్చారని.. కానీ ఆ తర్వాత ఉన్నట్టుండి ప్లాన్ మార్చి పుంగనూరులోకి వచ్చేందుకు ప్రయత్నించారని పోలీసులు వెల్లడిస్తున్నారు.
This post was last modified on August 5, 2023 3:00 pm
తెలుగు రాజకీయాల్లో కుటుంబ రాజకీయాలు కొత్త కాదు. ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకులు, భార్యభర్తలు కూడా చట్టసభలకు ప్రాథినిత్యం వహించిన…
సోషల్ మీడియాలో, పరిశ్రమలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన టికెట్ రేట్ల జిఓ మీద పెద్ద చర్చ జరుగుతోంది. ప్రీమియం…
వెంకటేష్ - కళ్యాణ్ రామ్ కలయికలో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న సినిమాకు 'జనవరి 12 విడుదల' టైటిల్ లాక్…
ఇప్పుడు అమెరికాలో కొత్తగా వినిపిస్తున్న పేరు సరితా కోమటిరెడ్డి. ఈ తెలంగాణా బిడ్డ న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి రేసులో…
తమిళం కంటే తెలుగులోనే బాగా పెర్ఫార్మ్ చేస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ కు రెండో వారం చాలా కీలకం కానుంది.…
మన ప్రేక్షకులకు స్ట్రెయిట్ డబ్బింగ్ అనే భేదాలు ఉండవు కాబట్టి ఒరిజినల్ వెర్షన్లతో సమానంగా ఇక్కడా రిలీజ్ చేయడం మంచిదే.…