Political News

పుంగనూరు దాడి ఘటనలో 30 మంది పై కేసు!

శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగిన ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో సుమారు 30 మంది టీడీపీ నేతలు, కార్యకర్తల పై కేసు నమోదు చేయగా..ఎవరినీ అదుపులోనికి మాత్రం తీసుకోలేదు. వారి పై ఐపీసీ 147,332, 353, 128 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు వివరించారు.

టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారు, పోలీసు వారి వాహనాలకు సైతం ఉద్దేశ పూర్వకంగానే నిప్పు పెట్టారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన అందరిపై కఠినమైన శిక్షలు అమలు చేస్తామని వెల్లడించారు డీజీపీ.

ఈ ఘటన గురించి వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి….డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్‌ లను ఆదేశించారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నామని, ఇప్పటికే అనేకమందిని గుర్తించామని, మరికొందరి కదలికలపై కూడా నిఘా పెట్టామన్నారు. చంద్రబాబు రూట్ ప్లాన్ మార్పు వ్యవహారం కూడా విచారణలో తేలుతుందని, ఈ ఘటన వెనుక ఎవరున్నారో ప్రాథమిక సమాచారం ఉందని తెలిపారు. లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.

డీఐజీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ.. పుంగనూరులో టీడీపీ నేతల దాడిలో గాయపడిన పోలీసులను మెరుగైన చికిత్స నిమిత్తం రాత్రి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. నాయకులు పార్టీ సిద్ధాంతాలపై వ్యాఖ్యానించాలని.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడకూడదన్నారు. వీఐపీ వచ్చే కొద్ది సమయంలోనే టౌన్ లోకి తీసుకొస్తామని ప్రొరోక్ చేశారన్నారు. ఉద్దేశ పూర్వకంగానే రాళ్లతో దాడి చేశారన్నారు. తెలుగుదేశం శ్రేణుల దాడిలో 13 మంది పోలీసులకు గాయాలయ్యాయన్నారు. దాడి చేసిన వారిపై చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు డీఐజీ.

కాగా శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు పర్యటన రసాభాసాగా మారింది. పుంగనూరుకు చంద్రబాబు రావొద్దంటూ పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నల్లజెండాలను, నల్ల బెలూన్లను ఎగురవేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం రాళ్లతో ఇరు వర్గాలు దాడికి దిగారు. ఈ క్రమంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

అయితే టీడీపీ కార్యకర్తలే రాళ్లు విసిరారని పోలీసులు చెబుతున్నారు. కొందరు తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెచ్చిపోయి పోలీసుల వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారన్నారు. ముందుగానే అనుకుని పక్కా ప్లాన్ ప్రకారం దాడికి తెగబడినట్లు చెబుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు బైపాస్ మీదుగా వెళతారని రూట్ మ్యాప్ ఇచ్చారని.. కానీ ఆ తర్వాత ఉన్నట్టుండి ప్లాన్ మార్చి పుంగనూరులోకి వచ్చేందుకు ప్రయత్నించారని పోలీసులు వెల్లడిస్తున్నారు.

This post was last modified on August 5, 2023 3:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్ర‌జ‌ల సంద‌ర్శ‌న‌కు వైసీపీ `విలాసం`?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని రుషికొండ‌పై దాదాపు 500 కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం వ్య‌యంతో విలాస‌వంతంగా నిర్మించిన ప్యాలెస్‌ను ఏం చేయాల‌న్న…

4 minutes ago

విజ‌య‌న్ వ‌ర్సెస్ రేవంత్‌… ర‌చ్చ‌-ర‌చ్చ‌!

కేర‌ళం ఎన్నిక‌ల సంద‌ర్భంగా అక్క‌డ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున‌ ప్ర‌చారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. సీనియ‌ర్…

50 minutes ago

ఇండస్ట్రీలో కొత్త ‘అల్లరోడు’

అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…

3 hours ago

ఏడాది తర్వాత… ఈ రోజు విధ్వంసమే

ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…

5 hours ago

కమ్యూనిస్టుల మనసు దోచుకున్న కవిత

దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…

6 hours ago

శభాష్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నిజమేనండోయ్...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన…

9 hours ago