ఏ పార్టీకైనా విజయం అందాలంటే.. అంత ఈజీ అయితే కాదు. ముందు పార్టీని సంస్కరించుకోవాలి. తర్వాత నేతలను లైన్లో పెట్టుకోవాలి. అనంతరం.. తాము ఎంచుకున్న అజెండాను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ఈ మూడు విషయాలను పక్కాగా నిర్వహిస్తే తప్ప.. ఏ పార్టీకైనా.. విజయం దక్కించుకోవడం అంత తేలిక కాదనే వాదన బలంగా వినిపిస్తూనే ఉంటుంది.
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విషయానికి వస్తే.. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు చేసిన బీషణ ప్రతిజ్ఞతో పాటు.. పార్టీ కేడర్ను కాపాడుకు నేందుకు కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అధినేత గుర్తించారు. ఈ క్ర మంలోనే చంద్రబాబు ఇప్పటికీ ప్రజల్లోకి వస్తున్నారు. తాను చేయాలని అనుకున్న పనులు చేస్తున్నారు.
ప్రజల్లో ప్రసంగాలు గుప్పిస్తున్నారు. మేనిఫెస్టో అంటూ.. ఇటీవల మహానాడులో మహిళా శక్తి.. సహా ఇతర పథకాలు ప్రకటించారు. మొత్తంగా పార్టీ అధిష్టానం పరంగా చర్యలు.. దూకుడు బాగానే ఉంది. ఇక, ఇప్పు డు కావాల్సింది.. ఏంటి? ఏ మైనస్లు ఉన్నాయి? పార్టీని ఎలా ముందుకు నడిపిస్తే.. విజయం ఖాయమ వుతుంది? వంటి కీలక అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ మైనస్లను చెరిపేస్తే.. పార్టీ పరంగా దూకుడు పెరుగుతుందని అంటున్నారు పరిశీలకులు.
1) పార్టీ నేతల్లో ఉన్న టికెట్ల కలవరాలు. 2) పొత్తులపై క్లారిటీ 3) వచ్చే ఎన్నికల్లో ఇచ్చే ప్రధాన హామీలు.. 4) సీట్ల కేటాయింపు 5) వారసుల కు హామీలు. ఈ విషయంలో చంద్రబాబు నాన్చుడు ధోరణి అవలంభిస్తు న్నారనేది మెజారిటీ తమ్ముళ్ల మాట. ఈ క్రమంలోనే వారు ఎన్నికల సమయానికి ఈ సందేహాలు క్లియర్ అవుతాయని.. అప్పటి వరకు వేచి చూడొచ్చని అనుకుంటున్నారు. కాబట్టి ఈమైనస్ల విషయంలో చంద్రబాబు సాధ్యమైనంత వరకు క్లారిటీ ఇస్తే విజయం తమదేనని చెబుతున్నారు.
This post was last modified on August 5, 2023 2:57 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…