ఏ పార్టీకైనా విజయం అందాలంటే.. అంత ఈజీ అయితే కాదు. ముందు పార్టీని సంస్కరించుకోవాలి. తర్వాత నేతలను లైన్లో పెట్టుకోవాలి. అనంతరం.. తాము ఎంచుకున్న అజెండాను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ఈ మూడు విషయాలను పక్కాగా నిర్వహిస్తే తప్ప.. ఏ పార్టీకైనా.. విజయం దక్కించుకోవడం అంత తేలిక కాదనే వాదన బలంగా వినిపిస్తూనే ఉంటుంది.
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విషయానికి వస్తే.. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు చేసిన బీషణ ప్రతిజ్ఞతో పాటు.. పార్టీ కేడర్ను కాపాడుకు నేందుకు కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అధినేత గుర్తించారు. ఈ క్ర మంలోనే చంద్రబాబు ఇప్పటికీ ప్రజల్లోకి వస్తున్నారు. తాను చేయాలని అనుకున్న పనులు చేస్తున్నారు.
ప్రజల్లో ప్రసంగాలు గుప్పిస్తున్నారు. మేనిఫెస్టో అంటూ.. ఇటీవల మహానాడులో మహిళా శక్తి.. సహా ఇతర పథకాలు ప్రకటించారు. మొత్తంగా పార్టీ అధిష్టానం పరంగా చర్యలు.. దూకుడు బాగానే ఉంది. ఇక, ఇప్పు డు కావాల్సింది.. ఏంటి? ఏ మైనస్లు ఉన్నాయి? పార్టీని ఎలా ముందుకు నడిపిస్తే.. విజయం ఖాయమ వుతుంది? వంటి కీలక అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ మైనస్లను చెరిపేస్తే.. పార్టీ పరంగా దూకుడు పెరుగుతుందని అంటున్నారు పరిశీలకులు.
1) పార్టీ నేతల్లో ఉన్న టికెట్ల కలవరాలు. 2) పొత్తులపై క్లారిటీ 3) వచ్చే ఎన్నికల్లో ఇచ్చే ప్రధాన హామీలు.. 4) సీట్ల కేటాయింపు 5) వారసుల కు హామీలు. ఈ విషయంలో చంద్రబాబు నాన్చుడు ధోరణి అవలంభిస్తు న్నారనేది మెజారిటీ తమ్ముళ్ల మాట. ఈ క్రమంలోనే వారు ఎన్నికల సమయానికి ఈ సందేహాలు క్లియర్ అవుతాయని.. అప్పటి వరకు వేచి చూడొచ్చని అనుకుంటున్నారు. కాబట్టి ఈమైనస్ల విషయంలో చంద్రబాబు సాధ్యమైనంత వరకు క్లారిటీ ఇస్తే విజయం తమదేనని చెబుతున్నారు.
This post was last modified on August 5, 2023 2:57 pm
కొన్ని కార్యక్రమాల వేళ.. కొన్ని అంశాలకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారీ…
తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు మీ…
గత వారం రోజులకు పైగా తిరుగుతున్న లీకులకు అధికారిక ముద్ర పడిపోయింది. టాక్సిక్ జూన్ 4 నుంచి వాయిదా వేస్తున్నట్టు…
నవ్యాంద్రప్రదేశ్ లో అధికార కూటమి రథ సారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుదవారం నుంచి నవ శకం మొదలు…
లెనిన్ గురించి అప్డేట్స్ లేక అసహనానికి గురవుతున్న అభిమానులకు ఊరట కలిగిస్తూ నాగార్జున ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్…
ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ తరుణ్ భాస్కర్…