ఏ పార్టీకైనా విజయం అందాలంటే.. అంత ఈజీ అయితే కాదు. ముందు పార్టీని సంస్కరించుకోవాలి. తర్వాత నేతలను లైన్లో పెట్టుకోవాలి. అనంతరం.. తాము ఎంచుకున్న అజెండాను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ఈ మూడు విషయాలను పక్కాగా నిర్వహిస్తే తప్ప.. ఏ పార్టీకైనా.. విజయం దక్కించుకోవడం అంత తేలిక కాదనే వాదన బలంగా వినిపిస్తూనే ఉంటుంది.
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విషయానికి వస్తే.. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు చేసిన బీషణ ప్రతిజ్ఞతో పాటు.. పార్టీ కేడర్ను కాపాడుకు నేందుకు కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అధినేత గుర్తించారు. ఈ క్ర మంలోనే చంద్రబాబు ఇప్పటికీ ప్రజల్లోకి వస్తున్నారు. తాను చేయాలని అనుకున్న పనులు చేస్తున్నారు.
ప్రజల్లో ప్రసంగాలు గుప్పిస్తున్నారు. మేనిఫెస్టో అంటూ.. ఇటీవల మహానాడులో మహిళా శక్తి.. సహా ఇతర పథకాలు ప్రకటించారు. మొత్తంగా పార్టీ అధిష్టానం పరంగా చర్యలు.. దూకుడు బాగానే ఉంది. ఇక, ఇప్పు డు కావాల్సింది.. ఏంటి? ఏ మైనస్లు ఉన్నాయి? పార్టీని ఎలా ముందుకు నడిపిస్తే.. విజయం ఖాయమ వుతుంది? వంటి కీలక అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ మైనస్లను చెరిపేస్తే.. పార్టీ పరంగా దూకుడు పెరుగుతుందని అంటున్నారు పరిశీలకులు.
1) పార్టీ నేతల్లో ఉన్న టికెట్ల కలవరాలు. 2) పొత్తులపై క్లారిటీ 3) వచ్చే ఎన్నికల్లో ఇచ్చే ప్రధాన హామీలు.. 4) సీట్ల కేటాయింపు 5) వారసుల కు హామీలు. ఈ విషయంలో చంద్రబాబు నాన్చుడు ధోరణి అవలంభిస్తు న్నారనేది మెజారిటీ తమ్ముళ్ల మాట. ఈ క్రమంలోనే వారు ఎన్నికల సమయానికి ఈ సందేహాలు క్లియర్ అవుతాయని.. అప్పటి వరకు వేచి చూడొచ్చని అనుకుంటున్నారు. కాబట్టి ఈమైనస్ల విషయంలో చంద్రబాబు సాధ్యమైనంత వరకు క్లారిటీ ఇస్తే విజయం తమదేనని చెబుతున్నారు.
This post was last modified on August 5, 2023 2:57 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…