ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు నిర్ణీత లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో లక్ష్యాల స్థాయి మారుతున్న విషయం కొంత నిశితంగా గమనిస్తే తప్ప అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. నిన్నమొన్నటి వరకు ప్రజలను మచ్చిక చేసుకుని.. చంద్రబాబు విజన్ను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా విజయం దక్కించు కోవాలని భావించింది.
అయితే.. అనూహ్య కారణాలు.. పార్టీ పరిస్థితిని క్షేత్రస్థాయిలో అంచనా వేసుకున్న టీడీపీ అధినేత చంద్ర బాబు.. ఈ వ్యూహాన్ని కొంత మార్చుకుని.. మరింత జోరు పెంచారు. వైసీపీకి దన్నుగా ఉన్న జిల్లాల్లో గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఈ సారి భారీ విజయం నమోదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక వేళ భారీ కాకపోయినా.. వైసీపీ స్థాయిని తగ్గించేలా అయినా.. పుంజుకోవాలన్నది టీడీపీ లక్ష్యం.
ఈ క్రమంలో ప్రాంతాల వారీగా చూసుకుంటే.. సీమ ఇప్పుడు వైసీపీకి అన్నివిధాలా అందివచ్చే అవకాశం ఉన్న ప్రాంతంగా టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో గత ఎన్నికల్లో వైసీపీ హవా ఎక్కువగా ఉన్నా.. టీడీపీకి మార్కులు బాగానే పడ్డాయి. ఎంపీ సహా పలువురు ఎమ్మెల్యేలు గెలిచారు. సో.. ఇక్కడ మెరుగ్గానే టీడీపీ పరిస్థితి ఉంది. ఇక, తూర్పు, పశ్చిమ ఉమ్మడి గోదావరులు.. ఇతర కృష్ణ వంటివాటిలోనూ పార్టీ ప్రభావం ఎక్కువగానే ఉంది.
ఈ క్రమంలో వైసీపీకి బలంగా ఉన్న సీమ జిల్లాలు.. ముఖ్యంగా గత ఎన్నికల్లో కర్నూలులో టీడీపీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేక పోయింది. కడపలోనూ అదే పరిస్థితి ఏర్పడింది. అంటే.. నాలుగు జిల్లాల్లో 2 టీడీపీ పోగొట్టుకున్నట్టయింది. ఈ నేపథ్యంలో సీమలో పార్టీని పుంజుకునేలా చేయడం.. అలాగే.. వైసీపీ బలాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించడం అనేది టీడీపీ ముందున్న ప్రధాన లక్ష్యంగా ఉందని.. అందుకే చంద్రబాబు సీమ డిక్లరేషన్ పేరుతో.. ఇక్కడ పర్యటనలు చేస్తున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
This post was last modified on August 5, 2023 2:30 pm
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…