పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి నాగబాబు.. రెండు కీలక విషయాలు చెప్పారు. ఈ రెండు కూడా ఆయన చెప్పినట్టు వాస్తవే. ఇందులో కల్పితం కానీ.. మెరమెచ్చు కానీ ఏమీ లేదు. 1) ఏ పార్టీకి లేనంత యువశక్తి జనసేనకు ఉంది. 2) అవినీతి రహిత వ్యక్తి కాబట్టి పవన్కు ఓటేయాలి. తాజాగా నాగబాబు ఈ రెండు విషయాలను కూడా బలంగా ప్రస్తావించారు.
అంతేకాదు.. రాబోయే రోజుల్లో ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కూడా ఆయన స్వీయ నిర్దేశం చేసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. నాగబాబు చెప్పిన అనేక విషయాల్లో ఈ రెండు కీలకాలే. అయితే.. అసలు సమస్య ఎక్కడ ఉందంటే.. వీటిని సాధించడంలోనే ఉందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇప్పుడు కొత్తగా నాగబాబు కనిపెట్టినా.. కనిపెట్టకపోయినా.. జనసేనకు యువశక్తి ఉందనేది అందరికీ తెలిసిందే.
అయితే.. ఆ యువశక్తిని… అభిమానులు కావొచ్చు.మెగా అభిమానులు కావొచ్చు.. ఇలా ఎవరైనా కూడా.. జనసేనకు అండగానే ఉన్నారు. అయితే.. ఎన్నికల సమయానికి వీరిని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలన్న వ్యూహమే లేకుండా పోతోందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గత ఎన్నికల సమయంలోనూ పవన్ను సీఎంగా చూడాలని తపించిపోయిన.. అభిమాన గణం ఓటు బ్యాంకు విషయానికి వస్తేచేతులు ఎత్తేశారు.
ఈ నేపథ్యంలో యువతను.. యువశక్తిని ఓటు బ్యాంకుగా మలుచుకోవాల్సిన అవసరం ఇప్పుడు నాగబా బుపైనే ఉందని అంటున్నారు పరిశీలకులు. రెండో విషయానికి వస్తే.. అవినీతి రహిత వ్యక్తి అంటూ.. పవన్ను ఆకాశానికి ఎత్తేశారు. మంచిదే. దీనిని ఎవరూ కాదనరు. కానీ.. దీనిని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడమే కాదు.. తాను నిజాయితీగా ఉంటానని చెప్పడమే కాదు.. ప్రభుత్వ వ్యవస్థలను అవినీతి రహితంగా ఉంచుతానన్న ధీమా ప్రజలకు కల్పించాల్సి ఉంటుంది.
అది కనుక సక్సెస్ అయితే.. ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది. దీనిని సాధించడం పైకి చెప్పినంత ఈజీ అయితే కాదు. సో.. నాగబాబు పూనుకొని ప్రజల్లో తిరిగి ప్రచారం చేస్తే… ఫలితం ఉంటుందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…