తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలు, కసరత్తుల్లో నిమగ్నమయ్యాయి. ముందుగా పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసే దిశగా ప్రణాళికల్లో మునిగి తేలాయి. ఒక్క సీటు కోసం ఇద్దరి కంటే ఎక్కువ నేతల మధ్య పోటీ, తమ వర్గం వాళ్లకే టికెట్లు దక్కాలనే అగ్ర నేతల పట్టు.. ఇలాంటి సమస్యలు పార్టీలకు తలనొప్పిగా మారాయి. ఇక తెలంగాణలో బీజేపీ విషయానికి వస్తే సీట్ల ఎంపిక బాధ్యతను ఏకంగా అయిదుగురికి అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ.. అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. ముందుగా ఏకాభిప్రాయం ఉన్న సీట్ల ఎంపికపై ధ్యాస పెట్టింది. అందుకు వీలుగా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విడివిడిగా అభ్యర్థుల జాబితా రూపొందించనున్నారు. ఈ జాబితాలను పరిశీలించిన తర్వాత ఈ అయిదుగురు ఏకాభిప్రాయానికి వచ్చే సీట్లతో కూడిన లిస్ట్ను ప్రకటించే అవకాశముంది.
ఈ అయిదుగురు కలిసి ఏకాభిప్రాయానికి వచ్చే సీట్లు రాష్ట్రంలో మూడో వంతు ఉంటాయని సమాచారం. దీని ప్రకారం మొదటి జాబితాలో 35 నుంచి 40 సీట్ల వరకూ అభ్యర్థులు ప్రకటించే అవకాశముంది. కానీ ఆ తర్వాతే అసలైన సమస్య కలుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అయిదుగురు నేతలు తమకు నచ్చిన అభ్యర్థులనే, తమ వర్గం నేతలనే ఎన్నికల్లో నిలబెట్టాలని పట్టుబడితే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. మరి వీళ్లను బుజ్జగించి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అధిష్ఠానం ఎలా ఖరారు చేస్తుందన్నది చూడాలి.
This post was last modified on August 4, 2023 3:05 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…