తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలు, కసరత్తుల్లో నిమగ్నమయ్యాయి. ముందుగా పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసే దిశగా ప్రణాళికల్లో మునిగి తేలాయి. ఒక్క సీటు కోసం ఇద్దరి కంటే ఎక్కువ నేతల మధ్య పోటీ, తమ వర్గం వాళ్లకే టికెట్లు దక్కాలనే అగ్ర నేతల పట్టు.. ఇలాంటి సమస్యలు పార్టీలకు తలనొప్పిగా మారాయి. ఇక తెలంగాణలో బీజేపీ విషయానికి వస్తే సీట్ల ఎంపిక బాధ్యతను ఏకంగా అయిదుగురికి అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ.. అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. ముందుగా ఏకాభిప్రాయం ఉన్న సీట్ల ఎంపికపై ధ్యాస పెట్టింది. అందుకు వీలుగా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విడివిడిగా అభ్యర్థుల జాబితా రూపొందించనున్నారు. ఈ జాబితాలను పరిశీలించిన తర్వాత ఈ అయిదుగురు ఏకాభిప్రాయానికి వచ్చే సీట్లతో కూడిన లిస్ట్ను ప్రకటించే అవకాశముంది.
ఈ అయిదుగురు కలిసి ఏకాభిప్రాయానికి వచ్చే సీట్లు రాష్ట్రంలో మూడో వంతు ఉంటాయని సమాచారం. దీని ప్రకారం మొదటి జాబితాలో 35 నుంచి 40 సీట్ల వరకూ అభ్యర్థులు ప్రకటించే అవకాశముంది. కానీ ఆ తర్వాతే అసలైన సమస్య కలుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అయిదుగురు నేతలు తమకు నచ్చిన అభ్యర్థులనే, తమ వర్గం నేతలనే ఎన్నికల్లో నిలబెట్టాలని పట్టుబడితే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. మరి వీళ్లను బుజ్జగించి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అధిష్ఠానం ఎలా ఖరారు చేస్తుందన్నది చూడాలి.
This post was last modified on August 4, 2023 3:05 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…