Political News

సీమ‌ను ప‌వ‌న్ వ‌దులుకున్న‌ట్టేనా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది కూడా లేదు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. వారాహి యాత్ర పేరుతో ప్ర‌జల్లో ఉంటున్నారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో వారాహి యాత్ర‌ను విజ‌య‌వంతంగా ముగించారు. ఇక ఇప్పుడు ఉత్త‌రాంధ్రపై దృష్టి పెట్టారు. ఉత్త‌రాంధ్ర‌లో త‌దుప‌రి వారాహి యాత్ర‌ను కొన‌సాగించ‌నున్నారు. దీంతో రాయ‌ల‌సీమ‌పై ప‌వ‌న్ ఆశ‌లు వ‌దులుకున్నారని, అందుకే వారాహి యాత్ర కొన‌సాగింపున‌కు ఉత్త‌రాంధ్ర‌ను ఎంచుకున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

రాయ‌ల‌సీమ‌లో అధికార వైసీపీ బ‌లంగా ఉంది. 2014 ఎన్నిక‌ల్లో స‌గం సీట్లు వైసీపీ ఖాతాలోనే చేరాయి. ఇక 2019లో అయితే ఏకంగా 49 చోట్ల వైసీపీ జెండా ఎగిరింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఇక్క‌డ కేవ‌లం మూడు స్థానాల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో టీడీపీకే సీమ‌లో దిక్కు లేదు.. అలాంటిది జ‌న‌సేన అక్క‌డ నిల‌బ‌డ‌డం క‌ష్ట‌మేన‌ని ప‌వ‌న్ భావించిన‌ట్లు తెలుస్తోంది. అందుకే పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న రాయ‌ల సీమ కంటే కూడా బ‌లంగా ఉన్న ప్రాంతాల్లో దృష్టి పెట్ట‌డం మేల‌ని ప‌వ‌న్ భావిస్తున్నార‌ని టాక్‌.

త‌న సామాజిక వ‌ర్గం, అభిమానులు, ఓటు బ్యాంకు ఎక్క‌డైతే బ‌లంగా ఉంద‌ని ప‌వ‌న్ భావిస్తున్నారో అక్క‌డే వారాహి యాత్ర‌ను ప‌రుగులు పెట్టించే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలోనే మొద‌ట ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెండు ద‌ఫాలుగా వారాహి యాత్ర నిర్వ‌హించారు. ఇప్పుడేమో మూడో విడ‌త యాత్ర కోసం ఉత్త‌రాంధ్ర‌ను ఎంచుకున్నారు. విశాఖ నుంచి ఈ యాత్ర తిరిగి ప్రారంభించ‌నున్న‌ట్లు జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ ఛైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ప్ర‌క‌టించారు.

Satya

Recent Posts

SIR పై జగన్ అవగాహన ఇంతేనా?

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…

5 minutes ago

వాళ్లెవ్వరికీ దక్కని గౌరవం సింగీతానికి?

ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…

16 minutes ago

‘మెట్రో’పై ముక్కోణపు పోరు!

ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…

16 minutes ago

రిషికొండ ప్యాలెస్… కూటమికి గుదిబండేనా?

రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…

28 minutes ago

టాలీవుడ్‌పై బాలీవుడ్ ఏడుపుకిది నిదర్శనం

ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…

1 hour ago

జగన్ అటాక్ మోడ్ లోకి వచ్చినట్టేనా…?

ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…

2 hours ago