Political News

కేఏ పాల్‌.. ఇక విశాఖ పాల్‌!

ప్ర‌జాశాంతి పార్టీ పెట్టి.. 2019 ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేఏ పాల్ చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో త‌న హావాభావాల‌తో ఆయ‌న చేసిన సంద‌డి గుర్తే ఉండి ఉంటుంది. ఆ ఎన్నిక‌ల త‌ర్వాత కొంత‌కాలం సైలెంట్ అయిపోయిన ఆయ‌న.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో స‌మ‌స్య‌ల‌పై మాట్లాడుతూ, ఉప ఎన్నిక‌ల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తూ క‌నిపించారు. ఇప్పుడు మ‌రోసారి ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో మ‌ళ్లీ కేఏ పాల్ యాక్టివ్ అవుతున్న‌ట్లున్నారు. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే అందుకు నిద‌ర్శ‌నం.

ఈ సారి ఎన్నిక‌ల్లో కేఏ పాల్ రాష్ట్రం దాటి చూస్తున్నారు. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో లోక్‌స‌భకు పోటీ చేస్తాన‌ని చెప్పారు. అది కూడా విశాఖ‌ప‌ట్నం నుంచి. ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్‌, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు విశాఖ‌పై గురిపెట్టి అక్క‌డ ప‌ర్య‌ట‌న‌ల‌పై దృష్టి సారించారు. ఈ నేప‌థ్యంలో కేఏ పాల్ కూడా విశాఖ నుంచే పోటీ చేస్తాన‌ని చెప్ప‌డం విశేషం. విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు త‌న‌కంటే అర్హుడు ఎవ‌రుంటార‌ని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.

విశాఖ ద‌గ్గ‌ర త‌గ‌ర‌పువ‌ల‌స‌నే పాల్ సొంత ప్రాంతం. అందుకే తానే ఇక్క‌డ ప‌క్కా లోక‌ల్ అని పాల్ అంటున్నారు. ఇక‌పై విశాఖ‌లోనే మ‌కాం పెడ‌తాన‌ని, ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు త‌న రాజ‌కీయం త‌డాఖా చూపిస్తాన‌ని ఆయ‌న వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఏపీలోని అన్ని రాజ‌కీయ పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తొత్తులుగా మారాయ‌ని పాల్ విమ‌ర్శించారు. విశాఖ‌కు న్యాయం చేసే నాయ‌కుడినే తానేనని, అందుకే ఇక్క‌డి నుంచే పోటీ చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. విశాఖ స‌మ‌స్య‌ల‌పై త‌న‌కంటే ఇంకెవ‌రికీ బాగా తెలియ‌ద‌ని, ఈ సారి ఇక్క‌డి నుంచి గెలుపు త‌న‌దేన‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.

This post was last modified on August 4, 2023 2:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago