టీడీపీలో టికెట్ ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కుతుందనే అంచనాలు వస్తున్న నేపథ్యంలో పార్టీలో చేరేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో పార్టీలో చేరు తున్నా.. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కుతుందా? అనేది డౌటే. అదేసమయంలో ప్రస్తుతం ఉన్న నాయకులకు కూడా టికెట్లు అందరికీ ఇస్తారా? అంటే.. డౌటే.. ఎందుకంటే.. వారి పనితీరు, వారి గ్రాఫ్ వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నారు.
అయితే.. గ్రాఫ్ ఎలా ఉన్నా.. తమకు ప్రజాదరణ ఎలా ఉన్నా పార్టీలో కీలక నాయకులను పట్టుకుంటే టికె ట్ ఖాయమని భావిస్తున్నవారు యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ చుట్టూ.. మూగుతున్నారు. ఆయనను కలిసి.. మచ్చిక చేసుకుని టికెట్ల విషయంపై ఆయనను బ్రతిమాలుతున్న పరిస్థితి కనిపిస్తోం దని పార్టీలో గుసగుస వినిపిస్తోంది. ఎలాగంటే.. ఉదయాన్నే పాదయాత్ర సమయంలో నారా లోకేష్ సెల్ఫీ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ముందుగానే స్థానిక నాయకులతో పాటు..కొందరు దూర ప్రాంత నాయకులు కూడా నారా లోకేష్ను కలుసుని.. తమ మనసులోని మాటలు చెబుతూ.. కాకాపడుతున్నారట. దీంతో నారా లోకేష్ ఎవరికి ఏం హామీ ఇవ్వాలో తెలియక.. తర్వాత.. చూద్దాం.. తర్వాత. చూద్దాం! అని సాగనంపుతున్నారు. అయితే.. ఇప్పుడు ఈ విషయంపై చంద్రబాబు సీరియస్గా ఉన్నారని ఎన్టీఆర్ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
యువగళం అనేది పాదయాత్ర మాత్రమేనని.. టికెట్ల యాత్ర కాదని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అంతేకాదు.. ఎవరైనా వచ్చి.. టికెట్ల కోసం.. నారాలోకేష్ను అభ్యర్థించినా.. ఆయనపై మానసికంగా ఒత్తిడి చేసినా.. అలాంటివారిని ఇప్పటి నుంచే పక్కన పెడతామని.. అంతర్గతంగా మెసేజ్ పంపించారని అంటున్నారు. అభ్యర్థి సీనియరా? జూనియరా? అనే విషయంతో సంబంధంలేకుండా.. ప్రజల్లో ఉంటున్నారా? గ్రాఫ్ ఎలా ఉంది? గెలుస్తారా? అన్న కోణంలోనే ఆలోచించి టికెట్పై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. ఇదీ.. సంగతి!
This post was last modified on August 4, 2023 12:21 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…