Political News

కేసీఆర్‌కు మ‌రో అస్త్రాన్ని అందిస్తున్న మోడీ..వెరీ ఇంట్ర‌స్టింగ్‌..!

తెలంగాణలో ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగు మాసాల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ క్ర‌మంలో అధికార పార్టీ బీఆర్ ఎస్‌ను ఓడించి.. గ‌ద్దెనెక్కాల‌ని.. పాల‌న ప్రారంభించాల‌ని అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీలు కూడా వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నాయి. అయితే.. వీరిలో క‌ల‌యిక‌.. ఐక్య పోరాటాలు.. వంటివి ఎలా.. ఉన్నా.. కేసీఆర్‌కు ఉన్న వ్య‌తిరేక‌త‌, రెండు సార్లు పాలించార‌న్న వాద‌న‌.. వంటివి ఈ పార్టీల‌కు ద‌న్నుగా మారుతున్నాయనే చర్చ సాగుతోంది.

ఇదేస‌మ‌యంలో కేసీఆర్‌కు గ‌త ఎన్నిక‌ల్లో అంటే 2014లో తెలంగాణ‌ను తానే తెచ్చాన‌న్న సెంటిమెంటు ఉప‌యోగ‌ప‌డింది. ఇక‌, 2018లో టీడీపీ తెలంగాణ‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు అంటే.. 2023 న‌వంబ‌రు-డిసెంబ‌రు మ‌ధ్య జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఇప్ప‌టికైతే.. ఏదీ ఆయ‌న‌కు పెద్ద‌గా అందివ‌చ్చిన సెంటిమెంటు లేదు. దీంతో అభివృద్ధి తెలంగాణ అంటూ.. కొత్త పంథాను ఎంచుకున్నారు.

కానీ, ఇంత‌లోనే హ‌ఠాత్తుగా పెద్ద విష‌యం ఒక‌టి.. కేసీఆర్‌కు మేలు చేసేలా.. ఎన్నిక‌ల గోదాలో నుంచి కారును సునాయాశంగా బ‌య‌టకు వ‌చ్చేలా చేసే ఒక సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని కేంద్రంలోని మోడీ స‌ర్కారు ప్ర‌క‌టించారు. ఇది అలాంటి ఇలాంటి సెంటిమెంటు కాద‌నే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. విషయం ఏంటంటే.. ఉమ్మ‌డి ఏపీ విడిపోయాక‌.. కొన్నాళ్ల పాటు తెలంగాణ‌కు ఏపీ నుంచి విద్యుత్ స‌ర‌ఫ‌రా అయింది. దీనికి సంబందించి.. తెలంగాణ స‌ర్కారు ఏపీకి బిల్లు క‌ట్టాలి.

అయితే.. మొద‌ట్లో బాగానే క‌ట్టినా.. త‌ర్వాత క‌ట్ట‌డం మానేసింది. ఇది 6,720 కోట్ల రూపాయ‌ల‌కు చేరుకుం ది. ఈ సొమ్ము విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదం కోర్టుకు వెల్లింది. దీంతో ఈ విష‌యంపై కోర్టు స్టే విధించింది. కేంద్రాన్ని ప‌రిశీలించాల‌ని ఒక‌సారి.. రెండు తెలుగు రాష్ట్రాలు చ‌ర్చించుకుని ప‌రి ష్కరించుకోవాల‌ని మ‌రోసారి ఇలా.. తేల్చి చెప్పింది. ఇంత‌లో ఈ విష‌యాన్ని ప‌రిష్క‌రించేందుకు కేంద్రంలోని మోడీ స‌ర్కారు రంగంలోకి దిగింది.

తెలంగాణ ప్ర‌భుత్వానికి రిజ‌ర్వ్‌బ్యాంకులో ఉన్న నిధుల‌ను.. ఆ ప్ర‌భుత్వంతో సంప్ర‌దించ‌కుండానే (అంటే.. కేసీఆర్‌ను అడ‌గ‌కుండానే.. ఈ పాయింటే కీల‌కం) ఏపీకి నేరుగా ఇచ్చేసేందుకు మోడీ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఇదే విష‌యాన్ని పార్ల‌మెంటుకు కూడా చెప్పింది. సో.. ఇది చాల‌దా.. కేసీఆర్ త‌న‌ను తాను గెలిపించుకునేందుకు అంటున్నారు ప‌రిశీలకులు.

ఇప్పుడు కేసీఆర్ ఏమంట‌డంటే?..
“అదిగో మ‌న మీద క‌క్ష గ‌ట్టిన్రు.. మ‌నకు సొమ్ములు ఇవ్వ‌క పాయే.. ఆర్బీఐలో ఉన్న మ‌న సొమ్ముపైనా.. బీజేపీ పెద్ద‌లు పెత్త‌నం చేస్తున్రు. ఏపీకి మ‌నం సొమ్ములు ఇవ్వాలంట‌. స‌రే.. ఆ పంచాయ‌తీ ఏదో మేంమేం చూసుకోమా.. కానీ.. తెలంగాణ‌పై పెత్త‌నం చేసేందుకు గిప్పుడు బీజేపీ సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌న ఆత్మాభిమానాన్ని.. మ‌న ఆస్తుల‌ను మ‌న‌మే కాపాడుకోవాలి.. దీనికి మ‌నందరం న‌డుం బిగించాలి”- ఇంకేముంది.. సెంటిమెంటు ఓట్ల రూపంలో మారి.. బ్యాలెట్ బాక్సుల్లోకి చేర‌డం ఖాయం అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on August 4, 2023 12:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోనాలిసా పెళ్లి… లవ్ జిహాద్ కాదట

గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన…

3 hours ago

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

5 hours ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

5 hours ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

8 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

9 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

10 hours ago