Political News

కేసీఆర్‌కు మ‌రో అస్త్రాన్ని అందిస్తున్న మోడీ..వెరీ ఇంట్ర‌స్టింగ్‌..!

తెలంగాణలో ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగు మాసాల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ క్ర‌మంలో అధికార పార్టీ బీఆర్ ఎస్‌ను ఓడించి.. గ‌ద్దెనెక్కాల‌ని.. పాల‌న ప్రారంభించాల‌ని అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీలు కూడా వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నాయి. అయితే.. వీరిలో క‌ల‌యిక‌.. ఐక్య పోరాటాలు.. వంటివి ఎలా.. ఉన్నా.. కేసీఆర్‌కు ఉన్న వ్య‌తిరేక‌త‌, రెండు సార్లు పాలించార‌న్న వాద‌న‌.. వంటివి ఈ పార్టీల‌కు ద‌న్నుగా మారుతున్నాయనే చర్చ సాగుతోంది.

ఇదేస‌మ‌యంలో కేసీఆర్‌కు గ‌త ఎన్నిక‌ల్లో అంటే 2014లో తెలంగాణ‌ను తానే తెచ్చాన‌న్న సెంటిమెంటు ఉప‌యోగ‌ప‌డింది. ఇక‌, 2018లో టీడీపీ తెలంగాణ‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు అంటే.. 2023 న‌వంబ‌రు-డిసెంబ‌రు మ‌ధ్య జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఇప్ప‌టికైతే.. ఏదీ ఆయ‌న‌కు పెద్ద‌గా అందివ‌చ్చిన సెంటిమెంటు లేదు. దీంతో అభివృద్ధి తెలంగాణ అంటూ.. కొత్త పంథాను ఎంచుకున్నారు.

కానీ, ఇంత‌లోనే హ‌ఠాత్తుగా పెద్ద విష‌యం ఒక‌టి.. కేసీఆర్‌కు మేలు చేసేలా.. ఎన్నిక‌ల గోదాలో నుంచి కారును సునాయాశంగా బ‌య‌టకు వ‌చ్చేలా చేసే ఒక సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని కేంద్రంలోని మోడీ స‌ర్కారు ప్ర‌క‌టించారు. ఇది అలాంటి ఇలాంటి సెంటిమెంటు కాద‌నే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. విషయం ఏంటంటే.. ఉమ్మ‌డి ఏపీ విడిపోయాక‌.. కొన్నాళ్ల పాటు తెలంగాణ‌కు ఏపీ నుంచి విద్యుత్ స‌ర‌ఫ‌రా అయింది. దీనికి సంబందించి.. తెలంగాణ స‌ర్కారు ఏపీకి బిల్లు క‌ట్టాలి.

అయితే.. మొద‌ట్లో బాగానే క‌ట్టినా.. త‌ర్వాత క‌ట్ట‌డం మానేసింది. ఇది 6,720 కోట్ల రూపాయ‌ల‌కు చేరుకుం ది. ఈ సొమ్ము విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదం కోర్టుకు వెల్లింది. దీంతో ఈ విష‌యంపై కోర్టు స్టే విధించింది. కేంద్రాన్ని ప‌రిశీలించాల‌ని ఒక‌సారి.. రెండు తెలుగు రాష్ట్రాలు చ‌ర్చించుకుని ప‌రి ష్కరించుకోవాల‌ని మ‌రోసారి ఇలా.. తేల్చి చెప్పింది. ఇంత‌లో ఈ విష‌యాన్ని ప‌రిష్క‌రించేందుకు కేంద్రంలోని మోడీ స‌ర్కారు రంగంలోకి దిగింది.

తెలంగాణ ప్ర‌భుత్వానికి రిజ‌ర్వ్‌బ్యాంకులో ఉన్న నిధుల‌ను.. ఆ ప్ర‌భుత్వంతో సంప్ర‌దించ‌కుండానే (అంటే.. కేసీఆర్‌ను అడ‌గ‌కుండానే.. ఈ పాయింటే కీల‌కం) ఏపీకి నేరుగా ఇచ్చేసేందుకు మోడీ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఇదే విష‌యాన్ని పార్ల‌మెంటుకు కూడా చెప్పింది. సో.. ఇది చాల‌దా.. కేసీఆర్ త‌న‌ను తాను గెలిపించుకునేందుకు అంటున్నారు ప‌రిశీలకులు.

ఇప్పుడు కేసీఆర్ ఏమంట‌డంటే?..
“అదిగో మ‌న మీద క‌క్ష గ‌ట్టిన్రు.. మ‌నకు సొమ్ములు ఇవ్వ‌క పాయే.. ఆర్బీఐలో ఉన్న మ‌న సొమ్ముపైనా.. బీజేపీ పెద్ద‌లు పెత్త‌నం చేస్తున్రు. ఏపీకి మ‌నం సొమ్ములు ఇవ్వాలంట‌. స‌రే.. ఆ పంచాయ‌తీ ఏదో మేంమేం చూసుకోమా.. కానీ.. తెలంగాణ‌పై పెత్త‌నం చేసేందుకు గిప్పుడు బీజేపీ సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌న ఆత్మాభిమానాన్ని.. మ‌న ఆస్తుల‌ను మ‌న‌మే కాపాడుకోవాలి.. దీనికి మ‌నందరం న‌డుం బిగించాలి”- ఇంకేముంది.. సెంటిమెంటు ఓట్ల రూపంలో మారి.. బ్యాలెట్ బాక్సుల్లోకి చేర‌డం ఖాయం అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on August 4, 2023 12:06 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

2 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

4 hours ago