Buggana Rajender Reddy
ఏపీలోని జగన్ సర్కారు చేస్తున్న అప్పుల మీద పెద్ద ఎత్తున చర్చ జరగటంతో.. ప్రధాన ప్రతిపక్షం చేసే విమర్శలకు అప్పుల విషయంలో కొత్త క్లారిటీ ఇచ్చారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్. తాజా వివరణలో ఆయన గణాంకాలతో సహా ఏపీ అప్పులు జగన్ ప్రభుత్వంలో ఎలా తగ్గాయన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. ఏపీ అప్పుల మీద కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. కాగ్ చెప్పిన విషయాలన్ని వాస్తవాలే అన్న ఆయన.. జగన్ హయాంలో ఏపీ సంపద పెరిగి.. అప్పులు తగ్గినట్లుగా పేర్కొన్నారు. తన మాటకు గణాంకాలతో జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
రాష్ట్ర అప్పులు రూ.4.42 లక్షల కోట్లుగా కేంద్రం పేర్కొందని.. బడ్జెట్ బయట చూసినా.. లోపల చూసినా అప్పులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎక్కువని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో పరిమితికి మించి చేసిన రూ.16,418 కోట్ల అప్పుల కారణంగా ఆ మేరకు తమ ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చే అప్పులో కోత పడినట్లుగా పేర్కొన్నారు. తమకు అనుమతి ఉన్నా రూ.28,466 కోట్లు తక్కువగా అప్పులు చేసినట్లుగా పేర్కొన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో అప్పుల వార్షిక వ్రద్ధి రేటు 14.7 శాతమైతే.. తమ ప్రభుత్వంలో మాత్రం 12.4 శాతమేనని.. అప్పులు చేసినా డీబీటీ రూపంలో ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా చేరవేశామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఎటువైపు వెళ్లినట్లు? అని ప్రశ్నించిన బుగ్గన.. టీడీపీ అధికారంలో ఉండగా సంపద పెరగకపోయినా.. అప్పులు పెరిగినట్లుగా మండిపడ్డారు.
2014-15 నాటికి రాష్ట్ర అప్పులు రూ.1.22 లక్షల కోట్లు కాగా 2018-19 నాటికి రాష్ట్ర అప్పులు రూ.2.64 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. 2023 నాటికి రాష్ట్ర అప్పులు రూ.4.42 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో అప్పులు ఏడు శాతానికి పెరిగితే.. తమ ప్రభుత్వంలో మాత్రం మూడుశాతం మాత్రమే పెరిగినట్లుగా చెప్పారు. బుగ్గన వాదనకు టీడీపీ తమ్ముళ్లు కౌంటర్లు వెతుక్కుంటున్నారు.
This post was last modified on August 4, 2023 10:33 am
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…