Buggana Rajender Reddy
ఏపీలోని జగన్ సర్కారు చేస్తున్న అప్పుల మీద పెద్ద ఎత్తున చర్చ జరగటంతో.. ప్రధాన ప్రతిపక్షం చేసే విమర్శలకు అప్పుల విషయంలో కొత్త క్లారిటీ ఇచ్చారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్. తాజా వివరణలో ఆయన గణాంకాలతో సహా ఏపీ అప్పులు జగన్ ప్రభుత్వంలో ఎలా తగ్గాయన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. ఏపీ అప్పుల మీద కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. కాగ్ చెప్పిన విషయాలన్ని వాస్తవాలే అన్న ఆయన.. జగన్ హయాంలో ఏపీ సంపద పెరిగి.. అప్పులు తగ్గినట్లుగా పేర్కొన్నారు. తన మాటకు గణాంకాలతో జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
రాష్ట్ర అప్పులు రూ.4.42 లక్షల కోట్లుగా కేంద్రం పేర్కొందని.. బడ్జెట్ బయట చూసినా.. లోపల చూసినా అప్పులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎక్కువని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో పరిమితికి మించి చేసిన రూ.16,418 కోట్ల అప్పుల కారణంగా ఆ మేరకు తమ ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చే అప్పులో కోత పడినట్లుగా పేర్కొన్నారు. తమకు అనుమతి ఉన్నా రూ.28,466 కోట్లు తక్కువగా అప్పులు చేసినట్లుగా పేర్కొన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో అప్పుల వార్షిక వ్రద్ధి రేటు 14.7 శాతమైతే.. తమ ప్రభుత్వంలో మాత్రం 12.4 శాతమేనని.. అప్పులు చేసినా డీబీటీ రూపంలో ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా చేరవేశామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఎటువైపు వెళ్లినట్లు? అని ప్రశ్నించిన బుగ్గన.. టీడీపీ అధికారంలో ఉండగా సంపద పెరగకపోయినా.. అప్పులు పెరిగినట్లుగా మండిపడ్డారు.
2014-15 నాటికి రాష్ట్ర అప్పులు రూ.1.22 లక్షల కోట్లు కాగా 2018-19 నాటికి రాష్ట్ర అప్పులు రూ.2.64 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. 2023 నాటికి రాష్ట్ర అప్పులు రూ.4.42 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో అప్పులు ఏడు శాతానికి పెరిగితే.. తమ ప్రభుత్వంలో మాత్రం మూడుశాతం మాత్రమే పెరిగినట్లుగా చెప్పారు. బుగ్గన వాదనకు టీడీపీ తమ్ముళ్లు కౌంటర్లు వెతుక్కుంటున్నారు.
This post was last modified on August 4, 2023 10:33 am
హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో స్పూఫ్ హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత అదే…
వైసీపీ అధినేత జగన్ అరెస్టు ఎంతో దూరంలో లేదా? ఈ ఏడాదే ఆయనను అరెస్టు చేయొచ్చా.? అది తప్పితే.. ఆయన…
నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…
తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…