Political News

ఏపీ అప్పుల తగ్గాయి.. బుగ్గన !!

ఏపీలోని జగన్ సర్కారు చేస్తున్న అప్పుల మీద పెద్ద ఎత్తున చర్చ జరగటంతో.. ప్రధాన ప్రతిపక్షం చేసే విమర్శలకు అప్పుల విషయంలో కొత్త క్లారిటీ ఇచ్చారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్. తాజా వివరణలో ఆయన గణాంకాలతో సహా ఏపీ అప్పులు జగన్ ప్రభుత్వంలో ఎలా తగ్గాయన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. ఏపీ అప్పుల మీద కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. కాగ్ చెప్పిన విషయాలన్ని వాస్తవాలే అన్న ఆయన.. జగన్ హయాంలో ఏపీ సంపద పెరిగి.. అప్పులు తగ్గినట్లుగా పేర్కొన్నారు. తన మాటకు గణాంకాలతో జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

రాష్ట్ర అప్పులు రూ.4.42 లక్షల కోట్లుగా కేంద్రం పేర్కొందని.. బడ్జెట్ బయట చూసినా.. లోపల చూసినా అప్పులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎక్కువని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో పరిమితికి మించి చేసిన రూ.16,418 కోట్ల అప్పుల కారణంగా ఆ మేరకు తమ ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చే అప్పులో కోత పడినట్లుగా పేర్కొన్నారు. తమకు అనుమతి ఉన్నా రూ.28,466 కోట్లు తక్కువగా అప్పులు చేసినట్లుగా పేర్కొన్నారు.

చంద్రబాబు ప్రభుత్వంలో అప్పుల వార్షిక వ్రద్ధి రేటు 14.7 శాతమైతే.. తమ ప్రభుత్వంలో మాత్రం 12.4 శాతమేనని.. అప్పులు చేసినా డీబీటీ రూపంలో ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా చేరవేశామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఎటువైపు వెళ్లినట్లు? అని ప్రశ్నించిన బుగ్గన.. టీడీపీ అధికారంలో ఉండగా సంపద పెరగకపోయినా.. అప్పులు పెరిగినట్లుగా మండిపడ్డారు.

2014-15 నాటికి రాష్ట్ర అప్పులు రూ.1.22 లక్షల కోట్లు కాగా 2018-19 నాటికి రాష్ట్ర అప్పులు రూ.2.64 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. 2023 నాటికి రాష్ట్ర అప్పులు రూ.4.42 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో అప్పులు ఏడు శాతానికి పెరిగితే.. తమ ప్రభుత్వంలో మాత్రం మూడుశాతం మాత్రమే పెరిగినట్లుగా చెప్పారు. బుగ్గన వాదనకు టీడీపీ తమ్ముళ్లు కౌంటర్లు వెతుక్కుంటున్నారు.

Satya

Recent Posts

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

24 minutes ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

3 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

9 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

11 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

11 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

12 hours ago