కేసీయార్లో భయం మొదలైనట్లే ఉంది. లేకపోతే సంవత్సరాల తరబడి పట్టించుకోని రైతు రుణమాఫీ హామీని అమలు చేయాలని ఉన్నతాధికారులను సడన్ గా ఆదేశించటం ఏమిటి ? నాలుగేళ్ళ నుండి పట్టించుకోని రుణమాఫీని ఇపుడు స్పీడుగా అమలు చేయాలని కేసీయార్ ఆదేశించారు. దశలవారీగా రు. 17 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేయాలని ఆదేశించారు. అది కూడా వచ్చేనెల 2వ వారానికల్లా రుణమాఫీ అమలైపోవాలని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఆరు నూరైనా రైతు సంక్షేమమే తనకు టాప్ ప్రయారిటి అంటున్నారు కేసీయార్.
ఇంతలోనే ఇంత మార్పు ఎందుకు వచ్చింది ? ఎందుకంటే మూడు కారణాలున్నాయి. మొదటిదేమో రాబోయే ఎన్నికల్లో రైతుల ఓట్లు వేయించుకోవటం. రెండో కారణం ఏమిటంటే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకోవాల్సి రావటం. ఇక మూడో కారణం ఏమిటంటే ఇప్పటికే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు రైతు వ్యతిరేకి ముద్ర వేసేయటం. కేసీయార్ హామీని అమలుచేయకపోవటంతో రైతాంగం బాగా మండిపోతున్నారు. రుణమాఫీ అవక, బ్యాంకులు కొత్త అప్పులు ఇవ్వకపోవటంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
రుణమాఫీ చేయాలంటే రు. 27 వేల కోట్లు అవసరమని 2018లోనే ప్రభుత్వం లెక్కలు గట్టింది. నాలుగేళ్ళల్లో విడతలవారీగా చెల్లిస్తామని అసెంబ్లీలో ప్రకటించిన కేసీయార్ తర్వాత పట్టించుకోలేదు. మొత్తం మీద ఇప్పటివరకు సుమారు రు. 1207 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రతి ఏడాది బడ్జెట్లో కేటాయింపులు చూపుతున్నారు కానీ వాస్తవంగా నిధులు నిధులు మంజూరు చేయటం లేదు. దాంతో రుణమాఫీ పథకం అటకెక్కిందనే అనుకున్నారు.
అయితే రాబోయే ఎన్నికల్లో రైతుల ఓట్లు, ప్రతిపక్షాల ఒత్తిళ్ళు, అసెంబ్లీ సమావేశాలు అన్నీ కలిపి కేసీయార్లో భయం పెంచేశాయి. అందుకనే సడెన్ గా రుణమాఫీకి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఇపుడు రు. 19 వేల కోట్లు మాఫీ చేస్తారు బాగానే ఉంది మరి మిగిలిన సుమారు రు. 6 వేల కోట్ల మాఫీ ఎప్పడున్నదే ప్రశ్నగా మిగిలిపోయింది. కేసీఆర్ వైఖరి చూస్తుంటే ఎలాగుందంటే ఏదైనా తప్పని పరిస్ధితులు ఎదురైనపుడు మాత్రమే ఇచ్చిన హామీలను అమలుచేస్తారని అర్ధమవుతోంది. లేకపోతే హామీలన్నీ గాలికే.
This post was last modified on August 4, 2023 12:31 am
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…
దేశంలో అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయాల వరకు ఎంతో గొప్ప పాత్ర…
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…