Political News

స్పీకరే అలిగారా ? వాకౌట్ చేశారా ?

పార్లమెంటు సమావేశాల్లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అదేమిటంటే సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ ఓంబిర్లా అలిగారు. సభలో సభ్యుల ప్రవర్తన పై కోపం వచ్చి కుర్చీలో నుంచి లేచి వెళ్ళిపోయారు. అంటే ఒక విధంగా స్పీకర్ లోక్ సభ నుంచి వాకౌట్ చేశారనే అనుకోవాలి. ఇంతకీ స్పీకర్ కు అంత కోపం రావటానికి కారణం ఏమిటి ? ఏమిటంటే సభలో సభ్యులు ఎవరు తన మాటను వినటం లేదు, పట్టించుకోవటంలేదట. ఎందుకంటే మణిపూర్ ఘటనలపై చర్చ విషయంలో ఇటు అధికార అటు ఇండియా కూటమి, ప్రతిపక్షాల సభ్యుల మధ్య గొడవలు అవుతుందటమే.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైన దగ్గర నుండి మణిపూర్ అల్లర్లపై చర్చకు ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. మణిపూర్లో ఘటనలు ప్రపంచంలోనే దేశం పరువును తీసేశాయి కాబట్టి ఆ ఘటనలపై దీర్ఘకాలిక చర్చలు జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే మణిపూర్ అల్లర్లపై దీర్ఘకాలిక చర్చలు అవసరం లేదని, స్వల్పకాలిక చర్చలు సరిపోతుందని ఎన్డీయే పదేపదే అంటోంది. ఇదే విషయమై ఇరువైపులా మధ్యేమార్గం సాధ్యం కాకపోవటంతో గొడవలు ఎంతకూ తేలటంలేదు.

ప్రతిపక్షాల డిమాండ్ ప్రకారం సుదీర్ఘ చర్చకు అనుమతిస్తే ప్రభుత్వం పరువు పోవటం ఖాయం. పార్లమెంటు వేదికగా ప్రతిపక్షాల దెబ్బకు నరేంద్రమోడీ పరువు పోతుంది. ఎందుకంటే పార్లమెంటులో చర్చలు జరిపేందుకు సమాధానం చెప్పేందుకు మోడీ వెనకాడుతున్నారు. అందుకనే ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదనే దీర్ఘకాలిక చర్చకు అధికారపార్టీ అనుమతించటంలేదు.

ఇదే విషయమై ప్రతిరోజు సభలో గొడవలవుతున్నాయి. ఈ విషయంలో స్పీకర్ సర్ది చెప్పాలని ఎంత ప్రయత్నించినా ఎవరు వినటం లేదు. తన మాట విననపుడు ఇక తాను స్పీకర్ గా ఉండి ఉపయోగం ఏమిటని ఓంబిర్లాకు మండిపోయింది. అందుకనే సభ్యులపై కోపంతోను, అలకతోను సభనుండి వెళ్ళిపోయారు. సభ్యుల్లో మార్పు వచ్చేంతవరకు తాను సభలోకి అడుగుపెట్టేది లేదని తెగేసి చెప్పారు. సభ నడిచే విషయంలో ముందు అధికారపక్షమే ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సుంటందని ఏళ్ళపాటు రాజకీయాల్లో ఉన్న బిర్లాకు తెలీదా ? మణిపూర్లో అల్లర్లపై చర్చించటానికన్నా మించిన ప్రధాన్యతా అంశం ఏముంది ?

This post was last modified on August 3, 2023 11:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago