Political News

పులివెందులలో అమరావతి నినాదాలు

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఏపీలో త‌మ‌కు తిరుగులేద‌ని.. రాష్ట్ర ప్ర‌జ‌ల చ‌ల్ల‌ని దీవెన‌లు త‌మ‌కే ఉన్నాయ‌ని వైసీపీ నాయకులు , అధిష్టానం కూడా ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌రిస్థితి ఎలా ఉన్నా.. తాజాగా ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో చోటు చేసుకున్న ప‌రిణామంపై మాత్రం రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం నివ్వెర పోతున్నారు. దీనిపై వైసీపీ నాయ‌కులు కూడా ఫోక‌స్ పెంచారు. ఈ నేప‌థ్యంలో నిజంగానే ఈ విష‌యాన్ని వైసీపీ సీరియ‌స్‌గా తీసుకోవాల్సిందే..అనే టాక్ వినిపిస్తోంది.

ఏం జ‌రిగింది?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. సీమ డిక్ల‌రేష‌న్ పేరుతో సీమ జిల్లాల్లో ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు నిర్వ‌హించే ఈ ప‌ర్య‌ట‌న‌ను ఆయ‌న క‌ర్నూలు నుంచి ప్రారంభించారు. ఇక‌, బుధ‌వారం చంద్ర‌బాబు సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా, సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌నే టార్గెట్ చేసుకున్నారు. ఇక్క‌డ కూడా రోడ్ షో నిర్వ‌హించారు. అదేస‌మ‌యంలో స‌భ‌ను కూడా ఏర్పాటు చేశారు. కీల‌క‌మైన పూల అంగ‌ళ్ల జంక్ష‌న్‌(ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో సీఎం జ‌గ‌న్‌కే మొత్తం ఓట్లు ప‌డ్డాయ‌ని ఎన్నిక‌ల సంఘం తెలిపింది.. ఇక్క‌డ 4 వేల ఓట్లు ఉన్నాయి) స‌హా నాలుగు రోడ్ల‌కూడ‌లిలో చంద్ర‌బాబు ప‌ర్య‌టించారు.

మ‌న‌కు రాజ‌ధాని ఏది.. అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించ‌గా.. అంద‌రూ.. గుండుగుత్త‌గా అమ‌రావ‌తి-అమ‌రావ‌తి అంటూ.. నినాదాల‌తో హోరెత్తించారు. మూడు రాజ‌ధానులు అవ‌స‌రమా? అని ప్ర‌శ్నించ‌గా.. లేదు-లేదు.. అంటూ.. చంద్ర‌బాబుకు స‌మాధానం చెప్పారు. అంతేకాదు.. మ‌ద్యం పై బాదుడు.. వైన్ షాపుల్లో ఫోన్ పే లేక‌పోవ‌డం వంటివాటిని చంద్ర‌బాబు ప్ర‌శ్నిస్తూ.. ఈ సొమ్ము ఎక్క‌డికి పోతోంద‌ని ప్ర‌శ్నించారు. దీనికి చాలా ఆశ్చ‌ర్య‌కరంగా.. అధికార పార్టీ నేత‌ల‌కే.. అంటూ ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున నిన‌దించ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాలో పులివెందుల‌లో ఏదో మార్పు చోటు చేసుకుంటోంద‌నే చ‌ర్చ తెర‌మీద‌కి వ‌చ్చింది. దీంతో వైసీపీ కూడా దీనిపై సీరియ‌స్‌గానే చ‌ర్చించాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వాస్త‌వానికి సీఎం జ‌గ‌న్ స‌హా వైఎస్ కుటుంబానికి పెట్ట‌ని కోట వంటి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్షాల‌కు ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌న్న‌ది ఒట్టిమాటే.. అనే టాక్ వినిపిస్తుంటుంది. కానీ.. తాజాగా చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఎక్క‌డి నుంచో రాలేదు.. నియోజ‌క‌వ‌ర్గం నుంచే వ‌చ్చిన ప్ర‌జ‌ల‌తో ఇక్క‌డి కూడ‌ళ్లు కిక్కిరిసిపోయాయి. స‌రే.. నాయ‌కులు త‌ర‌లించార‌నే అనుకున్నా.. చంద్ర‌బాబు చేసిన ప్ర‌సంగానికి ప్ర‌జ‌లు ఈల‌లు.. చ‌ప్ప‌ట్ల‌తో హుషారెత్తిపోయారు. అంతేకాదు.. కీల‌క‌మైన మూడు విష‌యాల‌పై ప్ర‌జ‌లు చంద్ర‌బాబు ద‌న్నుగా స్లోగ‌న్లు చేశారు.

Satya

Recent Posts

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

21 minutes ago

తెలంగాణ పాలిటిక్స్‌: ప‌వ‌న్ భ‌య‌మా… ఓట్ల భ‌య‌మా?

తెలంగాణ రాజ‌కీయాలు వ్యూహాత్మ‌క మ‌లుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్‌, టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఒక్క‌సారిగా జ‌న‌సేన పార్టీపై…

27 minutes ago

సీఎం అయినా విజయ్ లో తృప్తి లేదే!

మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…

3 hours ago

విగ్రహాల ధ్వంసం… జగన్ పై జీవి ఆంజనేయులు ఆరోపణలు

ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…

3 hours ago

పవన్ సభకు తెలంగాణ పోలీసుల ‘నో’

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…

4 hours ago

రాజమౌళి లక్ష్యం… సినీ ప్రియుల స్వప్మం

తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…

6 hours ago