టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన బ్రో చిత్రంపై ఏపీలో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మంత్రి అంబటి రాంబాబును అనుకరిస్తూ శ్యాంబాబు క్యారెక్టర్ పెట్టారని రచ్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే పవన్, త్రివిక్రమ్, ఆ చిత్ర నిర్మాత విశ్వ ప్రసాద్ పై అంబటి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాదు, ఆ చిత్రాన్ని నిర్మాణం కోసం అమెరికా నుంచి ఫండ్స్ ను ఇండియాకు తరలించారని, బ్లాక్ మనీని వైట్ గా మార్చి పవన్ కు ప్యాకేజీలా చంద్రబాబు ఇచ్చారని ఆరోపించారు.
ఆ నిధుల వ్యవహారంపై ఈడీని, సీబీఐని ఆశ్రయిస్తానని కూడా చెప్పారు. ఏదో ఫ్లోలో అంబటి అలా అన్నారని అంతా అనుకున్నారు. కానీ, ఆ వ్యవహారంపై నిర్మాత క్లారిటీనిచ్చినా…అంబటి మాత్రం తగ్గడం లేదు. ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అంబటి చెప్పారు. ఒక కీలకమైన విషయం కోసం తాను ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నానని చెప్పారు. ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత అన్ని వివరాలను మీడియాకు వెల్లడిస్తానని అన్నారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్, నిధులకు సంబంధించి నిర్మాత వెర్షన్, తన వెర్షన్ అందరికీ తెలుసని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే అంబటిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోండగా…చంద్రబాబు, పవన్ లపై విమర్శలు వస్తున్నాయి. పోలవరం సహా ఏ ప్రాజెక్టుకు నిధులు కావాలని ఢిల్లీ గడప తొక్కని అంబటి…బ్రో అంటూ పనికిమాలిన విషయంపై ఢిల్లీ వెళ్తున్నారని నెటిజన్లు దుయ్యబడుతున్నారు. ఇక, రాయలసీమలో చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన వ్యవహారంతో వైసీపీకి, నీటిపారుదల శాఖా మంత్రి అంబటికి భారీ డ్యామేజీ జరిగిందని, అందుకే ఆ టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు బ్రో పంచాయతీని అంబటి పెట్టారని అంటున్నారు. అంబటి ట్రాప్ లో చంద్రబాబు, పవన్ పడ్డారని కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on August 2, 2023 9:34 pm
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…