‘సింహంలా బతుకుతా.. శాశ్వతంగా సింహంలా ఉంటా’.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో పర్యటిస్తున్న చంద్రబాబు తాజాగా నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా నందికొట్కూరు సెంటర్లో ఆయన వాహనంపై నుంచి మాట్లాడుతూ.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఎవరూ వేలు పెట్టి చూపించే పరిస్థితి లేదని.. తనపై ఎవరూ కేసులు పెట్టే పరిస్థితి కూడా లేదని చెప్పారు. తాను తన వ్యక్తిగత జీవితంలోను.. ప్రజాజీవితంలోనూ ఎంతో నిబద్ధతతో జీవిస్తున్నానని చెప్పారు.
అందుకే తాను సింహంలా బతుకుతా.. శాశ్వతంగా సింహంలా ఉంటా! అని వ్యాఖ్యానించారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మరో ఆరుమాసాలే ఉందని.. ఈ మాసాల పాటు కొన్ని కష్టాలు భరించాల్సిందేనని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కరెంటు ఉత్పత్తిలో నూతన విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతానన్నారు. ప్రజలకు ప్రాణసంకటంగా ఉన్న కరెంటు చార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చిందని చంద్రబాబు చెప్పారు. యువత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఏ ఊరికి వెళ్లినా జాబ్ కావాలంటే బాబు రావాలని యువత అంటున్నారని.. ఈ నినాదం మరింత ఉవ్వెత్తున సాగాలని ఆయన పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి రాగానే 2 లక్షల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆరు నెలలు కస్టపడితే మీ జీవితాల్ని బాగు చేస్తానన్నారు. ఏడాదికి 20 వేలను రైతుల ఖాతాల్లో జమ చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.
“సైకో ముఖ్యమంత్రి జగన్ నా వయసు గురించి, క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. నేను నాజీవితంలో సింహంలా బతుకుతా.. శాశ్వతంగా సింహంలా ఉంటా” అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. “రోజుకు 18 గంటలు పని చేస్తా. ముందు ఇరవై ఏళ్లకు కావాల్సిన వాటిపై ఆలోచిస్తా. సీఎం జగన్ రోజుకు ఒక గంటైనా పని చేస్తున్నాడా?” అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంట్లో చదువుకునే పిల్లలందరికీ అమ్మ ఒడి ఇస్తామన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తానని, 2019లో సైకో జగన్ రాక పోయింటే ఏపీ, తెలంగాణకు సమానంగా అభివృద్ధి చెందేదని తేల్చి చెప్పారు.
వైసీపీ కరప్షన్ పార్టీ!
వాటర్ ట్యాంక్లలో బాంబులు పెట్టుకునే వైసీపీ నేతలు నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నారని, వైసీపీ అంటే కరప్షన్ పార్టీగా అభివర్ణించారు. నీటి ఆవశ్యకత కోసం తాను చేపట్టిన ప్రాజెక్టుల యుద్ధం గురించి అందరికీ చెప్పాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
This post was last modified on August 1, 2023 10:15 pm
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…