Political News

కొత్త స్టైల్లో బాబు ప్రసంగం… సింహంలా బతుకుతా !

‘సింహంలా బతుకుతా.. శాశ్వతంగా సింహంలా ఉంటా’.. అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు తాజాగా నందికొట్కూరు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ షో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నందికొట్కూరు సెంట‌ర్‌లో ఆయ‌న వాహ‌నంపై నుంచి మాట్లాడుతూ.. కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను ఎవ‌రూ వేలు పెట్టి చూపించే ప‌రిస్థితి లేద‌ని.. త‌నపై ఎవ‌రూ కేసులు పెట్టే ప‌రిస్థితి కూడా లేద‌ని చెప్పారు. తాను త‌న వ్య‌క్తిగ‌త జీవితంలోను.. ప్ర‌జాజీవితంలోనూ ఎంతో నిబ‌ద్ధ‌త‌తో జీవిస్తున్నాన‌ని చెప్పారు.

అందుకే తాను సింహంలా బతుకుతా.. శాశ్వతంగా సింహంలా ఉంటా! అని వ్యాఖ్యానించారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు మ‌రో ఆరుమాసాలే ఉంద‌ని.. ఈ మాసాల పాటు కొన్ని క‌ష్టాలు భ‌రించాల్సిందేన‌ని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కరెంటు ఉత్పత్తిలో నూతన విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని అగ్ర‌గామిగా నిల‌బెడ‌తాన‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ప్రాణ‌సంక‌టంగా ఉన్న‌ కరెంటు చార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. యువగళం పాద‌యాత్ర‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింద‌ని చంద్ర‌బాబు చెప్పారు. యువ‌త పెద్ద సంఖ్య‌లో రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

ఏ ఊరికి వెళ్లినా జాబ్ కావాలంటే బాబు రావాలని యువత అంటున్నారని.. ఈ నినాదం మ‌రింత ఉవ్వెత్తున సాగాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి రాగానే 2 ల‌క్ష‌ల పైచిలుకు ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. ఆరు నెలలు కస్టపడితే మీ జీవితాల్ని బాగు చేస్తానన్నారు. ఏడాదికి 20 వేలను రైతుల ఖాతాల్లో జమ చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.

“సైకో ముఖ్యమంత్రి జగన్ నా వయసు గురించి, క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. నేను నాజీవితంలో సింహంలా బతుకుతా.. శాశ్వతంగా సింహంలా ఉంటా” అని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. “రోజుకు 18 గంటలు పని చేస్తా. ముందు ఇరవై ఏళ్లకు కావాల్సిన వాటిపై ఆలోచిస్తా. సీఎం జగన్ రోజుకు ఒక గంటైనా పని చేస్తున్నాడా?” అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంట్లో చదువుకునే పిల్లలందరికీ అమ్మ ఒడి ఇస్తామన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తానని, 2019లో సైకో జగన్ రాక పోయింటే ఏపీ, తెలంగాణకు సమానంగా అభివృద్ధి చెందేదని తేల్చి చెప్పారు.

వైసీపీ క‌ర‌ప్ష‌న్ పార్టీ!

వాటర్ ట్యాంక్‌లలో బాంబులు పెట్టుకునే వైసీపీ నేతలు నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నారని, వైసీపీ అంటే కరప్షన్ పార్టీగా అభివర్ణించారు. నీటి ఆవశ్యకత కోసం తాను చేపట్టిన ప్రాజెక్టుల యుద్ధం గురించి అందరికీ చెప్పాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

This post was last modified on August 1, 2023 10:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మహిళా కమిషన్ నుండి ఎమ్మెల్యే టికెట్ వైపు?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ ప‌ర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…

45 minutes ago

సునీల్ వ‌ర్సెస్ RRR.. మ‌రింత ముదిరిందిగా!

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న్‌లో ఉన్న సునీల్‌కు రఘురామకు…

4 hours ago

`న‌వ` నాయ‌కులు… టీడీపీకి ప్ల‌స్సా-మైన‌స్సా.. !

టీడీపీలో నాయ‌కులు.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నారా?  ఆయ‌న చెప్పిన‌ట్టే చేస్తున్నారా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…

7 hours ago

చ‌క్క‌ని అవ‌కాశం చేజార్చుకున్న వైసీపీ!

అవ‌కాశాలు.. అదృష్టాలు.. ప‌దే ప‌దే రావ‌ని అంటారు. అవి వ‌చ్చిన‌ప్పుడు వాటిని స‌ద్వినియోగం చేసుకునేందుకు వ్య‌క్తులైనా పార్టీలైనా.. ఎవ‌రైనా స‌రే..…

10 hours ago

ఈసారి కష్టపడి ఓడిన చెన్నై… పంజాబ్ పవర్ఫుల్ గేమ్

ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…

11 hours ago

విజ‌య్‌ని డీగ్రేడ్ చేసేలా పొలిటిక‌ల్ మూవీ?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నపుడు కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎలివేష‌న్లు ఇస్తూ సినిమాలు వ‌స్తుంటాయి. అలాగే కొంద‌రు నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ మూవీస్…

11 hours ago