ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో కేసీయార్ లో టెన్షన్ పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే అప్పుడెప్పుడో ఇఛ్చిన రైతు రుణమాఫీ ఇంకా మాపీ కాకపోవటమే. రైతు రుణమాఫీ సంపూర్ణం కాకుండా మళ్ళీ ఎన్నికలకు వెళితే ఫలితం ఎలాగుంటుందో కేసీయార్ కు అర్ధంకావటంలేదు. 2018 ఎన్నికల తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతు నాలుగు విడతల్లో రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. సంపూర్ణంగా రైతు రుణమాఫీ అవ్వాలంటే రు. 27,835 కోట్లు అవసరమవుతుందని లెక్కలు వేశారు.
ఇప్పటికి రెండు విడుతల్లో రుణమాఫీ చేసింది రు. 1207 కోట్లు మాత్రమే. మొన్నటి బడ్జెట్లో రుణమాఫీకి ప్రభుత్వం కాగితాల మీద చూపించింది రు. 6,385 కోట్లు. కానీ బడ్జెట్ ఆర్డర్ రిలీజ్ ఇచ్చింది రు. 3369 కోట్లకు మాత్రమే. ఎందుకిలా అంటే కాగితాల మీద ఎంతైనా కేటాయింపులు చూపిస్తారు. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి నిధులను విడుదల చేయాలి కదా. సరిపడా నిధులు ఉంటేనే కదా రిలీజ్ చేయటానికి. చేతిలో నిధులు లేకుండా రైతులను మోసం చేయటమే టార్గెట్ గా నోటికొచ్చిన హామీలిచ్చేస్తే పరిస్ధితి ఇలాగే ఉంటుంది.
చేయాల్సిన రుణమాఫీ సుమారు. 27 వేల కోట్లయితే ఇప్పటికి చేసింది రు. 1207 కోట్లు మాత్రమే. అంటే చేయాల్సిన రుణమాఫీ సుమారు 25 వేల కోట్ల చిల్లరుంది. షెడ్యూల్ ఎన్నికలకు ఇంక ఉన్న సమయం నాలుగు నెలలు మాత్రమే. ఈ నాలుగు నెలల్లో ఏమవుతుంది ? నాలుగున్నరేళ్ళక్రితం ఇచ్చిన హామీని మరో నాలుగు నెలల్లో ఎలా నెరవేర్చగలదు ప్రభుత్వం. ఆ నిధుల సమీకరణ కోసమే ప్రభుత్వ భూములను వేలంపాటల్లో అమ్మేస్తున్నారు కేసీయార్.
భూములమ్మగా వచ్చిన డబ్బులతో కాళేశ్వరం అప్పులు+వడ్డీలే తీరుస్తారా ? లేకపోతే రైతు రుణమాఫీ చేస్తారా ? అదీలేకపోతే దళితబంధు, బీసీ బంధు, మైనారిటీలకు లక్ష రూపాయల రుణాలకే ఖర్చు పెడతారా ? ఇచ్చిన హామీలు కొండంత అయితే ఖజానాలో ఉన్నది చిల్లిగవ్వంత. అందుకనే రాబోయే ఎన్నికల్లో రైతులు ఎలా రియాక్టవుతారో కేసీయార్ అంచనా వేయలేకపోతున్నారు. తప్పుడు హామీలివ్వటం ఎందుకు అనవసరంగా ఇరుక్కోవటం ఎందుకు ?
This post was last modified on August 1, 2023 10:18 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…