ఏపీలో రాజకీయ సినిమాలు రెడీ అవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను మలుపు తిప్పేలా.. రాజకీయ పార్టీల విషయంలో ప్రజలను కీలకమైన దిశకు నడిపించేలా ఆలోచనాత్మకంగా ఈ సినిమాలు రూపుదిద్దు కుంటున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఒకవైపు అధికార పార్టీ వైసీపీ నేరుగా.. సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మను దత్తత తీసుకుందని టాలీవుడ్ టాక్. ఈయన కూడా .. సొంతగా యూట్యూబ్ చానెల్ స్థాపించి తరచుగా.. వాటిలో వీడియోలు పోస్టు చేస్తున్నారు.
ఇదేసమయంలో వచ్చే ఎన్నికలను ప్రభావితం చేసేలా.. సంక్షేమ కార్యక్రమాలు.. ప్రత్యర్థి పార్టీల దూకు డును విమర్శనాత్మకంగా చూపించేందుకు వర్మ రెడీ అయ్యారని తెలిసిందే. ఇదిపైకి కనిపిస్తున్న విష యం. ఇక, మరో ఇద్దరు చోటా దర్శకులు కూడా.. వైసీపీ తరఫున సినిమాలు చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వర్మ.. రాజకీయ ప్రత్యర్థులు.. దూకుడు వంటి కోణంలో సినిమాలు తీస్తున్నారు. ఇక, చోటా దర్శకులు సింపతీ.. ప్రజాపాలన, పథకాలు అనే కోణంలో ప్రజల మనసు కరిగించే స్క్రిప్టుతో సినిమాలు రూపొందిస్తున్నారని తెలిసింది.
ఇక, టీడీపీ విషయానికి వస్తే.. నేరుగా ఈ పార్టీ ఫండింగు లేదు. నేరుగా జోక్యం కూడా లేదు. అయినప్పటి కీ.. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య తీస్తున్న సినిమాలోనూ.. ఒకరిద్దరు టీడీపీకి అనుకూలంగా ఉన్న దర్శకులు తీస్తున్న సినిమాల్లోనూ టీడీపీని ప్రొజెక్టు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక, జనసేన అధినేత పవన్ కూడా నేరుగానే వైసీపీపై దాడి కాన్సెప్టును అంతర్లీనంగా చేరుస్తూ.. సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక నారా రోహిత్ లాంగ్ గ్యాప్ తర్వాత పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిథి 2 సినిమా చేస్తున్నాడు. టీవీ 5 మూర్తి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే సమ్మర్ రిలీజ్ చేస్తున్నట్టు డేట్ కూడా ప్రకటించారు. సో.. ఈ రాజకీయ సినిమాలన్నీ కూడా.. వచ్చే 2024 మార్చిలోపు తెరమీదికి వచ్చేస్తాయని అంటున్నారు. ఎందుకంటే.. అంతకు మించితే.. ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారే అవకాశం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారట. ఇదీ.. ఇప్పుడు పార్టీల్లో హాట్ టాపిక్.
This post was last modified on July 31, 2023 10:39 pm
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…