ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా కీలక పరిణాలు చోటు చేసుకుంటున్నాయి. డైలాగ్ కింగ్ మంచు మోహన్బాబు చిన్నకుమారుడు, తెలుగు సినీ హీరో మంచు మనోజ్.. ఆయన సతీమణి భూమా మౌనికారెడ్డిలు త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకుంటారనే చర్చ జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా అయిపోయిందని.. చంద్రబాబు అప్పా యింట్మెంటు కోసం వేచి చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మంచు మనోజ్.. కొన్నాళ్ల కిందట టీడీపీకే చెందిన కర్నూలు నాయకుడు, దివంగత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రాజకీయంగా పలుకుబడి.. టీడీపీలో మంచి ఫాంలో ఉన్న నేపథ్యంలోవచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వెలుగు చూశాయి. ఈ వార్తలను విశ్లేషణలను కూడా ఎవరూ ఖండించకపోవడం గమనార్హం. మరోవైపు.. ఇప్పటికే ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి, మౌనిక అక్క అఖిల ప్రియ పోటీలో ఉన్నారు. గతంలో 2014లో జరిగిన ఎన్నికల్లో ఆమె గెలిచి మంత్రి అయ్యారు(తల్లి శోభ ఆకస్మిక మరణంతో). గత ఏడాది మాత్రం ఓడిపోయారు. ఇక, ఆ తర్వాత నంద్యాల నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి కూడా .. ఆకస్మిక గుండెపోటుతో మరణించారు.
దీంతో 2017లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ కుటుంబానికే చెందిన భూమా బ్రహ్మానందరెడ్డి విజయం దక్కించుకున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో నంద్యాల టికెట్ను భూమా వారసుడికి కేటాయించాలనే ప్రయత్నం జరుగుతున్నా పోటీ తీవ్రత నేపథ్యంతో పాటు.. సినీగ్లామర్ పరంగానూ.. మంచు మౌనికకు ఇస్తే.. సునాయాశంగా గెలుస్తామనే భావన టీడీపీలో కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఈ టికెట్ కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు.. వైసీపీ అంటీముట్టనట్టుగా ఉంటున్న మంచు మోహన్బాబు కూడా.. తన కుమారుల ఇష్టానికే రాజకీయాలను వదిలేశారు.
ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కూడా వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నట్టు మంచు కుటుంబం కూడా లీకులు ఇస్తోంది. నా కుమారులకు రాజకీయాలపై ఆసక్తి ఉంది అంటూ ఇటీవల మోహన్ బాబు కూడా వ్యాఖ్యానించారు. అయితే..ఇప్పటికే మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో మనోజ్.. టీడీపీలో చేరి.. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఉంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది తిరుపతి వారి సొంత ఊరు కావడం.. ఇక్కడ మంచు కుటుంబానికి విద్యా వ్యాపారం ఉండడంతో ఈ నియోజకవర్గం అయితే సేఫ్గా ఉంటుందని తలపోస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు దాదాపు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని విశ్వసనీయవర్గాలు చెబుతుండం గమనార్హం.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…
రెగ్యులర్ గా టాలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు మ్యాజిక్ అంటే వెంటనే గుర్తొచ్చే కాంబినేషన్ గౌతమ్ తిన్ననూరి - అనిరుద్…
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…