గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడికి రాజధాని అమరావతి రైతుల నుంచి సెగతగిలింది. తానురాజకీయాల్లోకి వస్తున్నానని.. త్వరలోనే దీనిపై నిర్ణయంతీసుకుంటానని ఆదిలో చెప్పిన ఆయన ఈ క్రమంలో పలు గ్రామాల్లోనూ పర్యటించారు. ఈ క్రమంలో వైసీపీ పాలనపై ఆయన ప్రశంసలు కూడా కురిపించారు. అనంతరం.. ఎందుకో.. తాను ఇప్పట్లో రాజకీయాల్లోకిరావడం లేదని కూడా చెప్పారు. ఇక, ఆయన పరిస్థితి రాజకీయంగా ఎలా ఉన్నా.. తాజాగా ఆయన అమరావతి ప్రాంతంలో పర్యటనకు వచ్చారు.
తుళ్లూరు మండలం వెలగపూడికి వచ్చిన రాయుడు.. స్థానిక వీరభద్ర స్వామి ఆలయంలో కుటుంబంతో సహా పూజలు చేశారు. ఈ సందర్భంగా రాజధాని కోసం వేలాది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న రాజధాని రైతులు కూడా అక్కడకు చేరుకున్నారు. అంబటి రాయుడు పూజలు పూర్తయ్యే వరకు వారు అక్కడే వేచి ఉన్నారు. అనంతరం.. ఆయనను తమ శిబిరానికి రావాలని రైతులు ఆహ్వానించారు. దీక్షా శిబిరంలోకి వచ్చి తమ సమస్యలు వినాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా పలువురు రైతులు.. తాము రాజధాని కోసం ఇచ్చిన భూములు, ప్రస్తుత ప్రభుత్వం తమపై చేసిన దాడులు వంటివాటిని వివరించే ప్రయత్నం చేశారు.
అయితే.. ఈ సందర్భంగా రాయుడు.. రైతులను వారించారు. ఇప్పుడు తాను దైవ కార్యంలో ఉన్నానని..ఇప్పుడు రాలేనని.. వీలు చూసుకుని వస్తానని సున్నితంగా తిరస్కరించి వెళ్లిపోయారు. అమరావతి గురించి తర్వాత మాట్లాడతానన్నారు. జై అమరావతి అనాలని రైతులు కోరగా… ఇప్పుడు అలాంటి నినాదాలు వద్దని చెప్పారు. అమరావతి రాజధానిగా ఉంటుందని రైతులకు చెప్పిన రాయుడు అక్కడ నుంచి హడావుడిగా కారు ఎక్కి వెళ్లిపోయారు. రాయుడు తమ శిబిరానికి వస్తారని భావించిన రైతులు ఆయన వెళ్లిపోవటంతో నిరాశకు లోనయ్యారు.
This post was last modified on July 31, 2023 5:47 pm
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…