Political News

అంబ‌టి రాయుడికి అమ‌రావ‌తి ఎఫెక్ట్‌..

గుంటూరు జిల్లాకు చెందిన ప్ర‌ముఖ క్రికెట‌ర్ అంబ‌టి తిరుప‌తి రాయుడికి రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల నుంచి సెగ‌తగిలింది. తానురాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని.. త్వ‌ర‌లోనే దీనిపై నిర్ణ‌యంతీసుకుంటాన‌ని ఆదిలో చెప్పిన ఆయ‌న ఈ క్ర‌మంలో ప‌లు గ్రామాల్లోనూ ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలో వైసీపీ పాల‌న‌పై ఆయ‌న ప్ర‌శంస‌లు కూడా కురిపించారు. అనంత‌రం.. ఎందుకో.. తాను ఇప్ప‌ట్లో రాజ‌కీయాల్లోకిరావ‌డం లేద‌ని కూడా చెప్పారు. ఇక‌, ఆయ‌న ప‌రిస్థితి రాజ‌కీయంగా ఎలా ఉన్నా.. తాజాగా ఆయ‌న అమ‌రావ‌తి ప్రాంతంలో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు.

తుళ్లూరు మండలం వెలగపూడికి వచ్చిన రాయుడు.. స్థానిక వీరభద్ర స్వామి ఆలయంలో కుటుంబంతో స‌హా పూజలు చేశారు. ఈ సందర్భంగా రాజ‌ధాని కోసం వేలాది రోజులుగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న రాజ‌ధాని రైతులు కూడా అక్క‌డ‌కు చేరుకున్నారు. అంబ‌టి రాయుడు పూజ‌లు పూర్త‌య్యే వ‌ర‌కు వారు అక్క‌డే వేచి ఉన్నారు. అనంత‌రం.. ఆయ‌న‌ను తమ శిబిరానికి రావాలని రైతులు ఆహ్వానించారు. దీక్షా శిబిరంలోకి వచ్చి తమ సమస్యలు వినాలని రైతులు కోరారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు రైతులు.. తాము రాజ‌ధాని కోసం ఇచ్చిన భూములు, ప్ర‌స్తుత ప్ర‌భుత్వం త‌మ‌పై చేసిన దాడులు వంటివాటిని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే.. ఈ సంద‌ర్భంగా రాయుడు.. రైతుల‌ను వారించారు. ఇప్పుడు తాను దైవ కార్యంలో ఉన్నాన‌ని..ఇప్పుడు రాలేన‌ని.. వీలు చూసుకుని వ‌స్తాన‌ని సున్నితంగా తిరస్కరించి వెళ్లిపోయారు. అమరావతి గురించి తర్వాత మాట్లాడతానన్నారు. జై అమరావతి అనాలని రైతులు కోరగా… ఇప్పుడు అలాంటి నినాదాలు వద్దని చెప్పారు. అమరావతి రాజధానిగా ఉంటుందని రైతులకు చెప్పిన‌ రాయుడు అక్క‌డ నుంచి హ‌డావుడిగా కారు ఎక్కి వెళ్లిపోయారు. రాయుడు తమ శిబిరానికి వస్తారని భావించిన రైతులు ఆయన వెళ్లిపోవటంతో నిరాశకు లోనయ్యారు.

This post was last modified on July 31, 2023 5:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago