Political News

ఛైర్మన్ కుర్చీకోసం మూడు ముక్కలాట

సుప్రపిద్ధ తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పదవి కోసం పార్టీలో ముగ్గురు సీనియర్ నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీరిలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు ఇద్దరుంటే మరొకరు బీసీ సామాజికవర్గం. నిజానికి వైసీపీలో ఎవరు ఏ స్ధానానికీ ప్రయత్నాలు చేసుకునేది అంటు ఉండదు. పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఇష్టప్రకారమే జరుగుతుంది. మొహమాటానికి వెళ్ళి, ఒత్తిళ్ళకు గురై జగన్ ఏ పోస్టును ఎవరికీ ఇవ్వరన్న విషయం ఇప్పటికే అనేకసార్లు రుజువైంది.

ఇప్పుడు విషయం ఏమిటంటే ప్రస్తుతం ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి బోర్డు కాలపరిమితి ఆగష్టు నెల 12వ తేదీతో ముగుస్తోంది. అప్పటికి కొత్త ఛైర్మన్ తో బోర్డు సభ్యులను జగన్ ఫైనల్ చేయాలి. లేదంటే రాజకీయ నియామకాలు కాకుండా ఉన్నతాధికారులతోనే స్పెసిఫైడ్ అథారిటితో వ్యవహారాలు నడపాల్సుంటుంది. ఇపుడు బీసీ సామాజికవర్గంలో ఛైర్మన్ పదవికోసం ఎంఎల్సీ జంగా కృష్ణమూర్తి పేరు వినబడుతోంది. అలాగే రెడ్డి సామాజికవర్గం నుండి మాజీ ఎంపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, తిరుపతి ఎంఎల్ఏ, మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పేర్లు వినబడుతున్నాయి.

రాబోయే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ పక్కా ప్లాన్ చేస్తున్నారు. జగన్ కోరిక నెరవేరాలంటే ముఖ్యంగా బీసీల మద్దతు చాలా అవసరం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే జంగా కృష్ణమూర్తి పేరును జగన్ పరిశీలిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. బీసీ సామాజికవర్గాలు అనేసరికి జగన్ దృష్టి ముఖ్యంగా జంగా పేనే ఉంటోంది.

ఇక మిగిలిన ఇద్దరిలో గతంలో ఎప్పుడో మేకపాటికి జగన్ టీటీడీ ఛైర్మన్ పోస్టు హామీ ఇచ్చారనే ప్రచారం ఇపుడు తెరపైకి వచ్చింది. మరి ఆ ప్రచారం ఎంతవరకు నిజమో తెలీదు కానీ ప్రచారమైతే బాగా జరుగుతోంది. ఇదే సమయంలో భూమన పేరు కూడా ప్రచారంలో ఉంది. గతంలోనే ట్రస్టుబోర్డుకు ఛైర్మన్ గా భూమన పనిచేసున్నారు. కాబట్టి మళ్ళీ ఇస్తారా అనేది సందేహంగా ఉంది. ఏదేమైనా రెండుమూడు రోజుల్లోనే ఈ విషయమై స్పష్టత వస్తుందని పార్టీలో టాక్ నడుస్తోంది.

This post was last modified on July 31, 2023 11:45 am

Share
Show comments

Recent Posts

కీర్తి సురేష్ ‘అక్క’ ఆషామాషీగా ఉండదు

బాలీవుడ్ లో బేబీ జాన్ తో అడుగు పెట్టిన కీర్తి సురేష్ కి తొలి సినిమానే డిజాస్టర్ కావడం నిరాశపరిచేదే…

2 minutes ago

పెమ్మసాని ఎత్తులకు అంబటి చిత్తు

అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు…

52 minutes ago

మీ పిల్లలు లంచ్ బాక్స్ లో ఇవి పెడుతున్నారా? అయితే జాగ్రత్త…

పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళుగా మారింది. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పిల్లలు తమ…

1 hour ago

కోడెల కరుణించకుంటే… సాయిరెడ్డి పరిస్థితేంటి?

రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం…

2 hours ago

మిస్టరీ స్పిన్ తో హిస్టరీ

ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…

2 hours ago

కలెక్టర్ ముందూ ‘మంచు’ వారి వాదులాట

టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…

3 hours ago