Political News

పార్లమెంటులో ‘ఇండియా’ రెచ్చిపోవటం ఖాయమా ?

పార్లమెంటులో ఇండియా కూటమి రెచ్చిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే మణిపూర్లో రెండురోజుల పాటు ఇండియా కూటమి తరపున 21 మంది ఎంపీలు పర్యటించి ఢిల్లీకి చేరుకున్నారు. తమ పర్యటనలో ఎంపీల బృందం ఇటు కుకీలు అటు మొయితీ తెగల నేతలతో సమావేశమయ్యారు. రెండు తెగల వాదనలు విన్నారు. మధ్యే మార్గంగా సమస్యల పరిష్కారానికి ఎంపీలు తమ సూచనలు, సలహాలు ఇచ్చారు. తర్వాత తమ పర్యటనలో తాము చూసింది, గ్రహించింది, సమస్యలు, పరిష్కారాలతో గవర్నర్ కు ఒక రిపోర్టిచ్చారు.

అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. కూటమిలోని అధినేతలందరికీ తమ రిపోర్టు కాపీలను సర్క్యులేట్ చేశారు. దాంతో ఈరోజు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపైనే కూటమి ఎంపీలు మాట్లాడేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయి. ఇప్పటికే కూటమి తరపున ప్రతిపాదించిన అవిశ్వాస నోటీసును లోక్ సభ స్పీకర్ ఓకే చేశారు. చర్చను ఎప్పుడు జరపాలి, ఓటింగ్ ఎప్పుడు జరుగుతుందనే విషయాన్ని స్పీకర్ ప్రకటించాల్సుంది. బహుశా ఆగస్టు 2,3 తేదీల్లో చర్చ, ఓటింగ్ జరిగే అవకాశముందని అనుకుంటున్నారు.

ఇంతలోనే మణిపూర్ లో పర్యటించిన ఎంపీల బృందం ఢిల్లీకి చేరుకుంది. కాబట్టి అవిశ్వాస తీర్మానానికి ముందే పార్లమెంటులో చర్చను లేవదీసేందుకు ఎంపీలు ప్రయత్నిస్తారు. దాన్న కచ్చితంగా ఎన్డీయే కూటమి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. దాంతో రెండు వైపుల నుండి గొడవలు జరగటం ఖాయం. మరీ పరిస్ధితిని నివారించేందుకు స్పీకర్ ఏమి చర్యలు తీసుకుంటారో చూడాలి.

స్పీకర్ ముందున్న మార్గం ఒకటే. సభా నిర్వహణకు అంతరాయం కలిగిస్తున్నారని చెప్పి ఎంపీలను బయటకు పంపేయటమే. అయితే అంతమాత్రాన సమస్య పరిష్కారమవ్వదు. ఎందుకంటే బయటకు వెళ్ళిపోయిన ఎంపీలకు బదులు సభల్లో ఉన్న ఎంపీలు గోల మొదలుపెడతారు. అప్పుడు స్పీకర్ అయినా ఎంతమంది ఎంపీలను బయటకు గెంటేస్తారు ? కాబట్టి అవినాశ్వ తీర్మానంపై చర్చను వెంటనే మొదలుపెడితే ఎలాంటి గోలుండదు. కానీ స్వయంగా మణిపూర్లో తిరిగొచ్చిన ఎంపీల బృందం ఏ పాయింట్లను లేవనెత్తుతుందో, ఏ అంశాలను ప్రస్తావిస్తోందో అనే టెన్షన్ నరేంద్రమోడీలో పెరిగిపోవటం ఖాయం. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

This post was last modified on July 31, 2023 11:42 am

Share

Recent Posts

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

4 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

4 hours ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

8 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

8 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

9 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

9 hours ago