Political News

పార్లమెంటులో ‘ఇండియా’ రెచ్చిపోవటం ఖాయమా ?

పార్లమెంటులో ఇండియా కూటమి రెచ్చిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే మణిపూర్లో రెండురోజుల పాటు ఇండియా కూటమి తరపున 21 మంది ఎంపీలు పర్యటించి ఢిల్లీకి చేరుకున్నారు. తమ పర్యటనలో ఎంపీల బృందం ఇటు కుకీలు అటు మొయితీ తెగల నేతలతో సమావేశమయ్యారు. రెండు తెగల వాదనలు విన్నారు. మధ్యే మార్గంగా సమస్యల పరిష్కారానికి ఎంపీలు తమ సూచనలు, సలహాలు ఇచ్చారు. తర్వాత తమ పర్యటనలో తాము చూసింది, గ్రహించింది, సమస్యలు, పరిష్కారాలతో గవర్నర్ కు ఒక రిపోర్టిచ్చారు.

అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. కూటమిలోని అధినేతలందరికీ తమ రిపోర్టు కాపీలను సర్క్యులేట్ చేశారు. దాంతో ఈరోజు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపైనే కూటమి ఎంపీలు మాట్లాడేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయి. ఇప్పటికే కూటమి తరపున ప్రతిపాదించిన అవిశ్వాస నోటీసును లోక్ సభ స్పీకర్ ఓకే చేశారు. చర్చను ఎప్పుడు జరపాలి, ఓటింగ్ ఎప్పుడు జరుగుతుందనే విషయాన్ని స్పీకర్ ప్రకటించాల్సుంది. బహుశా ఆగస్టు 2,3 తేదీల్లో చర్చ, ఓటింగ్ జరిగే అవకాశముందని అనుకుంటున్నారు.

ఇంతలోనే మణిపూర్ లో పర్యటించిన ఎంపీల బృందం ఢిల్లీకి చేరుకుంది. కాబట్టి అవిశ్వాస తీర్మానానికి ముందే పార్లమెంటులో చర్చను లేవదీసేందుకు ఎంపీలు ప్రయత్నిస్తారు. దాన్న కచ్చితంగా ఎన్డీయే కూటమి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. దాంతో రెండు వైపుల నుండి గొడవలు జరగటం ఖాయం. మరీ పరిస్ధితిని నివారించేందుకు స్పీకర్ ఏమి చర్యలు తీసుకుంటారో చూడాలి.

స్పీకర్ ముందున్న మార్గం ఒకటే. సభా నిర్వహణకు అంతరాయం కలిగిస్తున్నారని చెప్పి ఎంపీలను బయటకు పంపేయటమే. అయితే అంతమాత్రాన సమస్య పరిష్కారమవ్వదు. ఎందుకంటే బయటకు వెళ్ళిపోయిన ఎంపీలకు బదులు సభల్లో ఉన్న ఎంపీలు గోల మొదలుపెడతారు. అప్పుడు స్పీకర్ అయినా ఎంతమంది ఎంపీలను బయటకు గెంటేస్తారు ? కాబట్టి అవినాశ్వ తీర్మానంపై చర్చను వెంటనే మొదలుపెడితే ఎలాంటి గోలుండదు. కానీ స్వయంగా మణిపూర్లో తిరిగొచ్చిన ఎంపీల బృందం ఏ పాయింట్లను లేవనెత్తుతుందో, ఏ అంశాలను ప్రస్తావిస్తోందో అనే టెన్షన్ నరేంద్రమోడీలో పెరిగిపోవటం ఖాయం. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Satya

Recent Posts

రామాయణ డిమాండ్ సగానికి తగ్గిందా?

బాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ గ్రాండియర్ గా ప్రచారంలో ఉన్న రామాయణ పార్ట్ 1 దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఇంకా…

24 minutes ago

పెళ్లి కాలేదు… పిల్లల కోసం హీరోయిన్ ఏం చేసింది?

బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్‌లో కొనసాగుతున్న…

3 hours ago

ఇంకెంతమంది లెఫ్ట్ హ్యాండర్స్… పటిదార్ కనిపించట్లేదా?

జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…

4 hours ago

అనుభవం తోడయ్యుంటే ‘బంధం’ బలంగా ఉండేది  

ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…

4 hours ago

విశ్వంభరకు అసలు ఇరకాటం అదే

రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…

5 hours ago

జ‌న‌సేన‌లోకి వంగవీటి కుమార్తె..!

కాపు నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగ‌త వంగ‌వీటి మోహ‌న్‌రంగా కుమార్తె ఆశాల‌త త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…

5 hours ago