Political News

పార్లమెంటులో ‘ఇండియా’ రెచ్చిపోవటం ఖాయమా ?

పార్లమెంటులో ఇండియా కూటమి రెచ్చిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే మణిపూర్లో రెండురోజుల పాటు ఇండియా కూటమి తరపున 21 మంది ఎంపీలు పర్యటించి ఢిల్లీకి చేరుకున్నారు. తమ పర్యటనలో ఎంపీల బృందం ఇటు కుకీలు అటు మొయితీ తెగల నేతలతో సమావేశమయ్యారు. రెండు తెగల వాదనలు విన్నారు. మధ్యే మార్గంగా సమస్యల పరిష్కారానికి ఎంపీలు తమ సూచనలు, సలహాలు ఇచ్చారు. తర్వాత తమ పర్యటనలో తాము చూసింది, గ్రహించింది, సమస్యలు, పరిష్కారాలతో గవర్నర్ కు ఒక రిపోర్టిచ్చారు.

అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. కూటమిలోని అధినేతలందరికీ తమ రిపోర్టు కాపీలను సర్క్యులేట్ చేశారు. దాంతో ఈరోజు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపైనే కూటమి ఎంపీలు మాట్లాడేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయి. ఇప్పటికే కూటమి తరపున ప్రతిపాదించిన అవిశ్వాస నోటీసును లోక్ సభ స్పీకర్ ఓకే చేశారు. చర్చను ఎప్పుడు జరపాలి, ఓటింగ్ ఎప్పుడు జరుగుతుందనే విషయాన్ని స్పీకర్ ప్రకటించాల్సుంది. బహుశా ఆగస్టు 2,3 తేదీల్లో చర్చ, ఓటింగ్ జరిగే అవకాశముందని అనుకుంటున్నారు.

ఇంతలోనే మణిపూర్ లో పర్యటించిన ఎంపీల బృందం ఢిల్లీకి చేరుకుంది. కాబట్టి అవిశ్వాస తీర్మానానికి ముందే పార్లమెంటులో చర్చను లేవదీసేందుకు ఎంపీలు ప్రయత్నిస్తారు. దాన్న కచ్చితంగా ఎన్డీయే కూటమి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. దాంతో రెండు వైపుల నుండి గొడవలు జరగటం ఖాయం. మరీ పరిస్ధితిని నివారించేందుకు స్పీకర్ ఏమి చర్యలు తీసుకుంటారో చూడాలి.

స్పీకర్ ముందున్న మార్గం ఒకటే. సభా నిర్వహణకు అంతరాయం కలిగిస్తున్నారని చెప్పి ఎంపీలను బయటకు పంపేయటమే. అయితే అంతమాత్రాన సమస్య పరిష్కారమవ్వదు. ఎందుకంటే బయటకు వెళ్ళిపోయిన ఎంపీలకు బదులు సభల్లో ఉన్న ఎంపీలు గోల మొదలుపెడతారు. అప్పుడు స్పీకర్ అయినా ఎంతమంది ఎంపీలను బయటకు గెంటేస్తారు ? కాబట్టి అవినాశ్వ తీర్మానంపై చర్చను వెంటనే మొదలుపెడితే ఎలాంటి గోలుండదు. కానీ స్వయంగా మణిపూర్లో తిరిగొచ్చిన ఎంపీల బృందం ఏ పాయింట్లను లేవనెత్తుతుందో, ఏ అంశాలను ప్రస్తావిస్తోందో అనే టెన్షన్ నరేంద్రమోడీలో పెరిగిపోవటం ఖాయం. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

This post was last modified on July 31, 2023 11:42 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

18 mins ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

20 mins ago

ఏపీ హింస‌.. నిప్పులు చెరిగిన ఈసీ..

రాష్ట్రంలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ముగిసిన త‌ర్వాత చెల‌రేగిన తీవ్ర హింస‌ పై కేంద్ర ఎన్నికల సంఘం…

6 hours ago

దెయ్యాన్ని ప్రేమించే ‘లవ్ మీ’ కుర్రాడు

https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…

13 hours ago

రవితేజ సమస్యే నానికి వచ్చిందా

కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…

15 hours ago

విశ్వంభరలో స్టాలిన్ అక్కయ్య

చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…

16 hours ago