మరోసారి తెలంగాణ కాంగ్రెస్లో ముసలం మొదలైంది. తాను కాంగ్రెస్లోనే ఉంటున్నప్పటికీ పార్టీ మారతారనే ప్రచారం చేస్తున్నారని కీలక నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా ప్రకటించారు. తనను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీలోని ఓ కీలక నాయకుడే ఇదంతా చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. ఆ కీలక నాయకుడు ఎవరనే పేరు ఉత్తమ్ చెప్పనప్పటికీ.. అది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మళ్లీ ఉత్తమ్, రేవంత్ల మధ్య వార్ మొదలైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అయితే వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే పద్మావతి కాంగ్రెస్ను వీడి అధికార బీఆర్ఎస్లో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ఉత్తమ్ అనుచరుడు అనిల్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్కు హ్యాండిచ్చి.. కారెక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఉత్తమ్ పార్టీ మార్పు కచ్చితంగా ఉంటుందనే అభిప్రాయాలు బలపడ్డాయి. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఉత్తమ్కు ఎంపీ టికెట్, ఆయన భార్యకు ఎమ్మెల్యే టికెట్ రిజర్వ్ కూడా చేసుకున్నారని చెబుతున్నారు.
గత కొద్దికాలంగా ఈ ప్రచారం సాగుతుండడంతో మంట లేనిదే పొగ రాదనే చందంగా.. ఏదో నిజం దాగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ కండువా కప్పుకునే ప్రయత్నాల్లో ఉత్తమ్ ఉన్నారనే ఊహాగానాలు కూడా నిజమయ్యేలా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎలాగో పార్టీ మారడం ఖాయం కాబట్టి.. ఎలాంటి కారణం లేకుండా వెళ్తే బాగుండదని భావించిన ఉత్తమ్.. ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చారనే చర్చ జోరందుకుంది. పార్టీలో కీలక పదవిలో ఉన్న ఓ వ్యక్తే సామాజిక మాధ్యమాల్లో ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ అన్నారు. దీంతో పరోక్షంగా రేవంత్పై నిందలు మోపి.. చివరకు రేవంత్ కారణంగానే కాంగ్రెస్ వీడుతున్నట్లు ఉత్తమ్ ప్రకటించే రోజు ఎంతో దూరంలో లేదన్నది టాక్.
This post was last modified on July 30, 2023 10:12 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…