మరోసారి తెలంగాణ కాంగ్రెస్లో ముసలం మొదలైంది. తాను కాంగ్రెస్లోనే ఉంటున్నప్పటికీ పార్టీ మారతారనే ప్రచారం చేస్తున్నారని కీలక నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా ప్రకటించారు. తనను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీలోని ఓ కీలక నాయకుడే ఇదంతా చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. ఆ కీలక నాయకుడు ఎవరనే పేరు ఉత్తమ్ చెప్పనప్పటికీ.. అది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మళ్లీ ఉత్తమ్, రేవంత్ల మధ్య వార్ మొదలైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అయితే వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే పద్మావతి కాంగ్రెస్ను వీడి అధికార బీఆర్ఎస్లో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ఉత్తమ్ అనుచరుడు అనిల్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్కు హ్యాండిచ్చి.. కారెక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఉత్తమ్ పార్టీ మార్పు కచ్చితంగా ఉంటుందనే అభిప్రాయాలు బలపడ్డాయి. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఉత్తమ్కు ఎంపీ టికెట్, ఆయన భార్యకు ఎమ్మెల్యే టికెట్ రిజర్వ్ కూడా చేసుకున్నారని చెబుతున్నారు.
గత కొద్దికాలంగా ఈ ప్రచారం సాగుతుండడంతో మంట లేనిదే పొగ రాదనే చందంగా.. ఏదో నిజం దాగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ కండువా కప్పుకునే ప్రయత్నాల్లో ఉత్తమ్ ఉన్నారనే ఊహాగానాలు కూడా నిజమయ్యేలా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎలాగో పార్టీ మారడం ఖాయం కాబట్టి.. ఎలాంటి కారణం లేకుండా వెళ్తే బాగుండదని భావించిన ఉత్తమ్.. ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చారనే చర్చ జోరందుకుంది. పార్టీలో కీలక పదవిలో ఉన్న ఓ వ్యక్తే సామాజిక మాధ్యమాల్లో ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ అన్నారు. దీంతో పరోక్షంగా రేవంత్పై నిందలు మోపి.. చివరకు రేవంత్ కారణంగానే కాంగ్రెస్ వీడుతున్నట్లు ఉత్తమ్ ప్రకటించే రోజు ఎంతో దూరంలో లేదన్నది టాక్.
This post was last modified on July 30, 2023 10:12 pm
లోక్సభలో ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్రయోజనాల గురించి ప్రశ్నించిన నేతగా టీడీపీ ఎంపీ…
రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి అనూహ్యంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు రాజకీయ ప్రచారం…
సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి…
"మీ శ్రేయోభిలాషి.." అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం…
ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. కానీ.. ఇంతలోనే ఏపీలో ఏదో జరుగుతోందనే…
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు. రెండు రోజుల కిందటే…