ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీలన్నీ వ్యూహాలు, ప్రణాళికలు, కసరత్తులపై దృష్టి సారించాయి. తమకు పట్టున్న నియోజకవర్గాలు, గెలిచే అవకాశం ఉన్న ప్రాంతాలు.. ఇలా పార్టీల అధినేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలోని భీమిలి నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయాలని జనసేన చూస్తోంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే స్థానంపై దృష్టి పెట్టారని తెలిసింది.
2019 ఎన్నికల్లో భీమిలి నుంచి వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస రావు విజయం సాధించారు. అప్పుడు రెండో స్థానంలో టీడీపీ అభ్యర్థి సబ్బం హరి (91917 ఓట్లు) నిలిచారు. మూడో స్థానాన్ని జనసేన అభ్యర్థి పంచకర్ల సందీప్ (24248) దక్కించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేసేందుకు జనసేన చూస్తోంది. గత ఎన్నికల్లో 24 వేలకు పైగా సీట్లు సాధించడంతో ఈ సారి తమదే గెలుపు అంటూ ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీ పంచకర్ల సందీప్ ఆశాభావంతో ఉన్నారు. అందుకే ఈ నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారాన్ని ఈ నెల 30తో ప్రారంభించాలని నిర్ణయించారు.
మరోవైపు ఇక్కడి నుంచి తెలుగు దేశం పార్టీ తరపున ఓ మాజీ మంత్రితో పాటు కీలక నేతలూ పోటీకి సిద్ధంగా ఉన్నారు. జనసేన కూడా తగ్గేదే లేదు అంటోంది. ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా భీమిలిలో మాత్రం పోటీ చేసేందుకు జనసేన పట్టుదలతో ఉంది. భీమిలీలో జనసేన జెండా ఎగరేలని పార్టీ సమీక్షలో అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పష్టం చేశారు. ఇది బాబుకు తలనొప్పి తెచ్చి పెట్టే విషయంగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
This post was last modified on July 31, 2023 11:47 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…