Political News

భీమిలిని బాబు వ‌దులుకుంటారా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో పార్టీల‌న్నీ వ్యూహాలు, ప్ర‌ణాళిక‌లు, క‌స‌ర‌త్తుల‌పై దృష్టి సారించాయి. త‌మ‌కు ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాలు, గెలిచే అవ‌కాశం ఉన్న ప్రాంతాలు.. ఇలా పార్టీల అధినేత‌లు లెక్క‌లు వేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో విశాఖ‌లోని భీమిలి నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి పోటీ చేయాల‌ని జ‌న‌సేన చూస్తోంది. మ‌రోవైపు టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా ఇదే స్థానంపై దృష్టి పెట్టార‌ని తెలిసింది.

2019 ఎన్నిక‌ల్లో భీమిలి నుంచి వైసీపీ అభ్య‌ర్థి అవంతి శ్రీనివాస రావు విజ‌యం సాధించారు. అప్పుడు రెండో స్థానంలో టీడీపీ అభ్య‌ర్థి స‌బ్బం హ‌రి (91917 ఓట్లు) నిలిచారు. మూడో స్థానాన్ని జ‌న‌సేన అభ్య‌ర్థి పంచ‌క‌ర్ల సందీప్ (24248) ద‌క్కించుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం ఇక్క‌డి నుంచి మ‌రోసారి పోటీ చేసేందుకు జ‌న‌సేన చూస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో 24 వేల‌కు పైగా సీట్లు సాధించ‌డంతో ఈ సారి త‌మ‌దే గెలుపు అంటూ ఆ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జీ పంచ‌క‌ర్ల సందీప్ ఆశాభావంతో ఉన్నారు. అందుకే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటికీ ప్ర‌చారాన్ని ఈ నెల 30తో ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు.

మ‌రోవైపు ఇక్క‌డి నుంచి తెలుగు దేశం పార్టీ త‌ర‌పున ఓ మాజీ మంత్రితో పాటు కీల‌క నేత‌లూ పోటీకి సిద్ధంగా ఉన్నారు. జ‌న‌సేన కూడా త‌గ్గేదే లేదు అంటోంది. ఒక‌వేళ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా భీమిలిలో మాత్రం పోటీ చేసేందుకు జ‌న‌సేన ప‌ట్టుద‌ల‌తో ఉంది. భీమిలీలో జ‌న‌సేన జెండా ఎగ‌రేల‌ని పార్టీ స‌మీక్ష‌లో అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా స్ప‌ష్టం చేశారు. ఇది బాబుకు త‌ల‌నొప్పి తెచ్చి పెట్టే విష‌యంగా మార‌నుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

2 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

3 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

4 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

4 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

5 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

5 hours ago