Political News

భీమిలిని బాబు వ‌దులుకుంటారా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో పార్టీల‌న్నీ వ్యూహాలు, ప్ర‌ణాళిక‌లు, క‌స‌ర‌త్తుల‌పై దృష్టి సారించాయి. త‌మ‌కు ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాలు, గెలిచే అవ‌కాశం ఉన్న ప్రాంతాలు.. ఇలా పార్టీల అధినేత‌లు లెక్క‌లు వేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో విశాఖ‌లోని భీమిలి నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి పోటీ చేయాల‌ని జ‌న‌సేన చూస్తోంది. మ‌రోవైపు టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా ఇదే స్థానంపై దృష్టి పెట్టార‌ని తెలిసింది.

2019 ఎన్నిక‌ల్లో భీమిలి నుంచి వైసీపీ అభ్య‌ర్థి అవంతి శ్రీనివాస రావు విజ‌యం సాధించారు. అప్పుడు రెండో స్థానంలో టీడీపీ అభ్య‌ర్థి స‌బ్బం హ‌రి (91917 ఓట్లు) నిలిచారు. మూడో స్థానాన్ని జ‌న‌సేన అభ్య‌ర్థి పంచ‌క‌ర్ల సందీప్ (24248) ద‌క్కించుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం ఇక్క‌డి నుంచి మ‌రోసారి పోటీ చేసేందుకు జ‌న‌సేన చూస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో 24 వేల‌కు పైగా సీట్లు సాధించ‌డంతో ఈ సారి త‌మ‌దే గెలుపు అంటూ ఆ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జీ పంచ‌క‌ర్ల సందీప్ ఆశాభావంతో ఉన్నారు. అందుకే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటికీ ప్ర‌చారాన్ని ఈ నెల 30తో ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు.

మ‌రోవైపు ఇక్క‌డి నుంచి తెలుగు దేశం పార్టీ త‌ర‌పున ఓ మాజీ మంత్రితో పాటు కీల‌క నేత‌లూ పోటీకి సిద్ధంగా ఉన్నారు. జ‌న‌సేన కూడా త‌గ్గేదే లేదు అంటోంది. ఒక‌వేళ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా భీమిలిలో మాత్రం పోటీ చేసేందుకు జ‌న‌సేన ప‌ట్టుద‌ల‌తో ఉంది. భీమిలీలో జ‌న‌సేన జెండా ఎగ‌రేల‌ని పార్టీ స‌మీక్ష‌లో అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా స్ప‌ష్టం చేశారు. ఇది బాబుకు త‌ల‌నొప్పి తెచ్చి పెట్టే విష‌యంగా మార‌నుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

This post was last modified on July 31, 2023 11:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

9 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

11 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

40 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago