Political News

వైసీపీ ఎంపీలు భ‌య‌ప‌డుతున్నారు!: ఉండ‌వ‌ల్లి హాట్ కామెంట్స్‌

మాజీ ఎంపీ, రాజ‌కీయ విశ్లేష‌కులు.. ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌.. వైసీపీ ఎంపీల‌పై షాకింగ్ కామెంట్లు చేశారు. కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్ష కూట‌మి ఇండియా అవిశ్వాస తీర్మానం ఇచ్చింద‌ని.. కానీ, దీనిని 36 మంది వైసీపీ ఎంపీలు వ్య‌తిరేకిస్తున్నామ‌ని ప్ర‌క‌టించ‌డం దారుణ‌మ‌ని వ్యాఖ్యానించారు. ఎందుకు వ్య‌తిరేకిస్తున్నారు? కేంద్రానికి వైసీపీ ఎంపీలు భ‌య‌ప‌డుతున్నారా? ఇలా చేస్తుంటే.. వారు భ‌య‌ప‌డుతున్నార‌నే అనుకుంటాం అని ఉండ‌వ‌ల్లి అన్నారు.

ఎవ‌రికి ఎన్ని సొంత ప‌నులు ఉన్నా.. కేంద్రంలో ఇప్పుడు వ‌చ్చిన అవ‌కాశం భ‌విష్య‌త్తులో రాద‌ని చెప్పారు. ఇప్పుడు అవిశ్వాసాన్ని అడ్డుపెట్టుకుని విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకి జ‌రిగిన అన్యాయాన్ని మ‌రోసారి పార్లమెంటు వేదిక‌గా చ‌ర్చించేందుకు వాడుకోవాల‌ని ఉండ‌వ‌ల్లి సూచించారు. రాష్ట్ర విభజన పై తీర్మానం చేసి పదేళ్ళు పూర్తయిందని చెప్పారు. అయితే.. ఇన్నేళ్ల‌లోనూ విభజన హామీలు అమలుకావటం లేదని విమర్శించారు.

ఏపీ ఎంపీలు పార్లమెంట్‌లో మోడీకి స‌హ‌క‌రిస్తున్నార‌నేందుకు త‌న ద‌గ్గ‌ర అనేక ఉదాహ‌ర‌ణలు ఉన్నాయ ని ఉండ‌వ‌ల్లి చెప్పారు. ఎన్నికల ముందైనా ఏపీకి జరిగిన అన్యాయంపై అవిశ్వాసంలో మాట్లాడాలని సూచించారు. మణిపూర్ సంఘటనపై 267, 176 రూల్స్ ప్రకారం పార్లమెంట్‌లో చర్చ జరగనివ్వాలని ఉండవల్లి చెప్పారు.

ఇది జ‌గ‌న్‌కే మంచిది కాదు!

ప్రధాని మోడీకి అన్ని విష‌యాల్లోనూ లోబ‌డి ఉండ‌డం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు మంచిది కాద‌ని ఉండ‌వ‌ల్లి హెచ్చ‌రించారు. గుజరాత్‌లో ముస్లింల ఊచకోత వల్లే మోడీ ప్రధాని అయ్యారని సంచ‌ల‌న విమ‌ర్శ చేశారు. వ‌లంటీర్ల వ్యవస్థపై కోర్టుకి వెళితే ఆ వ్యవస్థ రద్దవుతుందని, టీడీపీ, జనసేన పార్టీలు కోర్టుకి ఎందుకు వెళ్ల‌టం లేదని ఉండవల్లి నిలదీశారు.

This post was last modified on July 30, 2023 5:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్ళీ పవన్ పై కాంగ్రెస్ ఫైర్

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు భ‌గ్గుమ‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదు.. దిష్టి…

2 hours ago

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

8 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

8 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

10 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

10 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

11 hours ago