మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకులు.. ఉండవల్లి అరుణ్ కుమార్.. వైసీపీ ఎంపీలపై షాకింగ్ కామెంట్లు చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్ష కూటమి ఇండియా అవిశ్వాస తీర్మానం ఇచ్చిందని.. కానీ, దీనిని 36 మంది వైసీపీ ఎంపీలు వ్యతిరేకిస్తున్నామని ప్రకటించడం దారుణమని వ్యాఖ్యానించారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కేంద్రానికి వైసీపీ ఎంపీలు భయపడుతున్నారా? ఇలా చేస్తుంటే.. వారు భయపడుతున్నారనే అనుకుంటాం అని ఉండవల్లి అన్నారు.
ఎవరికి ఎన్ని సొంత పనులు ఉన్నా.. కేంద్రంలో ఇప్పుడు వచ్చిన అవకాశం భవిష్యత్తులో రాదని చెప్పారు. ఇప్పుడు అవిశ్వాసాన్ని అడ్డుపెట్టుకుని విభజన సమయంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని మరోసారి పార్లమెంటు వేదికగా చర్చించేందుకు వాడుకోవాలని ఉండవల్లి సూచించారు. రాష్ట్ర విభజన పై తీర్మానం చేసి పదేళ్ళు పూర్తయిందని చెప్పారు. అయితే.. ఇన్నేళ్లలోనూ విభజన హామీలు అమలుకావటం లేదని విమర్శించారు.
ఏపీ ఎంపీలు పార్లమెంట్లో మోడీకి సహకరిస్తున్నారనేందుకు తన దగ్గర అనేక ఉదాహరణలు ఉన్నాయ ని ఉండవల్లి చెప్పారు. ఎన్నికల ముందైనా ఏపీకి జరిగిన అన్యాయంపై అవిశ్వాసంలో మాట్లాడాలని సూచించారు. మణిపూర్ సంఘటనపై 267, 176 రూల్స్ ప్రకారం పార్లమెంట్లో చర్చ జరగనివ్వాలని ఉండవల్లి చెప్పారు.
ఇది జగన్కే మంచిది కాదు!
ప్రధాని మోడీకి అన్ని విషయాల్లోనూ లోబడి ఉండడం ముఖ్యమంత్రి జగన్కు మంచిది కాదని ఉండవల్లి హెచ్చరించారు. గుజరాత్లో ముస్లింల ఊచకోత వల్లే మోడీ ప్రధాని అయ్యారని సంచలన విమర్శ చేశారు. వలంటీర్ల వ్యవస్థపై కోర్టుకి వెళితే ఆ వ్యవస్థ రద్దవుతుందని, టీడీపీ, జనసేన పార్టీలు కోర్టుకి ఎందుకు వెళ్లటం లేదని ఉండవల్లి నిలదీశారు.
This post was last modified on July 30, 2023 5:27 pm
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…