Political News

ఏపీని సరిగా అర్థం చేసుకోని మోడీ

ఏపీ బీజేపీకి అధ్యక్షురాలిని నియమించినా, కార్యవర్గాన్ని మార్చినా, జాతీయ స్థాయిలో ఏపీ ఇన్చార్జిలను మార్చినా ఎలాంటి ఉపయోగముండదు. ఎందుకంటే మార్చాల్సింది నేతలను కాదన్న విషయాన్ని కేంద్ర నాయకత్వం గమనించటం లేదు. అసలు మారాల్సిందే నరేంద్ర మోడీ వైఖరి. ఏపీ విషయంలో మోడీ వైఖరి మారనంత వరకు అధ్యక్ష స్థానంలో ఎవరున్నా, ఎన్ని కార్యవర్గాలను మార్చినా, ఇన్చార్జిలుగా ఎవరిని నియమించినా ఎలాంటి ఉపయోగముండదు. చేయాల్సిన డ్యామేజంతా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జరుగుతు పార్టీని రిపేర్లు చేయమంటే ఎలా సాధ్యం.

పార్టీ అధ్యక్ష బాధ్యతలను సోమువీర్రాజును తప్పించి దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగిస్తే ఏమవుతుంది ? ఆమేమీ ప్రజాకర్షక నేత కాదు, పోనీ తమ సామాజికవర్గంపై తిరుగులేని పట్టుందా అంటే అదీలేదు. కాబట్టి పురందేశ్వరి పార్టీ బలోపేతానికి చేయగలిగిందేమీ లేదు. ఇక జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్ ను కంటిన్యూ చేయాలని చేస్తున్నారు. ఆయన వల్ల కూడా పార్టీకి ఓట్ల సాధనలో ఎలాంటి ఉపయోగముండదు. ఎందుకంటే ఈయనకు పార్టీలోనే పట్టులేదు. మామూలు జనాలకు ఈయనెవరో కూడా తెలీదు.

2014 లో విభజన తర్వాత బాధ్యతలు తీసుకున్న నరేంద్రమోడీ విభజన హామీలను అమలు చేసుంటే పార్టీకి ఎంతోకొంత మైలేజీ వచ్చుండేది. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ చిత్తశుద్దితో ప్రయత్నిస్తోందని, విభజన హామీలను అమలుచేస్తోందన్న కారణంగా జనాలు కూడా బీజేపీకి మద్దతిచ్చేవారేమో. కానీ అలాచేయకుండా మోడీ రివర్సులో వ్యవహరించారు. విభజన హామీలను తుంగలో తొక్కేశారు. అడుగడుగునా ఏపీ ప్రయోజనాలను దెబ్బ కొడుతునే ఉన్నారు. అలాంటపుడు బీజేపీని జనాలు ఎందుకు ఆదరించాలి ?

అందుకనే ఏ ఎన్నిక జరిగినా కనీసం డిపాజిట్లు కూడా ఇవ్వటం లేదు. జనాలు మొత్తం పార్టీపైన మండుతున్నపుడు అద్యక్షులను మార్చినా, కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటుచేసినా, ఇన్చార్జిలను కొత్తవారిని నియమించినా ఎలాంటి ఉపయోగముండదని మోడీ గ్రహించాలి. తప్పులన్నీ తనలోనే పెట్టుకుని ఎదుటి వాళ్ళు సరిగా పనిచేయటంలేదని, పార్టీని బలోపేతం చేయటంలేదని ఆగ్రహిస్తే ఉపయోగమేమిటి ? అందుకనే బీజేపీకి రాష్ట్రంలో ఏ మూలకూడా ఆదరణ దక్కటంలేదు. ఇపుడు తప్పులు దిద్దుకున్నా రిపేర్లు చేయటానికి కూడా పనికిరాని వాహనం లాగ తయారైపోయింది బీజేపీ పరిస్ధితి. మరిలాగే కొంతకాలం పాటు లాక్కుని రాకతప్పదు.

This post was last modified on July 30, 2023 12:56 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

జనసేన స్ట్రైక్ రేట్ మీద జోరుగా బెట్టింగులు.!

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో బెట్టింగుల జోరు ఎక్కువ.! నెల్లూరు జిల్లాలో అయితే ఓ ప్రజా ప్రతినిథి నేతృత్వంలోనే బెట్టింగులు…

8 hours ago

రీ-పోలింగ్ రాంబాబు.! ఎందుకీ దుస్థితి.?

అంబటి రాంబాబు.. పరిచయం అక్కర్లేని పేరిది. పేరుకి మంత్రి.! కానీ, ఆ నీటి పారుదల శాఖ తరఫున పెద్దగా మాట్లాడిందీ,…

8 hours ago

“నేడు నా పుట్టిన రోజు.. వైసీపీ చ‌చ్చిన రోజు”

"నేడు నా పుట్టిన రోజు.. వైసీపీ చ‌చ్చిన రోజు``- అని వైసీపీ రెబ‌ల్ ఎంపీ, టీడీపీ నాయ‌కుడు క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు…

8 hours ago

హీరో దర్శకుడి గొడవ – ఫేస్ బుక్కులో సినిమా

మాములుగా కొత్త సినిమా ఏదైనా థియేటర్లో లేదా ఓటిటిలో నిర్మాత నిర్ణయాన్ని బట్టి రావడం ఇప్పటిదాకా చూస్తున్నాం. కానీ సోషల్…

8 hours ago

నామినేష‌న్ వేసిన మోడీ.. చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ముచ్చ‌ట‌గా మూడో సారి కూడా వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌న నామినేష‌న్ స‌మ‌ర్పించారు. సొంత రాష్ట్రం…

8 hours ago

ఉండి టాక్‌: చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గంలో ర‌ఘురామ‌!

రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు. ఏమైనా కావొచ్చు. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉండి నియోజ‌క‌వర్గంలోనూ ఇదే చ‌ర్చ సాగుతోంది. పోలింగ్…

8 hours ago