తాజాగా ఇండియా టు డే-సీఎన్ఎక్స్ సంస్ధ తెలంగాణాకు సంబంధించి విడుదల చేసిన ప్రీ పోల్ సర్వే వివరాలు కాస్త ఆశ్చర్యంగానే ఉంది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ కు 8 వస్తాయట. ఇపుడు తొమ్మిది మంది ఎంపీలున్నారు. అంటే ఒక సీటు మైనస్ అవుతుందని తేలింది. ఇక బీజేపీకి ఆరుసీట్లు వస్తాయని సర్వే ద్వారా తేలింది. ఇపుడు నాలుగు ఎంపీ స్ధానాలు మాత్రమే ఉన్నాయి. అంటే రెండు సీట్లను బీజేపీ అదనంగా గెలుచుకుంటుంది.
ఇక కాంగ్రెస్ కు రెండు సీట్లు దక్కుతాయని చెప్పింది. ప్రస్తుతం హస్తంపార్టీకి మూడు ఎంపీ స్ధానాలున్నాయి. అంటే ఒకటి మైనస్ అవుతుందని సర్వే చెబుతోంది. మిగిలిన ఒక్క స్ధానం ఎంఐఎం నిలుపుకుంటుందని అర్ధమవుతోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే బీజేపీకి ఆరు నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలున్నాయని సర్వేలో తేలటమే. నిజానికి అసెంబ్లీ నియోజకవర్గాల విషయం చూస్తే అన్ని చోట్లా గట్టి అభ్యర్ధులు దొరక్క నానా అవస్తలు పడుతోంది.
ఇలాంటి పార్టీ ఏకంగా ఆరు ఎంపీ స్ధానాల్లో గెలుస్తుందని సర్వేలో తేలటమే ఆశ్చర్యంగా ఉంది. అయితే ఇక్కడో చిన్న లాజిక్ ఉంది. అదేమిటంటే పోయిన ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లలో గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. బ్యానెర్లు కట్టేందుకు, జెండాలు మోసేందుకు కూడా పార్టీకి జనాలు లేకపోయినా నాలుగు సీట్లు ఎలా గెలిచిందని చాలామంది ఆశ్చర్యపోయారు. అదే పద్దతిలో తమ బలం పెరగబోతోందని కమలనాదులు అంటున్నారు.
అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే ప్రచారం జరుగుతున్నట్లు కేసీయార్ పాలన మీద జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోంది. అదే నిజమైతే జనాల్లోని వ్యతిరేకత కాంగ్రెస్ కు ప్లస్ కావాలి కానీ బీజేపీకి ఎలాగ ప్లస్ అవుతుందన్నది హస్తంపార్టీ నేతల ప్రశ్న. ఎందుకంటే జాతీయస్ధాయిలో నరేంద్రమోడీ మీద కూడా వ్యతిరేకత ఉందని కాంగ్రె నేతలంటున్నారు. మోడీ, కేసీయార్ ఇద్దరి మీద జనాల్లో వ్యతిరేకత ఉందికాబట్టి అసెంబ్లీ, పార్లమెంటు రెండు ఎన్నికల్లోను కాంగ్రెసే లాభపడుతుందని నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే బీజేపీ ఆరు ఎంపీ సీట్లను గెలుస్తుందంటే నమ్మలేకపోతున్నారు.
This post was last modified on July 30, 2023 12:48 pm
కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో నిర్మాత దిల్ రాజు తీస్తున్న భారీ చిత్రం ఇటీవలే…
టాలెంట్ ఉన్నా టైం కలిసి రాక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అప్ కమింగ్ హీరోల్లో తిరువీర్ ఒకడు. పాపం…
ఎప్పుడో 2019 వన్డే ప్రపంచకప్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు మహేంద్రసింగ్ ధోని. ఆ తర్వాతి ఏడాది అధికారికంగా ఇంటర్నేషనల్…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి పరిస్థితి ఎలా ఉంది.. ఈ పార్టీ తరఫున కార్యక్రమాలు ఏ…
జూన్ 26 లెనిన్ విడుదల కావాలి. గతంలో మే 1 ఫిక్స్ చేసుకున్న డేట్ ని పెద్ది కోసం త్యాగం…
టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి...ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ…