కాంగ్రెస్ పార్టీలో పైర్బ్రాండ్ నేతగా సుపరిచితుడు అయి, అనంతరం అధికార టీఆర్ఎస్ పార్టీ పెద్దల భజన కార్యక్రమంలో మునిగిపోయిన జగ్గారెడ్డి సొంత పార్టీ నేతలకే షాకిచ్చిన సంగతి తెలిసిందే.
అయితే, పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమారెడ్డిని మాత్రం ఆయన అవకాశం వచ్చినపుడు సమర్థించేవారు పొగిడేవారు. తాజాగా ఆయనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రూపంలో షాక్ తగిలింది. అది కూడా ఉమ్మడి మెదక్ జిల్లా విషయంలోనే కావడం గమనార్హం.
ఒక్క ఆర్టీసీ సమ్మె అంశం మినహాయిస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పలు అంశాలపై ఆకాశానికి ఎత్తేశారు. తరచూ ప్రభుత్వాన్ని పొగుడుతూ.. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసమే అంటూ సర్దిచెప్పుకొచ్చారు. ఆఖరికి చిరకాలంగా వ్యతిరేకిస్తున్న హరీశ్ రావుతోను జగ్గారెడ్డి భేటీ అయ్యారు. తాజాగా టీఆర్ఎస్ సర్కారుకు ఒకింత అనుకూలమైన నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల కన్నుమూసిన దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డికి సంతాపం ప్రకటించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉప ఎన్నికలో రామలింగారెడ్డి భార్యకే టికెట్ ఇవ్వాలని కోరారు. రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఇస్తే.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో తాను మాట్లాడుతానని జగ్గారెడ్డి ప్రకటించేశారు.
అయితే, ఈ విషయంలో తాజాగా జగ్గారెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి షాకిచ్చారు. దుబ్బాక బై పోల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. దుబ్బాక ఎన్నికలపై ఎవరు ఎన్ని మాట్లాడినా అది వారి వ్యక్తిగతమన్న ఉత్తమ్… మండలాల వారిగా సమావేశాలు పెట్టాలని డీసీసీకి ఆదేశాలు జారీ చేశారు.
దుబ్బాక బరిలో కాంగ్రెస్ అభ్యర్థిని నిలపడానికి గల కారణాన్ని కూడా ఉత్తమ్ తెలిపారు. గతంలో టీఆర్ఎస్ పోటీ చేసింది కాబట్టే.. మేం కూడా పోటీ చేస్తామని ప్రకటించారు. స్వయంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన షాక్తో జగ్గారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…