కాంగ్రెస్ పార్టీలో పైర్బ్రాండ్ నేతగా సుపరిచితుడు అయి, అనంతరం అధికార టీఆర్ఎస్ పార్టీ పెద్దల భజన కార్యక్రమంలో మునిగిపోయిన జగ్గారెడ్డి సొంత పార్టీ నేతలకే షాకిచ్చిన సంగతి తెలిసిందే.
అయితే, పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమారెడ్డిని మాత్రం ఆయన అవకాశం వచ్చినపుడు సమర్థించేవారు పొగిడేవారు. తాజాగా ఆయనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రూపంలో షాక్ తగిలింది. అది కూడా ఉమ్మడి మెదక్ జిల్లా విషయంలోనే కావడం గమనార్హం.
ఒక్క ఆర్టీసీ సమ్మె అంశం మినహాయిస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పలు అంశాలపై ఆకాశానికి ఎత్తేశారు. తరచూ ప్రభుత్వాన్ని పొగుడుతూ.. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసమే అంటూ సర్దిచెప్పుకొచ్చారు. ఆఖరికి చిరకాలంగా వ్యతిరేకిస్తున్న హరీశ్ రావుతోను జగ్గారెడ్డి భేటీ అయ్యారు. తాజాగా టీఆర్ఎస్ సర్కారుకు ఒకింత అనుకూలమైన నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల కన్నుమూసిన దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డికి సంతాపం ప్రకటించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉప ఎన్నికలో రామలింగారెడ్డి భార్యకే టికెట్ ఇవ్వాలని కోరారు. రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఇస్తే.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో తాను మాట్లాడుతానని జగ్గారెడ్డి ప్రకటించేశారు.
అయితే, ఈ విషయంలో తాజాగా జగ్గారెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి షాకిచ్చారు. దుబ్బాక బై పోల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. దుబ్బాక ఎన్నికలపై ఎవరు ఎన్ని మాట్లాడినా అది వారి వ్యక్తిగతమన్న ఉత్తమ్… మండలాల వారిగా సమావేశాలు పెట్టాలని డీసీసీకి ఆదేశాలు జారీ చేశారు.
దుబ్బాక బరిలో కాంగ్రెస్ అభ్యర్థిని నిలపడానికి గల కారణాన్ని కూడా ఉత్తమ్ తెలిపారు. గతంలో టీఆర్ఎస్ పోటీ చేసింది కాబట్టే.. మేం కూడా పోటీ చేస్తామని ప్రకటించారు. స్వయంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన షాక్తో జగ్గారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
This post was last modified on August 17, 2020 12:31 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…