ఆంధ్రపదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడుతో సాగుతున్నారు. జగన్ను ఇంటికి పంపించడమే కాకుండా తాను ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని పవన్ చాలా సార్లు ప్రస్తావించారు. ఒక్కసారి సీఎం అవకాశం ఇవ్వండి అంటూ ఓటర్లను అడుగుతున్నారు. మరోవైపు ఎక్కడా ఏ సభ, సమావేశం జరిగినా ఆయన అభిమానులు.. సీఎం సీఎం అంటూ కేకలు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ సీఎం కోరికను బీజేపీ తీరుస్తానంటోంది.
పవన్ను సీఎం చేస్తామని బీజేపీ అంటోంది. అది ఎలా అంటారా? వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తుతోనే బీజేపీ బరిలో దిగే అవకాశం ఉంది. దీంతో తమ పొత్తులో భాగంగా పవన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోందని సమాచారం. ఇటీవల ఎన్డీయే సమావేశానికి కూడా పవన్ హాజరయ్యారు. దీంతో పవన్ను ముఖ్యమంత్రిగా నిలబెట్టాలని బీజీపీ అనుకుంటోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై బీజేపీ అధికారిక ప్రకటన చేసే అవకాశముందని అంటున్నారు.
మరోవైపు వైసీపీని ఓడించేందుకు అనుగుణంగా వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలని ఇతర పార్టీలను కలుపుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. కానీ టీడీపీతో మాత్రం పొత్తు ఉండదని బీజేపీ చెబుతూనే ఉంది. దీంతో టీడీపీని పవన్కూ దూరంగానే ఉంచాలనే ఆలోచనతో బీజేపీ.. ఆయన్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించే ఆస్కారముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టీడీపీ ఓటు బ్యాంకును కూడా తమ వైపు మళ్లించేందుకు బీజేపీ అధిష్ఠానం కసరత్తులు చేస్తోంది. టీడీపీని ఒంటరిగా మార్చి.. జనసేనతో పొత్తుతో లాభపడాలని చూస్తోంది. కానీ జనసేన- బీజేపీ పొత్తు ఆశించిన ఫలితాలు రాబట్టగలదా? అన్నదే ఇక్కడ ప్రశ్న.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…