ఆంధ్రపదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడుతో సాగుతున్నారు. జగన్ను ఇంటికి పంపించడమే కాకుండా తాను ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని పవన్ చాలా సార్లు ప్రస్తావించారు. ఒక్కసారి సీఎం అవకాశం ఇవ్వండి అంటూ ఓటర్లను అడుగుతున్నారు. మరోవైపు ఎక్కడా ఏ సభ, సమావేశం జరిగినా ఆయన అభిమానులు.. సీఎం సీఎం అంటూ కేకలు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ సీఎం కోరికను బీజేపీ తీరుస్తానంటోంది.
పవన్ను సీఎం చేస్తామని బీజేపీ అంటోంది. అది ఎలా అంటారా? వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తుతోనే బీజేపీ బరిలో దిగే అవకాశం ఉంది. దీంతో తమ పొత్తులో భాగంగా పవన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోందని సమాచారం. ఇటీవల ఎన్డీయే సమావేశానికి కూడా పవన్ హాజరయ్యారు. దీంతో పవన్ను ముఖ్యమంత్రిగా నిలబెట్టాలని బీజీపీ అనుకుంటోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై బీజేపీ అధికారిక ప్రకటన చేసే అవకాశముందని అంటున్నారు.
మరోవైపు వైసీపీని ఓడించేందుకు అనుగుణంగా వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలని ఇతర పార్టీలను కలుపుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. కానీ టీడీపీతో మాత్రం పొత్తు ఉండదని బీజేపీ చెబుతూనే ఉంది. దీంతో టీడీపీని పవన్కూ దూరంగానే ఉంచాలనే ఆలోచనతో బీజేపీ.. ఆయన్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించే ఆస్కారముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టీడీపీ ఓటు బ్యాంకును కూడా తమ వైపు మళ్లించేందుకు బీజేపీ అధిష్ఠానం కసరత్తులు చేస్తోంది. టీడీపీని ఒంటరిగా మార్చి.. జనసేనతో పొత్తుతో లాభపడాలని చూస్తోంది. కానీ జనసేన- బీజేపీ పొత్తు ఆశించిన ఫలితాలు రాబట్టగలదా? అన్నదే ఇక్కడ ప్రశ్న.
This post was last modified on July 29, 2023 4:26 pm
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…