Political News

రేవంత్‌కు కొత్త షాకివ్వ‌బోతున్న కేసీఆర్‌

టీఆర్ఎస్‌ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్ రెడ్డి మ‌ధ్య ఉన్న రాజ‌కీయ విమ‌ర్శ‌ల యుద్ధం గురించి ప్ర‌త్యేకం‌గా ప‌రిచ‌యం అవ‌సరం లేదు. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయ‌డంలో రేవంత్ ముందుంటారు. దాన్ని తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నిస్తుంది. అయితే, తాజాగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు కేసీఆర్ స‌ర్కారుకు కీల‌క అవ‌కాశం దొరికింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే అవినీతి ఎమ్మార్వో ఏసీబీకి చిక్కిన ఉదంతం.

హైద‌రాబాద్ కీసర తాసిల్దార్‌ నాగరాజు ఏసీబీ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తం లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉదంతం సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ ఎపిసోడ్ మ‌రిన్ని మ‌లుపులు తిరుగుతోంది. భూవివాదం సెటిల్‌మెంట్‌ కోసం తాసిల్దార్‌ నాగరాజు శుక్రవారం రూ.కోటి 10 లక్షల తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. లంచం ఇస్తున్న ఉప్పల్‌లోని సత్య డెవలపర్స్‌కు చెందిన చౌవ్ల శ్రీనాథ్‌యాదవ్‌, రాంపల్లి దయారా గ్రామానికి చెందిన కందాడి అంజిరెడ్డిని సైతం అరెస్టు చేశారు.

ఈ కేసులో కీలకవ్యక్తిగా ఉన్న రాంపల్లి దయారాకు చెందిన అంజిరెడ్డి ఇంట్లో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి సంబంధించిన పలు అధికారిక పత్రాలను ఏసీబీ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి.. ఎంపీలాడ్స్‌ సంబంధించిన పలు పత్రాలు, పలు వివాదాస్పద భూములపై రేవంత్‌రెడ్డి ఆర్టీఐ కింద చేసిన దరఖాస్తులు ఇందులో ఉన్నాయి. అంజిరెడ్డికి రేవంత్‌తో సన్నిహిత సంబంధాలు ఉండి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగానూ ఆరా తీస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఈ భారీ అవినీతి ఎపిసోడ్ అంశంతో రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ ఇరుకున పెట్ట‌డం ఖాయ‌మంటున్నారు.

This post was last modified on August 17, 2020 10:18 am

Share
Show comments
Published by
satya

Recent Posts

జ‌గ‌న్‌లో ఓట‌మి భ‌యానికిది సంకేత‌మా?

ఆంధ్ర‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకో వార‌మే స‌మ‌యం ఉంది. ఈ ఎన్నిక‌లు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు, అటు ప్ర‌తిప‌క్ష…

6 hours ago

ఫ్యామిలీ మ్యాన్ ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…

7 hours ago

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల…

11 hours ago

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

14 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

15 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

16 hours ago