తెలంగాణలో ఈ ఏడాది చివరినాటికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా మరో 8 మాసాల్లో పార్లమెంటు ఎన్నికలు కూడా జరగనున్నాయి. మొత్తం 119 స్థానాలున్న అసెంబ్లీ, 17 స్థానాలున్న పార్ల మెంటు ఎన్నికలను కూడా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా నే తీసుకున్నాయి. అయితే.. ఎవరికి వారు అధి కారంపై ధీమా, పార్లమెంటులో సత్తాపై ప్రకటనలు చేస్తున్నారు కానీ.. ప్రజల నాడిని పట్టలేక పోతున్నాయ ని తెలంగాణ మేధావులు అభిప్రాయపడుతున్నారు.
అధికార బీఆర్ ఎస్ పార్టీ పరిస్థితిని పక్కన పెడితే.. ఈ పార్టీని అధికారం నుంచి దింపేందుకు ఇతర పార్టీ లు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు ఎవరికి వారే అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ, ఈ పార్టీల దూకుడు ఎలా ఉన్నా.. ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలమవుతున్నా యనేది మేధావుల మాటగా ఉంది. ఎందుకంటే.. ఇప్పటికి రాష్ట్రం వచ్చి 9 ఏళ్లు పూర్తయినా.. కేసీఆర్ సర్కారు అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు అయిపోయినా.. వారి ఆశలు ఫలించలేదనే టాక్ వినిపిస్తోంది.
ఈ విషయాన్ని పార్టీలు కూడా గుర్తించాయి నిధులు, నియామకాలు, నీళ్లు అనే మూడు నినాదాలతో రాష్ట్రా న్ని సాధించుకున్నా.. వాటిని సాధించలేక పోయారనే వాదన వినిపిస్తోంది. పొరుగు రాష్ట్రాలతో జల వివాదాలు.. నియామకాల్లో ఇంకా స్పష్టత లేకపనోవడం.. నిధుల విషయంలో అప్పులు చేయడం వంటివి ప్రజ ల మధ్య చర్చకు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆయా విషయాల్లో సంతృప్తి లేదు. దీంతో ప్రస్తుతం ఇతర పార్టీలైనా ఈ విషయాలను బలంగా ప్రస్తావిస్తాయని వారు భావిస్తున్నారు.
కానీ, ఆదిశగా పార్టీలు ప్రయత్నం చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. పార్టీల్లో అంతర్గత విభేదాలతోనే కాలం వెళ్ల దీస్తుండడం.. పదవుల్లో మార్పులు వంటివి కూడా ప్రజలు హర్షించడం లేదు. ఇంకా ఏం మార్పులు అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. ఇది.. అంతిమంగా.. ఔనన్నా.. కాదన్నా..కేసీఆర్ తప్ప వారికి మరో ప్రత్యామ్నాయ మార్గం కనిపించడం లేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. కనీసం ఇప్పటికైనా పార్టీలు ప్రజల నాడిని గుర్తించాలని అంటున్నారు.
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…