తెలంగాణలో ఈ ఏడాది చివరినాటికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా మరో 8 మాసాల్లో పార్లమెంటు ఎన్నికలు కూడా జరగనున్నాయి. మొత్తం 119 స్థానాలున్న అసెంబ్లీ, 17 స్థానాలున్న పార్ల మెంటు ఎన్నికలను కూడా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా నే తీసుకున్నాయి. అయితే.. ఎవరికి వారు అధి కారంపై ధీమా, పార్లమెంటులో సత్తాపై ప్రకటనలు చేస్తున్నారు కానీ.. ప్రజల నాడిని పట్టలేక పోతున్నాయ ని తెలంగాణ మేధావులు అభిప్రాయపడుతున్నారు.
అధికార బీఆర్ ఎస్ పార్టీ పరిస్థితిని పక్కన పెడితే.. ఈ పార్టీని అధికారం నుంచి దింపేందుకు ఇతర పార్టీ లు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు ఎవరికి వారే అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ, ఈ పార్టీల దూకుడు ఎలా ఉన్నా.. ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలమవుతున్నా యనేది మేధావుల మాటగా ఉంది. ఎందుకంటే.. ఇప్పటికి రాష్ట్రం వచ్చి 9 ఏళ్లు పూర్తయినా.. కేసీఆర్ సర్కారు అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు అయిపోయినా.. వారి ఆశలు ఫలించలేదనే టాక్ వినిపిస్తోంది.
ఈ విషయాన్ని పార్టీలు కూడా గుర్తించాయి నిధులు, నియామకాలు, నీళ్లు అనే మూడు నినాదాలతో రాష్ట్రా న్ని సాధించుకున్నా.. వాటిని సాధించలేక పోయారనే వాదన వినిపిస్తోంది. పొరుగు రాష్ట్రాలతో జల వివాదాలు.. నియామకాల్లో ఇంకా స్పష్టత లేకపనోవడం.. నిధుల విషయంలో అప్పులు చేయడం వంటివి ప్రజ ల మధ్య చర్చకు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆయా విషయాల్లో సంతృప్తి లేదు. దీంతో ప్రస్తుతం ఇతర పార్టీలైనా ఈ విషయాలను బలంగా ప్రస్తావిస్తాయని వారు భావిస్తున్నారు.
కానీ, ఆదిశగా పార్టీలు ప్రయత్నం చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. పార్టీల్లో అంతర్గత విభేదాలతోనే కాలం వెళ్ల దీస్తుండడం.. పదవుల్లో మార్పులు వంటివి కూడా ప్రజలు హర్షించడం లేదు. ఇంకా ఏం మార్పులు అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. ఇది.. అంతిమంగా.. ఔనన్నా.. కాదన్నా..కేసీఆర్ తప్ప వారికి మరో ప్రత్యామ్నాయ మార్గం కనిపించడం లేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. కనీసం ఇప్పటికైనా పార్టీలు ప్రజల నాడిని గుర్తించాలని అంటున్నారు.
This post was last modified on July 28, 2023 9:17 pm
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…