తెలంగాణలో ఈ ఏడాది చివరినాటికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా మరో 8 మాసాల్లో పార్లమెంటు ఎన్నికలు కూడా జరగనున్నాయి. మొత్తం 119 స్థానాలున్న అసెంబ్లీ, 17 స్థానాలున్న పార్ల మెంటు ఎన్నికలను కూడా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా నే తీసుకున్నాయి. అయితే.. ఎవరికి వారు అధి కారంపై ధీమా, పార్లమెంటులో సత్తాపై ప్రకటనలు చేస్తున్నారు కానీ.. ప్రజల నాడిని పట్టలేక పోతున్నాయ ని తెలంగాణ మేధావులు అభిప్రాయపడుతున్నారు.
అధికార బీఆర్ ఎస్ పార్టీ పరిస్థితిని పక్కన పెడితే.. ఈ పార్టీని అధికారం నుంచి దింపేందుకు ఇతర పార్టీ లు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు ఎవరికి వారే అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ, ఈ పార్టీల దూకుడు ఎలా ఉన్నా.. ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలమవుతున్నా యనేది మేధావుల మాటగా ఉంది. ఎందుకంటే.. ఇప్పటికి రాష్ట్రం వచ్చి 9 ఏళ్లు పూర్తయినా.. కేసీఆర్ సర్కారు అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు అయిపోయినా.. వారి ఆశలు ఫలించలేదనే టాక్ వినిపిస్తోంది.
ఈ విషయాన్ని పార్టీలు కూడా గుర్తించాయి నిధులు, నియామకాలు, నీళ్లు అనే మూడు నినాదాలతో రాష్ట్రా న్ని సాధించుకున్నా.. వాటిని సాధించలేక పోయారనే వాదన వినిపిస్తోంది. పొరుగు రాష్ట్రాలతో జల వివాదాలు.. నియామకాల్లో ఇంకా స్పష్టత లేకపనోవడం.. నిధుల విషయంలో అప్పులు చేయడం వంటివి ప్రజ ల మధ్య చర్చకు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆయా విషయాల్లో సంతృప్తి లేదు. దీంతో ప్రస్తుతం ఇతర పార్టీలైనా ఈ విషయాలను బలంగా ప్రస్తావిస్తాయని వారు భావిస్తున్నారు.
కానీ, ఆదిశగా పార్టీలు ప్రయత్నం చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. పార్టీల్లో అంతర్గత విభేదాలతోనే కాలం వెళ్ల దీస్తుండడం.. పదవుల్లో మార్పులు వంటివి కూడా ప్రజలు హర్షించడం లేదు. ఇంకా ఏం మార్పులు అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. ఇది.. అంతిమంగా.. ఔనన్నా.. కాదన్నా..కేసీఆర్ తప్ప వారికి మరో ప్రత్యామ్నాయ మార్గం కనిపించడం లేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. కనీసం ఇప్పటికైనా పార్టీలు ప్రజల నాడిని గుర్తించాలని అంటున్నారు.
This post was last modified on July 28, 2023 9:17 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…