తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు నిలువరించే వారుకనిపించడం లేదా? ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ద్రుఢంగా ఉన్నప్పటికీ.. ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. పార్టీ చీఫ్పై అంతర్గత విభేదాలు ఇంకా చల్లారలేదు. రేవంత్రెడ్డితో కలిసి ముందుకు సాగాలన్న అధిష్ఠానం సూచనలు కూడా కేవలం నామమాత్రంగా మారిపోయాయి. దీనికితోడు.. ఎవరికివారే టికెట్లు ప్రకటించుకోవడం.. మరింత గందరగోళంగా మారింది.
నిజానికి వచ్చే ఎన్నికల్లో సింపతీని చూపించి గెలుపు గుర్రం ఎక్కాలని పార్టీ బావిస్తోంది. తెలంగాణ ఇచ్చింది మేమే.. అంటూ.. అనేక సందర్భాల్లో అధిష్టానం ప్రకటించింది. ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా చెబుతోంది. అయితే.. కొన్నాళ్లు ఈ నినాదం తీసుకువెళ్లినా.. మళ్లీ నాయకులు మరిచిపోయారు. అంతేకాదు.. రేవంత్కు చెక్పెడుతూ.. బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని తెరమీదికి తెచ్చారు. ఇది పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.
కొన్నాళ్ల కిందట ఎస్టీ ఎమ్మెల్యే సీతక్కను సీఎం చేస్తే తప్పేంటంటూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యూహాత్మకంగా తమకు చెక్ పెట్టారని భావిస్తున్న కొందరు నేతలు.. రేవంత్ను ఇరుకున పెట్టేలా.. బీసీ మంత్రం పఠిస్తున్నారు. బీసీ అభ్యర్థికి అవకాశం ఎందుకు ఇవ్వకూడదు.. అంటూ.. కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంటే.. మొత్తంగా నాయకుల ఆలోచన ఆలు.. లేదు.. చూలు లేదు.. అన్న సామెతను తలపిస్తోంది.
ఇంకొందరు తమ సత్తా చూపించుకునేందుకు వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకునేందుకు సొంత కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది కూడా పార్టీలో నేతలకు నేతలకు మధ్య విభేదాలను తెరమీదకి తెస్తోంది. దీంతో ఈ పరిణామం.. కాంగ్రెస్ దూకుడుకు బ్రేకులు వేస్తోందని అంటున్నారు పరిశీలకులు.. ఈ పరిస్థితి నుంచి పార్టీ అధిగమించి.. ప్రజల్లో తమను తాము బలోపేతం చేసుకోకపోతే.. చేజేతులా మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కావల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
This post was last modified on July 28, 2023 3:32 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…