వినేందుకు విచిత్రంగా అనిపిస్తుందా. కరోనా పుణ్యమా అని ఇప్పుడు ఇలాంటి సిత్రమైన సీన్ భారత పార్లమెంటులో చోటు చేసుకోనుంది సుదీర్ఘకాలం పాటు సాగే కరోనాతో కలిసి సాగాల్సిన అవసరాన్ని అందరూ గుర్తిస్తున్నారు.
దీంతో.. వర్షాకాల సమావేశాలకు పార్లమెంటు సిద్ధమవుతుంది. నిండుగా కనిపించే సభను ఇప్పటిలా మాదిరి.. తొలిసారి కొత్త విధానంలో తీర్చిదిద్దేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. కరోనా వేళ.. తప్పనిసరిగా పాటించాల్సిన భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వినూత్నంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో సరికొత్తగా చేస్తున్న ఏర్పాట్లు విన్నంతనే ఆశ్చర్యపోయేలా ఉన్నాయని చెబుతున్నారు.
ఇప్పటివరకు ఒకేసారి అటు లోక్ సభ.. రాజ్యసభ సమావేశాలు జరుగుతుంటాయి. అందుకు భిన్నంగా ఈసారి మాత్రం ఒక రోజు లోక్ సభ .. మరోరోజు రాజ్యసభ సభ నిర్వహించనున్నారు. అంతేకాదు.. లోక్ సభ జరిగే సమయంలో ఆ ఎంపీల్ని రాజ్యసభలోనూ కూర్చోబెట్టనున్నారు.అదే సమయంలో రాజ్యసభను నిర్వహించే సమయంలో అక్కడి సభ్యుల్ని లోక్ సభలో కూర్చోబెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. అప్పుడు మాత్రమే భౌతిక దూరాన్నిపాటించేలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.
మరి రెండు సభల్లో కూర్చుంటే.. సభ్యులకు ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుందన్న సందేహం అక్కర్లేదంటున్నారు. ఎందుకంటే.. తొలిసారి సభా కార్యకలాపాలు అందరికి కనిపించేలా ఒక్కో సభలో 85 అంగుళాల నాలుగు తెరల్ని.. గ్యాలరీల్లో 40 అంగుళాల ఆరు స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. గ్యాలరీలో కూర్చున్న సభ్యలు సభా కార్యకలాపాల్లో పాలు పంచుకునేలా ప్రతి సీటుకూ మైక్ తోపాటు.. స్విచ్ లను ఏర్పాటు చేస్తున్నారు.
అంతేకాదు.. ఏసభలో కూర్చున్నా.. పక్క సభలోని కార్యకలాపాలు ప్రత్యక్షంగా కనిపించేలా కేబుళ్లు ఏర్పాటు చేయటంతో పాటు.. ఏసీల ద్వారా అల్ట్రా వయోలెట్ జెర్మిసిడల్ ఇర్రిడియేషన్ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. దీంతో.. గాలి ద్వారా సంక్రమించే బ్యాక్టీరియా.. వైరస్ లను అడ్డుకునే అవకాశం ఉంది. అంతేకాదు.. సభ మధ్యలో కూర్చునే సచివాలయ సిబ్బంది మిగిలిన సభ్యులకు చేరువుగా వెళ్లకుండా వారి చుట్టూ పాలి కార్బొనేట్ తెరతో అడ్డుగోడ ఏర్పాటు చేస్తారు.
భౌతిక దూరాన్ని అనుసరించి రాజ్యసభలో 60 మందిని.. గ్యాలరీల్లో 51మంది కూర్చోబెట్టనున్నారు. మిగిలిన 132 మంది సభ్యుల్ని లోక్ సభలో సర్దు బాటు చేయనున్నారు. లోక్ సభలోనూ ఇదు తరహాలో కూర్చోబెట్టనున్నారు. ఇలా ఉభయ సభల సభ్యులు.. ఉభయ సభల్లో కూర్చొని సభల్లో కూర్చునే ఆసక్తికర సన్నివేశం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఇప్పటివరకు అనుకున్న సమాచారం ప్రకారం పార్లమెంటు సమావేశాలు ఆగస్టు చివరి వారంలో కానీ.. సెప్టెంబరు మొదటి వారంలో కానీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…