జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో షార్ట్ పీరియడ్ వార్ కు తెరలేపారు. శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు జనసేన నేతలు, కార్యాకర్తలంతా జగనన్న కాలనీలను సందర్శించాలని పిలుపిచ్చారు. కొద్దిరోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పేదలకు ఇళ్ళపట్టాలిచ్చి ప్రభుత్వం జగనన్న కాలనీలను ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. పట్టాలిచ్చిన ప్రాంతాల్లో ప్రభుత్వమే కాలనీలను ఏర్పాటుచేస్తోంది.
ఇళ్ల నిర్మాణాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. అయితే ఇపుడు కురుస్తున్న భారీవర్షాలకు ఆ కాలనీలన్నీ జలమయమైపోయాయి. ఇళ్ళ నిర్మాణాల కోసం వేసిన పునాదులు, పిల్లర్లు ఎక్కడో కూడా గుర్తుపట్టేందుకు లేనంతగా నీళ్ళు నిండిపోయాయి. దాంతో జనసేన అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకున్నది. అందుకనే సదరు కాలనీలను సందర్శించి ఫొటోలు, వీడియోలు తీసి పార్టీ ట్విట్టర్ తో పాటు ఇతర సోషల్ మీడియాలో పోస్టుచేయాలని పవన్ పిలుపిచ్చారు. దీనివల్ల జగనన్న కాలనీల అసలు వాస్తవాలు మిగిలిన జనాలకు కనబడుతుందని పవన్ అబిప్రాయపడ్డారు.
నేతలు, కార్యకర్తలంతా తమ నియోజకవర్గాలు, ఊర్లలో పది గంటలపాటు శనివారం వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసే పనిలోనే ఉండాలని పవన్ ఆదేశించారు. దీనివల్ల ఏమవుతుందంటే 175 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ జగనన్న కాలనీలు నిర్మాణంలో ఉన్నాయనే విషయం తెలుస్తుంది. ఆ నిర్మాణాలు చేస్తున్న ప్రాంతాలేవి, వాటి ప్రస్తుత పరిస్థితి కూడా జనాలకు స్పష్టంగా అర్ధమవుతుంది. ఆ సోషల్ మాడియా వార్ వల్ల జగన్ ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం దొరుకుతుందని పవన్ అభిప్రాయం.
ఇలాంటి సోషల్ మీడియా వార్ నే గతంలో కూడా జనసేన టేకప్ చేసింది. అప్పట్లో కూడా జగనన్న కాలనీలని ఒకసారి, రోడ్ల పరిస్ధితి అని మరోసారి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతరేకంగా బాగా పోరాడింది. జగనన్న కాలనీల్లో వీడియోలు, ఫొటోలు తీసేక్రమంలో కొన్నిచోట్ల గొడవలైనా మొత్తంమీద పోరాటం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. మళ్ళీ ఇంతకాలానికి పవన్ సోషల్ మీడియా వార్ కు సిద్ధమయ్యారు. మరి తాజా వార్ లో ఎలాంటి పరిస్ధితులు కనబడుతాయో చూడాల్సిందే.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…