ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో తాజాగా జరిగిన ఘర్షణలో ఇటు టీడీపీ, అటు వైసీపీ లకు చెందిన కార్యకర్తలు పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక, ఆయా ఆసుపత్రులకు నాయకులు వెళ్లి పరామర్శల యాత్రలుచేస్తున్నారు. అయితే.. వాస్తవానికి ఇంత మంది కార్యకర్తలు.. తీవ్ర గాయాలపాలు కావడానికి ఎవరిది తప్పు? అనే చర్చ స్థానికంగా తెరమీదికి వచ్చింది.
గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు, అదే ఎన్నికల్లో ఓడిపోయిన జీవీ ఆంజనేయులు మధ్య రాజకీయ వైరమే కాకుండా.. వ్యక్తిగత స్పర్థలు కూడా ఉన్నాయి. ఇవి వైసీపీకి ముందు నుంచి కూడా కొనసాగుతున్నాయి. గతంలో బొల్లా కాంగ్రెస్లో ఉన్నప్పుడు.. జీవీ టీడీపీలో తొలిసారి టికెట్ దక్కించుకున్నప్పటి నుంచి కూడా ఈ వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఇటీవల కాలంలో ఎన్నికల వేడి పెరిగింది.
వచ్చే ఎన్నికల్లో ఇరు పక్షాలు కూడా విజయం దక్కించుకుని తీరాలనే పట్టుదలతో ఉన్నాయి. ఇది రాజకీయంగా ఎవరి వ్యూహాలు వారికి ఉండడం తప్పు కాదు. అయితే.. ఇరు పక్షాలు కూడా.. వారి వారి కార్యకర్తలను రెచ్చగొట్టడంలో సక్సెస్ అయిన ఫలితంగానే ఇప్పుడు కార్యకర్తలు ఇంత పెద్ద సంఖ్యలో గాయపడ్డారనేది స్థానికంగా నాయకులు చెబుతున్న మాట. వైసీపీపై టీడీపీ, టీడీపీపై వైసీపీ విమర్శలు గుప్పిస్తున్నాయి.
అయితే, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు పదువుల ఆశ చూపించారని, ఎన్నికల్లో మరోసారి గెలిస్తే.. నామినేటెడ్ పదవులు ఇప్పిస్తామని.. వైసీపీ నేత, గెలుపు గుర్రం ఎక్కకపోతే.. మనకు నష్టమని.. టీడీపీ నేత నూరిపోసిన నేపథ్యంలో కార్యకర్తలు అంతిమంగా బాధితులు అయ్యారని అంటున్నారు. “నాయకులు, నాయకులు బాగానే ఉన్నారు. ఇప్పుడు కార్యకర్తలపై కేసులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆసుపత్రుల్లో ఉన్నారు. కూలికెళ్తే తప్ప పూట గడవదు” అని బాధితుడి తల్లి ఆవేదన వ్యక్తం చేయడం.. కార్యకర్తల పరిస్థితికి అద్దం పట్టింది.
This post was last modified on July 28, 2023 6:18 am
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…